ఓటీటీలోకి ఈ వారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వస్తున్న టాప్ 5 సినిమాలు ఇవే.. ఇక్కడ చూడండి

ఓటీటీలోకి ఈవారం తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తున్నాయి. వాటిని ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి. తెలుగు డిజాస్టర్ మూవీ మాస్ జాతర్ కూడా ఇందులో ఉంది.

Published on: Nov 26, 2025, 16:15:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈవారం ఓటీటీలో సౌత్ భాషలకు చెందిన కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ వస్తున్నాయి. వీటిలో ఒక మాస్ యాక్షన్ మూవీ, ఒక క్రేజీ కామెడీ, ఒక ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్, ఒక సైకలాజికల్ డ్రామా ఉన్నాయి. రవితేజ నటించిన 'మాస్ జాతర', షరాఫ్ యు ధీన్ ప్రధాన పాత్ర పోషించిన 'ది పెట్ డిటెక్టివ్', 'ఆర్యన్', 'రోనీ' ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషలకు చెందిన ఈ తాజా సినిమాలను నెట్‌ఫ్లిక్స్, జీ5, సన్ నెక్స్ట్ వంటి వివిధ ప్లాట్‌ఫామ్‌లలో చూడొచ్చు.

ఓటీటీలోకి ఈ వారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వస్తున్న టాప్ 5 సినిమాలు ఇవే.. ఇక్కడ చూడండి
ఓటీటీలోకి ఈ వారం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వస్తున్న టాప్ 5 సినిమాలు ఇవే.. ఇక్కడ చూడండి

మాస్ జాతర - నెట్‌ఫ్లిక్స్

మాస్ మూమెంట్స్, యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్‌లతో రవితేజ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భాను బోగవరపు రచించి, దర్శకత్వం వహించిన ఈ తెలుగు మూవీలో ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి ఒక గ్రామంలోని క్రైమ్ లార్డ్‌ను ఎలా ఎదుర్కొంటాడు అనేది ప్రధాన కథాంశం. ఈ సినిమాలో ప్రముఖ నటి శ్రీలీల కూడా నటించింది. థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు నాలుగు దక్షిణాది భాషల్లో శుక్రవారం (నవంబర్ 28) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ది పెట్ డిటెక్టివ్ - జీ5 ఓటీటీ

ఇదొక మలయాళ కామెడీ మూవీ. ఇందులో షరాఫ్ యు ధీన్ టైటిల్ పాత్ర టోనీ జోస్ అలూలా అనే పెంపుడు జంతువుల డిటెక్టివ్‌గా నటించాడు. తన స్నేహితురాలు కైకేయి తండ్రిని ఆకట్టుకోవడానికి డిటెక్టివ్ ఏజెన్సీలో చేరిన టోనీ.. అనుకోకుండా పెద్ద క్రైమ్ కేసుల్లో చిక్కుకుంటాడు. అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలున్న నేరస్థులను కూడా ఎదుర్కొంటాడన్నదే ఈ సినిమా. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ఫిమేల్ లీడ్ గా నటించింది. వినాయకన్, వినయ్ ఫోర్ట్, శ్యామ్ మోహన్, జోమోన్ జ్యోతిర్ వంటి నటులు కూడా ఉన్నారు.

గ్రీన్ - సన్ నెక్ట్స్ ఓటీటీ

కన్నడ సైకలాజికల్ డ్రామా ఈ గ్రీన్. ఈ సినిమాలో గోపాలకృష్ణ దేశ్‌పాండే ప్రధాన పాత్రలో నటించాడు. వాస్తవానికి, భ్రమలకు మధ్య పోరాడుతున్న మయన్న అనే వ్యక్తి కథ ద్వారా 'పారనాయిడ్ స్కిజోఫ్రెనియా' అనే మానసిక స్థితిని ఈ సినిమా లోతుగా చూపిస్తుంది. బాలాజీ మనోహర్, ఆర్జే విక్కీ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇది ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినీ అనుభవాన్ని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

రోనీ - జీ5 ఓటీటీ

కిరణ్ రాజ్ ప్రధాన పాత్రలో.. గురుతేజ్ శెట్టి దర్శకత్వం వహించిన మరో కన్నడ మూవీ ఇది. ఒక నటుడు అందరూ భయపడే ఒక రౌడీగా మారతాడు. నేర ప్రపంచాన్ని చూపించే ఈ మూవీలో.. చివరకు అతను తనను తాను మార్చుకునే తీరు కూడా చూడొచ్చు. సమీక్ష, అపూర్వ, పి రవి శంకర్, ఉగ్రమ్ మంజు, యష్ శెట్టి తదితరులు ఈ చిత్రంలో నటించారు.

ఆర్యన్ - నెట్‌ఫ్లిక్స్

నటుడు విష్ణు విశాల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు అతడే నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఒక వ్యక్తి టీవీ షోలో కొంతమందిని బందీగా పట్టుకుంటాడు. ఆత్మహత్య చేసుకునే ముందు మరిన్ని హత్యలు జరుగుతాయని హెచ్చరిస్తాడు. హత్యలు జరగడానికి సరిగ్గా ఒక గంట ముందు మాత్రమే బాధితుల గురించి తెలుస్తుంది. కథ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఈ సినిమా థియేటర్లలో ఆశించినంత విజయం సాధించలేకపోయింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More