OTT Telugu: తమిళ బాక్సాఫీస్ దగ్గర క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకున్న పవర్ఫుల్ స్పోర్ట్స్ డ్రామా 'బ్లూ స్టార్' (Blue Star) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) ఈ సినిమా తెలుగు డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 10 నుంచి 'బ్లూ స్టార్' తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ కాబోతోందని ఈటీవీ విన్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది.
ఈటీవీ విన్ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్

ఈటీవీ విన్ రీసెంట్గా మైండ్ బ్లోయింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. "రెండు వైరి వర్గాలను ఒక్కటి చేసే ఆట.. సరిహద్దులు దాటే ప్రయాణం" అంటూ ఒక క్రేజీ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ గురువారం అంటే సెప్టెంబర్ 10 నుంచి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు రాబోతున్నట్లు కన్ఫర్మ్ చేసింది.
క్రికెట్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్లో థియేట్రికల్ రిలీజ్ అయినప్పుడు బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు తెలుగులోనూ డబ్ అయి రాబోతుండటంతో మన ఓటీటీ లవర్స్ తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారు.
బ్లూ స్టార్ కథేంటి? అసలు ఎందుకు చూడాలి?
బ్లూ స్టార్ మూవీ 2024లోనే తమిళంలో రిలీజైంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 6.9 రేటింగ్ ఉంది. రజనీకాంత్ తో కబాలి మూవీని తెరకెక్కించిన పా రంజిత్ డైరెక్ట్ చేశాడు.
1990ల కాలంలో అరక్కోణం (Arakkonam) నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. రంజిత్ (అశోక్ సెల్వన్), రాజేష్ (శాంతను భగ్యరాజ్) ఇద్దరూ వేర్వేరు వర్గాలకు చెందిన లోకల్ క్రికెట్ టీమ్ కెప్టెన్లు. మైదానంలో గెలవడమే లక్ష్యంగా ఇద్దరి మధ్య విపరీతమైన ఈగో, శత్రుత్వం నడుస్తూ ఉంటుంది.
అయితే ఊరిలోని కుల రాజకీయాలు, వివక్ష వల్ల వీళ్లిద్దరి క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడుతుంది. బయట నుంచి వచ్చే అసలైన శత్రువును ఎదుర్కోవడానికి, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ ఇద్దరు ప్రత్యర్థులు ఎలా ఒక్కటయ్యారనేది ఈ సినిమా మెయిన్ పాయింట్.
పా రంజిత్ మార్క్ ప్రొడక్షన్.. నటీనటుల పర్ఫార్మెన్స్
{{/usCountry}}అయితే ఊరిలోని కుల రాజకీయాలు, వివక్ష వల్ల వీళ్లిద్దరి క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడుతుంది. బయట నుంచి వచ్చే అసలైన శత్రువును ఎదుర్కోవడానికి, తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ ఇద్దరు ప్రత్యర్థులు ఎలా ఒక్కటయ్యారనేది ఈ సినిమా మెయిన్ పాయింట్.
పా రంజిత్ మార్క్ ప్రొడక్షన్.. నటీనటుల పర్ఫార్మెన్స్
{{/usCountry}}తమిళంలో వైవిధ్యమైన సినిమాలు తీసే విలక్షణ దర్శకుడు పా రంజిత్ తన 'నీలమ్ ప్రొడక్షన్స్' బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు ఎస్. జయకుమార్ డెబ్యూ మూవీ అయినప్పటికీ.. చాలా మెచ్యూర్డ్గా సోషల్ ఇష్యూస్ను క్రికెట్తో ముడిపెట్టి తెరకెక్కించారు.
అశోక్ సెల్వన్, శాంతను ఇద్దరూ తమ కెరీర్ బెస్ట్ యాక్టింగ్ ఇచ్చారు. వాళ్ల క్రికెట్ షాట్లు, ఎమోషనల్ సీన్లు చాలా నేచురల్గా ఉంటాయి. హీరోయిన్ కీర్తి పాండ్యన్ తన రోల్లో జీవించేసింది. '96' ఫేమ్ గోవింద్ వసంత అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి.
స్పోర్ట్స్ లవర్స్, ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వాళ్లు ఈ సినిమాను అస్సలు మిస్ కావద్దు. సెప్టెంబర్ 10 నుంచి ఈటీవీ విన్లో నేరుగా చూడొచ్చు.