OTT Movies: ఓటీటీలోని ఈ 5 సినిమాలు మిమ్మల్ని కంటతడి పెట్టిస్తాయి.. క్లైమ్యాక్స్ మనసును మెలిపెట్టేవే..
OTT Movies: ఓటీటీలోని ఈ ఐదు సినిమాలు మిమ్మల్ని కంటతడి పెట్టిస్తాయి. వీటిలో కన్నడ, తమిళం భాషలకు చెందిన మూవీస్ ఉన్నాయి. ఇవి తెలుగులోనూ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏవో ఇక్కడ చూడండి.
కథలోని ఎమోషన్స్ను ఆడియన్స్కు కనెక్ట్ చేయడంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఆడియన్స్ మనసులో ఆ బాధ చాలా ఏళ్ల పాటు ఉండిపోయేలా ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఇక్కడ చెప్పబోయే ఈ 5 సినిమాలు చూశాక.. మీరు రాత్రంతా ఆలోచనల్లో మునిగిపోతారు. కచ్చితంగా ఏడుస్తారు. ఆ క్యారెక్టర్స్తో ఎంతలా కనెక్ట్ అయిపోతారంటే అసలు నిజంగా ఇలా కూడా జరుగుతుందా అని మీకు అనిపిస్తుంది. రొమాంటిక్, సైకలాజికల్, ఎమోషనల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన బెస్ట్ సౌత్ ఇండియన్ ఎమోషనల్ మూవీస్ లిస్ట్ ఇది.

లవ్ మాక్టైల్ (Love Mocktail)
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కేజీఎఫ్ (KGF) లాంటి బ్లాక్బస్టర్స్ మాత్రమే కాదు.. గుండెను హత్తుకునే ఇలాంటి సినిమాలు కూడా చాలానే ఇచ్చింది. ఈ లిస్ట్లో ఇదొక స్పెషల్ సినిమా. ఎవరూ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రాకపోతే.. యాక్టర్స్ స్వయంగా ఫండింగ్ చేసుకుని మరీ ఈ సినిమా తీశారు. ఫైనల్గా సినిమా రిలీజ్ అయ్యాక, ఆ ఎండింగ్ చూసి ఆడియన్స్ అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
2020లో వచ్చిన ఈ సినిమాలో డార్లింగ్ కృష్ణ హీరోగా 'ఆదిత్య' క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమా క్లైమాక్స్ ఎంత ఎమోషనల్గా ఉంటుందంటే.. మీరు ఇప్పటివరకు చూసిన ఎమోషనల్ సినిమాలన్నింటినీ మర్చిపోయి ఈ లవ్ స్టోరీనే గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమాను మీరు యూట్యూబ్లో ఫ్రీగా చూడొచ్చు.
777 చార్లీ (777 Charlie)
2022లో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో బ్యూటిఫుల్ మూవీ ఇది. ఒక కుక్క, ఒక మనిషి మధ్య ఉన్న బాండింగ్, రిలేషన్షిప్ను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. చార్లీ అనే ఒక కుక్క.. మిగతా కుక్కలతో పాటు ఒక చోట బందీగా ఉంటుంది. అక్కడ ఆ మూగ జంతువులను దారుణంగా టార్చర్ చేస్తుంటారు. ఒకరోజు చార్లీ అక్కడినుంచి తప్పించుకుని పారిపోతుంది.
మరోవైపు ధర్మ అనే ఒక వ్యక్తి లైఫ్లో ఎవరూ లేకుండా ఒంటరిగా బతుకుతుంటాడు. అతను జనాలతో పెద్దగా కలవడు. సినిమాలోని ఒక ఇంపార్టెంట్ సీన్లో వీళ్లిద్దరూ కలుస్తారు. ఆ తర్వాత సాగే కథ మిమ్మల్ని ఎంతలా ఏడిపిస్తుందంటే.. సినిమా చూస్తున్నంత సేపు మీ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవడానికి మీరు చాలా కష్టపడతారు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
96
విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ తమిళ సినిమా '96'. 2018లో వచ్చిన ఈ మూవీ.. రామ్, జానకిల డిఫరెంట్ లవ్ స్టోరీ చుట్టూ తిరుగుతుంది. వీళ్లిద్దరూ స్కూల్లో కలిసి చదువుకుంటారు, ప్రేమించుకుంటారు. కానీ ఆ తర్వాత విడిపోతారు. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత ఒక స్కూల్ రీయూనియన్లో వీళ్లిద్దరూ కలుసుకుంటారు.
ఈ సినిమాలో ఎలాంటి వల్గర్ సీన్స్ ఉండవు. కేవలం ఎమోషన్స్తోనే కథను నడిపించారు. ప్రేమలో మునిగిపోయిన వాళ్లు ఎవరైనా సరే ఈ సినిమా చూస్తే కచ్చితంగా తమ కన్నీళ్లను ఆపుకోలేరు. ఈ మూవీ ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్ లాంటి ఓటీటీల్లో ఉంది.
3 (త్రీ) మూవీ
2012లో వచ్చిన '3' సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. ధనుష్, శృతి హాసన్ మెయిన్ లీడ్స్గా నటించారు. ఈ సినిమాలో హీరో రామ్, హీరోయిన్ జననీకి చిన్నప్పుడే ప్రేమ పుడుతుంది. చాలా కష్టాలు పడిన తర్వాత ఫైనల్గా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు.
కానీ సినిమా కొంచెం ముందుకు వెళ్లాక, లీడ్ క్యారెక్టర్కు ఒక భయంకరమైన జబ్బు ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత సినిమాలో మీరు చూసే సీన్స్ అన్నీ మీ హార్ట్ బ్రేక్ చేస్తాయి. ఇందులోని చాలా ఎమోషనల్ సీన్స్ మిమ్మల్ని విపరీతంగా ఏడిపిస్తాయి. ఈ మూవీ కూడా నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోల్లో ఉంది.
దియా (Dia)
2020లో రిలీజ్ అయిన మోస్ట్ ఎమోషనల్ కన్నడ సినిమా 'దియా'. ఈ స్టోరీ మొత్తం మెయిన్ క్యారెక్టర్ దియా స్వరూప్ చుట్టూ తిరుగుతుంది. దియాకు రోహిత్ అంటే ప్రాణం. వీళ్లిద్దరి బ్యూటిఫుల్ లవ్ స్టోరీని సినిమాలో చూపిస్తారు. కానీ అనుకోకుండా రోహిత్ చనిపోయాడని ఆమెకు తెలుస్తుంది.
ఆ షాక్ను తట్టుకోలేక దియా సూసైడ్ చేసుకోవాలని ఒక ట్రైన్ ముందు నిలబడుతుంది. కరెక్ట్గా అదే టైమ్లో ఆది అనే ఒక వ్యక్తి నుంచి ఆమెకు ఫోన్ వస్తుంది. ఆ ఒక్క కాల్ వల్ల దియా తన సూసైడ్ ప్లాన్ డ్రాప్ చేసుకుంటుంది.
ఆ తర్వాత దియా, ఆది చాలాసార్లు కలుస్తారు. ఫైనల్గా ఇద్దరూ ప్రేమలో పడతారు. సరిగ్గా అంతా సెట్ అయింది అనుకునే టైమ్లో.. స్టోరీలోకి మళ్లీ రోహిత్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మిమ్మల్ని కచ్చితంగా ఆలోచనలో పడేస్తుంది. ప్రైమ్ వీడియోలో మూవీ ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


