ఓం శాంతి శాంతి శాంతి: ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ తెలుగు రొమాంటిక్ కామెడీ వచ్చేది ఈ ఓటీటీలోకే..
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి: ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. థియేటర్లలో రిలీజైన నెల రోజులకు డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ మూవీ ఆహా వీడియో ఓటీటీలోకి వచ్చే వారం అడుగుపెట్టనుంది.
టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, తెలుగమ్మాయి ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓం శాంతి శాంతి శాంతి:' (Om Shanti Shanti Shantihi). థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా మార్చి 4న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఓం శాంతి శాంతి శాంతి: విశేషాలు
దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న తరుణ్ భాస్కర్.. ఈసారి పూర్తిస్థాయిలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'ఓం శాంతి శాంతి శాంతి:'. ఈ సినిమాలో అందమైన నటి ఈషా రెబ్బా ఫీమేల్ లీడ్గా నటించింది. నూతన దర్శకుడు ఏ.ఆర్. సజీవ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'జయ జయ జయ జయ హే' సినిమాకు అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కింది.
భార్యాభర్తల మధ్య జరిగే ఇగో క్లాషెస్, గృహహింస వంటి సున్నితమైన అంశాలను హాస్యభరితంగా చూపించిన ఈ సినిమా.. దురదృష్టవశాత్తూ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. థియేటర్లలో ఇది ఫ్లాప్గా మిగిలిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. ఒరిజినల్ మలయాళ వెర్షన్ 'జయ జయ జయ జయ హే' సినిమాను తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విపరీతంగా చూసేయడమే. ఒరిజినల్ ను చాలా మంది చూసేయడంతో.. మళ్లీ ఇదే కథను థియేటర్లలో డబ్బులు పెట్టి చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా తమ పాత్రలకు ప్రాణం పోసినప్పటికీ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయింది.
ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు.. మార్చి 4 నుంచే
థియేట్రికల్ రన్ ముగియడంతో.. మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ఫామ్పైకి తీసుకువస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం.. 'ఓం శాంతి శాంతి శాంతి:' మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’లో మార్చి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్ను ఆహా సొంతం చేసుకుంది. అయితే ఇక్కడో స్పెషాలిటీ ఉంది. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లకు మాత్రం ఈ సినిమా 24 గంటల ముందే అందుబాటులోకి రానుంది. అంటే వారు మార్చి 3 నుంచే సినిమాను చూడవచ్చు.
ఓం శాంతి శాంతి శాంతి: నటీనటులు
ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.
పెళ్లయిన కొత్త జంటగా తరుణ్, ఈషాల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ సినిమాలో సీనియర్ నటి రోహిణి, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


