ధురంధర్​ సినిమాపై ధృవ్​ రాఠీ ఫైర్​.. 'ఇది దేశభక్తి కాదు, తప్పుడు ప్రచారం'

ప్రముఖ యూట్యుబర్​ ధృవ్ రాఠీ ధురంధర్​ సినిమాపై వీడియో చేశారు. ఈ వీడియోలో సినిమాని, సినిమాలో చూపించిన హింసను, రెహమాన్​ డకైత్​ పాత్రను చూపించిన విధానాన్ని, దర్శకుడు ఆదిత్య ధార్​ పొలిటికల్​ వ్యూస్​ని తీవ్రస్థాయిలో విమర్శించారు.

Published on: Dec 21, 2025, 07:39:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాక్సాఫీస్​ దగ్గర రికార్డుల మోత మోగిస్తున్న ధురంధర్​ సినిమాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రముఖ యూట్యూబర్​, పొలిటికల్​ కామెంటేటర్​ ధృవ్​​ రాఠీ! ఇది ఒక తప్పుడు 'ప్రాపగాండా' అని, వాస్తవాలు- కల్పితాలను మిళితం చేసి, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే విధంగా సినిమాను తీశారని మండిపడ్డారు. ఈ మేరకు తన యూట్యూబ్​ ఛానెల్​లో తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు.

ధురంధర్​పై ధృవ్​ రాఠీ వీడియో..
ధురంధర్​పై ధృవ్​ రాఠీ వీడియో..

ధురంధర్​, ఆదిత్య ధార్​పై ధ్రువ్​ రాఠీ ఫైర్​..

పాకిస్థాన్​లో ఒక భారత స్పై చేసే సాహసాల ఆధారంగా రూపొందిన సినిమా ఈ ధురంధర్​. ఇందులో రణ్​వీర్​ సింగ్​ నటించాడు. ఆదిత్య ధార్​ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై చాలా మంది ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. కానీ సినిమా థీమ్​, చెప్పిన విధానాన్ని ఇంకొందరు తప్పుబడుతున్నారు. ఫలితంగా ధురంధర్​పై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఇందులోకి ధృవ్​ రాఠీ కూడా ఎంట్రీ ఇచ్చారు.

“ఏది వాస్తవం? ఏది కల్పితం? అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇది ప్రేక్షకులకు తెలియదు. వారు చెప్పలేరు. సినిమాలో లీనమైపోయిన వారికి అసలు ఈ ప్రశ్నే రాదు. దానినే గుడ్డిగా నమ్ముతారు. అదే నిజం అని భావిస్తారు. వాస్తవ సంఘటనలకు డ్రామా స్టోరీ టెల్లింగ్​ని జోడించి చూపిస్తే, చరిత్రపై ప్రజల్లో ద్వంద్వ అభిప్రాయాలు కనిపిస్తాయి,” అని ధృవ్ రాఠీ అన్నారు.

ధురంధర్​ సినిమాలోని హింస, నేర స్వభావం కలిగిన పాత్రలను హైలైట్​ చేయడాన్ని కూడా ధృవ్ రాఠీ తప్పుపట్టారు.

“ఈ సినిమా హింస, గ్యాంగ్​స్టర్స్​ని గ్లోరిఫై చేస్తుంది. డ్రగ్స్​, కిడ్నాప్​, ఎక్స్​టార్షన్​, మర్డర్లలో రెహమాన్​ డకైత్​ ఒక కరుడుగట్టిన నేరస్తుడు. సొంత తల్లినే చంపేశాడు. కానీ సినిమాలో ఆయన్ని ‘కూల్​ స్వాగ్​’తో, స్టైలిష్​ లుక్స్​తో, వైరల్​ డ్యాన్స్​తో చూపించారు. ఇలాంటి ఉగ్రవాదులను ఈ విధంగా చూపించడం సరైన పద్ధతేనా?” అని యూట్యూబర్​ ప్రశ్నించారు.

సినిమాలో హింసను నార్మలైజ్​ చేయడంపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమయంలో ధృవ్​ రాఠీ ఈ వీడియో విడుదల చేశారు.

ధురంధర్​పై ధ్రువ్​ రాఠీ వీడియోని ఇక్కడ చూడండి:

“గ్యాంగ్స్​ ఆఫ్​ వస్సెపూర్​ సినిమాని తీసుకెళ్లి పాకిస్థాన్​లో పెట్టారు. యానిమల్​ రేంజ్​లో హింసను జోడించారు. పొలిటికల్​ ప్రాపగాండాను రుద్ది ధురంధర్​ అనే సినిమాని తీశారు,” అని ధ్రువ్​ రాఠీ అభిప్రాయపడ్డారు.

“ఆర్ట్​ అనేది ప్రజల హితం కోరుకునే విధంగా ఉండాలి. కానీ ఆదిత్య ధార్​ వంటి ఫిల్మ్​మేకర్లు దీనికి విరుద్ధం. సొంత దేశాన్ని ఎగతాళి చేస్తారు. మీరు నిజమైన దేశభక్తి సినిమాలు చూడాలని భావిస్తే.. సామ్​ బహదూర్​, బార్డర్​, 1971, సర్ఫరోష్​, నీరజా, స్వదేశ్​, చక్​ దే ఇండియా వంటివి చూడండి,” అని సలహా ఇచ్చారు.

“చివరిగా ఆదిత్య ధార్​కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తప్పుడు ప్రాంపగాండాలతో సినిమాలు చేయడం ఆపకేపోతే.. మీ లెగేసీ కూడా హిట్లర్​ ఫేవరెట్​ ఫిల్మ్​మేకర్​ (లెని రైఫెన్​స్టల్​)లా అయిపోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. రేపనే రోజున ఎవరైనా మీకు వ్యతిరేకంగా సినిమా తీస్తే మీ ఇమేజ్​ ఎమవుతుంది? ఆలోచించండి,” అని యూట్యూబర్​ అన్నారు.

సినిమాలోని పొలిటికల్​ వ్యూస్​తో తాను అంగీకరించకపోయినా, ధురంధర్​ స్టోరీటెల్లింగ్​ చాలా బాగుందని బాలీవుడ్​ నటుడు హృతిక్​ రోషన్​ ఇటీవలే కామెంట్స్​ చేశారు. ఈ విషయాన్ని కూడా ధృవ్​ రాఠీ ప్రస్థావించారు.

“ప్రాపగాండా ఉన్నా కూడా సినిమా బాగుందని హృతిక్​ రోషన్​ అంటున్నారు. కానీ సినిమా ఎంత బాగున్నా.. చివరికి అది ప్రాపగాండానే!” అని ధృవ్​ రాఠీ అన్నారు.

ధ్రువ్​ రాఠీని ట్రోల్​ చేస్తున్న నెటిజన్లు..

ధృవ్​ రాఠీ లేటెస్ట్​ వీడియోను చాలా మంది నెటిజన్లు ట్రోల్​ చేస్తున్నారు.

“ధురంధర్​ చూడొద్దని ధృవ్​ రాఠీ చెబుతున్నాడు. అయితే వెళ్లి చూడాల్సిందే,” అని ఒకరు ఎక్స్​లో పోస్ట్​ చేశారు. “ఏం మాట్లాడుతున్నారు హిట్లర్​పై తీసిన సినిమాలు ఎవరికీ నచ్చలేదు. కానీ మన ధూరంధర్​ సినిమాని అంతర్జాతీయంగా, పాకిస్థాన్​లో కూడా పొగుడుతున్నారు,” అని మరొకరు అన్నారు.

“హిందుస్థానీకి అతిపెద్ద శత్రువు హిందుస్థానీయే. పాకిస్థాన్​ రెండో స్థానంలో ఉంటుందని అజిత్​ దోవల్​ అన్నారు,” అని మరొకరు కామెంట్​ చేశారు.

“ఈ లాజిక్​తో సామ్​ బహదూర్​, బర్డర్​ వంటి సినిమాలు కూడా ప్రాపగాండా కిందకే వస్తాయి కదా,” అని ఇంకొకరు అన్నారు.

ఏదైమానా బాక్సాఫీస్​ వద్ద మాత్రం ధురంధర్​ సినిమా దూసుకెళుతోంది. విడుదలైన 16వ రోజు రూ. 33కోట్ల కలెక్షన్స్​ని రాబట్టింది. రూ. 500 కోట్ల క్లబ్​లో చేరింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More