ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్ల ప్లాస్టిక్ సర్జరీలపై చేసిన వీడియో దుమారం రేపుతోంది. అందులో జాన్వీ కపూర్ అందం కృత్రిమమని ఆరోపించడంతో, ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఒర్రీ (Orry) రంగంలోకి దిగాడు. ధృవ్ రాఠీని "యాంటీ నేషనలిస్ట్" అంటూ చాలా ఘాటుగా విమర్శించాడు.
ధృవ్ రాఠీ వీడియోలో ఏముంది?

యూట్యూబర్ ధృవ్ రాఠీ, బాలీవుడ్ సెలబ్రిటీల గొడవ ముదిరింది. జాన్వీ కపూర్ని టార్గెట్ చేస్తూ ధృవ్ చేసిన వీడియోపై సోషల్ మీడియా స్టార్ ఒర్రీ అలియాస్ ఒర్హాన్ అవత్రమణి సీరియస్ అయ్యాడు.
డిసెంబర్ 25న ధృవ్ రాఠీ తన ఛానెల్లో "ది ఫేక్ బ్యూటీ ఆఫ్ బాలీవుడ్ సెలబ్రిటీస్" అనే వీడియో పోస్ట్ చేశాడు. అందులో జాన్వీ కపూర్, దీపికా పదుకోన్, ప్రియాంక చోప్రా, కాజోల్ వంటి తారలు ప్లాస్టిక్ సర్జరీలు, బొటాక్స్, స్కిన్ లైటనింగ్ చేయించుకున్నారని చెప్పాడు.
ముఖ్యంగా జాన్వీ కపూర్ ఫోటోను థంబ్నెయిల్గా పెట్టి 'బిఫోర్ - ఆఫ్టర్' అంటూ చూపించడం వివాదానికి దారితీసింది.
ఒర్రీ ఘాటు రిప్లై: "అసలు నువ్వెవరో కూడా తెలియదు"
బంగ్లాదేశ్ ఘటనపై జాన్వీ స్పందించిన కొద్దిసేపటికే ధృవ్ ఈ వీడియో పెట్టాడని ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్ అయ్యింది. దీనిపై ఒర్రీ స్పందిస్తూ ధృవ్ రాఠీకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. అసలు నువ్వెవరో కూడా జాన్వీకి తెలియకపోవచ్చు అని ఎద్దేవా చేశాడు.
"నాకు తెలిసినంతవరకు ఇతను ఒక యాంటీ నేషనలిస్ట్. ఇతనికి ఫాలోవర్స్ ఉన్నా రైల్వే స్టేషన్లో ఫోటోగ్రాఫర్లు తనను పట్టించుకోలేదని ఏడ్చే రకం ఇతను. కేవలం అటెన్షన్ కోసమే ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు" అని ఒర్రీ మండిపడ్డాడు.
వరుస వివాదాల్లో ధృవ్
ధృవ్ రాఠీ ఈ మధ్య వరుసగా బాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నాడు. దీపికా పదుకోన్ స్కిన్ కలర్ మార్చుకుందని అనడంతో ఆమె ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. రణ్వీర్ సింగ్ లేటెస్ట్ సినిమా 'ధురంధర్' ఒక ప్రమాదకరమైన తప్పుడు ప్రచారం చేసే సినిమా అంటూ రివ్యూ ఇచ్చి విమర్శల పాలయ్యాడు.
{{/usCountry}}ధృవ్ రాఠీ ఈ మధ్య వరుసగా బాలీవుడ్ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నాడు. దీపికా పదుకోన్ స్కిన్ కలర్ మార్చుకుందని అనడంతో ఆమె ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. రణ్వీర్ సింగ్ లేటెస్ట్ సినిమా 'ధురంధర్' ఒక ప్రమాదకరమైన తప్పుడు ప్రచారం చేసే సినిమా అంటూ రివ్యూ ఇచ్చి విమర్శల పాలయ్యాడు.
{{/usCountry}}ధృవ్ రాఠీకి యూట్యూబ్ లో 3 కోట్లకుపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. అతడు తరచూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ ఎన్నో వీడియోలు చేస్తుంటాడు. ఏదో ఒక వివాదం క్రియేట్ చేయడం, వార్తల్లో నిలవడం ధృవ్ కు అలవాటుగా మారింది.