టాలీవుడ్ వెర్సటైల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న తాజా మూవీ 'ఓం శాంతి శాంతి:'. మలయాళంలో సంచలన విజయం సాధించిన 'జయ జయ జయ జయ హే' సినిమాకు ఇది అధికారిక తెలుగు రీమేక్. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది.
ఆహా గోల్డ్ మెంబర్స్కు మాత్రమే..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'ఆహా' (aha) ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. బుధవారం (మార్చి 4) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుండగా.. ఆహా గోల్డ్ మెంబర్స్ కు మాత్రం మంగళవారం (మార్చి 3) నుంచి అందుబాటులోకి వచ్చింది.
ఈ విషయాన్ని తరుణ్, ఈషా జోడీ ఫన్నీగా ఓ వీడియోతో చెప్పింది. అంతేకాదు ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ పై 30 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్లు ఈ జోడీ వెల్లడించింది.
ఓం శాంతి శాంతి శాంతి: స్టోరీ ఇదే
ఒక మధ్యతరగతి యువతి, పాతకాలపు ఆలోచనలు ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ చిత్ర ప్రధానాంశం. భర్త, అతని కుటుంబం నుండి ఎదురయ్యే అణచివేతను, గృహహింసను ఆమె ఎలా ఎదిరించింది? ఒక గృహిణిగా తన ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం ప్రేక్షకులకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో భర్తకు ఆమె బుద్ధి చెప్పే తీరు సినిమాకే హైలైట్గా నిలుస్తుంది.
రియల్ లైఫ్ జోడీ
ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ప్రేమలో పడ్డారనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. వెండితెరపై వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ అటు నటనతో పాటు ఇటు దర్శకత్వ బాధ్యతలతోనూ బిజీగా గడుపుతున్నాడు.
థియేటర్లలో మిస్ అయిన వారు ఒక మంచి సామాజిక సందేశంతో కూడిన వినోదాత్మక చిత్రాన్ని చూడాలనుకుంటే 'ఓం శాంతి శాంతి:'ని ఓటీటీలో చూడొచ్చు. మహిళా సాధికారతను, కుటుంబ వ్యవస్థలోని లోపాలను ఈ సినిమాలో వ్యంగ్యంగా, ఆలోచింపజేసేలా చూపించారు.
{{/usCountry}}థియేటర్లలో మిస్ అయిన వారు ఒక మంచి సామాజిక సందేశంతో కూడిన వినోదాత్మక చిత్రాన్ని చూడాలనుకుంటే 'ఓం శాంతి శాంతి:'ని ఓటీటీలో చూడొచ్చు. మహిళా సాధికారతను, కుటుంబ వ్యవస్థలోని లోపాలను ఈ సినిమాలో వ్యంగ్యంగా, ఆలోచింపజేసేలా చూపించారు.
{{/usCountry}}మలయాళంలో బేసిల్ జోసెఫ్ లీడ్ రోల్లో నటించాడు. అక్కడ మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కామెడీకి ఓ సీరియస్ మెసేజ్ ను జోడించి మూవీని తీసిన విధానం బాగా ఆకట్టుకుంది. అయితే తెలుగులో మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరి ఓటీటీలో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.