ఓం శాంతి శాంతి శాంతి: ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ తెలుగు రొమాంటిక్ కామెడీ వచ్చేది ఈ ఓటీటీలోకే..
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి: ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. థియేటర్లలో రిలీజైన నెల రోజులకు డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ మూవీ ఆహా వీడియో ఓటీటీలోకి వచ్చే వారం అడుగుపెట్టనుంది.
టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, తెలుగమ్మాయి ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓం శాంతి శాంతి శాంతి:' (Om Shanti Shanti Shantihi). థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా మార్చి 4న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఓం శాంతి శాంతి శాంతి: విశేషాలు
దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న తరుణ్ భాస్కర్.. ఈసారి పూర్తిస్థాయిలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'ఓం శాంతి శాంతి శాంతి:'. ఈ సినిమాలో అందమైన నటి ఈషా రెబ్బా ఫీమేల్ లీడ్గా నటించింది. నూతన దర్శకుడు ఏ.ఆర్. సజీవ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'జయ జయ జయ జయ హే' సినిమాకు అధికారిక తెలుగు రీమేక్ గా తెరకెక్కింది.
భార్యాభర్తల మధ్య జరిగే ఇగో క్లాషెస్, గృహహింస వంటి సున్నితమైన అంశాలను హాస్యభరితంగా చూపించిన ఈ సినిమా.. దురదృష్టవశాత్తూ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. థియేటర్లలో ఇది ఫ్లాప్గా మిగిలిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. ఒరిజినల్ మలయాళ వెర్షన్ 'జయ జయ జయ జయ హే' సినిమాను తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విపరీతంగా చూసేయడమే. ఒరిజినల్ ను చాలా మంది చూసేయడంతో.. మళ్లీ ఇదే కథను థియేటర్లలో డబ్బులు పెట్టి చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా తమ పాత్రలకు ప్రాణం పోసినప్పటికీ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయింది.
ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు.. మార్చి 4 నుంచే
థియేట్రికల్ రన్ ముగియడంతో.. మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ఫామ్పైకి తీసుకువస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం.. 'ఓం శాంతి శాంతి శాంతి:' మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’లో మార్చి 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్ను ఆహా సొంతం చేసుకుంది. అయితే ఇక్కడో స్పెషాలిటీ ఉంది. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లకు మాత్రం ఈ సినిమా 24 గంటల ముందే అందుబాటులోకి రానుంది. అంటే వారు మార్చి 3 నుంచే సినిమాను చూడవచ్చు.
ఓం శాంతి శాంతి శాంతి: నటీనటులు
ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.
పెళ్లయిన కొత్త జంటగా తరుణ్, ఈషాల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ సినిమాలో సీనియర్ నటి రోహిణి, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

E-Paper












