OTT Telugu: సండే స్పెషల్ గా ఓ చిన్న సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మిస్టరీ థ్రిల్లర్ గా సాగే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ లో అదరగొడుతోంది. ఆ సినిమానే.. ‘‘నిశ్శబ్ధం’’. ఇవాళ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
నిశ్శబ్ధం ఓటీటీ

తెలుగు మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్ధం’ మూవీ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. సండే స్పెషల్ గా ఈ మూవీ ఇవాళ (మే 31) డిజిటల్ రిలీజ్ అయింది. 42 నిమిషాల ఈ చిన్న సినిమా ఓటీటీ లవర్స్ ను అలరిస్తోంది.
కథాసుధాలో
ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కథాసుధాలో భాగంగా ప్రతి ఆదివారం ఓ షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు నిశ్శబ్ధం మూవీ రిలీజైంది. ఈ చిత్రం కథను యండమూరి వీరేంద్రనాథ్ అందించడం విశేషం. తన కథలు, నవలలతో యండమూరి వీరేంద్రనాథ్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే.
సస్పెన్స్ డ్రామా
నిశ్శబ్ధం మూవీ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో సీనియర్ నటి సుధ, లావణ్య, జయంత్, రాఘవ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆంథోని మట్టిపల్లి డైరెక్టర్. వైట్ లైట్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఉపేంద్ర సింగం ఈ నిశ్శబ్ధం మూవీని నిర్మించాడు.
నిశ్శబ్ధం స్టోరీ
తనకు ఇష్టం లేకుండా సింధు అనే అమ్మాయిని కొడుకు రాఘవ పెళ్లి చేసుకోవడంతో రమాదేవి మనస్తాపానికి గురవుతుంది. ఈ వివాహాన్ని అస్సలు అంగీకరించలేక ఆమె కొడుకు, కోడలికి దూరంగా ఉంటుంది. మరోవైపు, ఇంట్లో జరిగిన ఒక చిన్న ప్రమాదం తర్వాత సింధుకు తన అత్తగారిపై నెమ్మదిగా అనుమానం మొదలవుతుంది.
ప్రెగ్నెన్సీతో
{{/usCountry}}తనకు ఇష్టం లేకుండా సింధు అనే అమ్మాయిని కొడుకు రాఘవ పెళ్లి చేసుకోవడంతో రమాదేవి మనస్తాపానికి గురవుతుంది. ఈ వివాహాన్ని అస్సలు అంగీకరించలేక ఆమె కొడుకు, కోడలికి దూరంగా ఉంటుంది. మరోవైపు, ఇంట్లో జరిగిన ఒక చిన్న ప్రమాదం తర్వాత సింధుకు తన అత్తగారిపై నెమ్మదిగా అనుమానం మొదలవుతుంది.
ప్రెగ్నెన్సీతో
{{/usCountry}}రమాదేవి, సింధు మధ్య అపోహలు పెరుగుతాయి. అదే సమయంలోనే, తన మావయ్య చెప్పాడని సింధు తెలియక రమాదేవికి ఒక సిరప్ ఇస్తుంది. అయితే, సింధు గర్భవతి అనే విషయం తెలియడంతో కథ మొత్తం మలుపు తిరుగుతుంది. రమాదేవి తన కోపాన్నంతా మరిచిపోయి, కోడలిపై తల్లిప్రేమను కురిపించడం ప్రారంభిస్తుంది.
స్లో పాయిజన్
అత్తగారి ప్రేమను చూసి, తాను అనవసరంగా అనుమానించానని సింధు బాధపడుతున్న తరుణంలో... ఆమె మావయ్య ఒక షాకింగ్ నిజం చెప్తాడు. తాను ఇచ్చిన సిరప్ ఒక స్లో పాయిజన్ అని అంటాడు. ఆ మాటతో సింధు తీవ్రమైన గుండెకోతతో కుంగిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? రమాదేవి చనిపోయిందా? సింధు ఏం చేసింది? అసలు స్లో పాయిజన్ ఎందుకు ఇచ్చారు? అన్నది నిశ్శబ్ధం సినిమాలో చూడాల్సిందే.