Actress Anangsha Biswas About Vulgar Messages: డిజిటల్ స్ట్రీమింగ్ ప్రపంచంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటీటీ వెబ్ సిరీస్ 'మిర్జాపూర్'. ఈ ఓటీటీ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనంగ్షా బిస్వాస్ (Anangsha Biswas). ఈ పొలిటికల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో రాజకీయం, గ్లామర్ను ఉపయోగించి ఎదిగే 'జరీనా' అనే గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు.
బోల్డ్ క్యారెక్టర్ వల్ల వేధింపులు

ఇప్పుడు ఇదే కథ వెండితెరపై 'మీర్జాపూర్: ది మూవీ' రూపంలో రానున్ విషయం తెలిసిందే. అయితే, స్క్రీన్పై తాను పోషించిన బోల్డ్ క్యారెక్టర్ వల్ల నిజ జీవితంలో తీవ్రమైన వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఈ బెంగాలీ భామ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అసభ్యకరమైన మెసేజ్లు.. వ్యక్తిగత వేధింపులు
హిందీ రష్ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంగ్షా మాట్లాడుతూ.. మొదటి సీజన్ విడుదలైన తర్వాత తన ఇన్ బాక్స్ నిండా వికృత మెసేజ్లే దర్శనమిచ్చాయని చెప్పారు. రీల్ జీవితానికి, రియల్ జీవితానికి తేడా తెలియని కొందరు నెటిజన్లు తన పట్ల అత్యంత నీచంగా వ్యవహరించారని అనంగ్షా బిస్వాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్క రాత్రికి ఎంత తీసుకుంటారు?
"ఒక్క రాత్రికి ఎంత తీసుకుంటారు? రెండు రోజులు మోరీషస్కి వస్తారా? అంటూ ఈమెయిల్స్లో కొందరు అసభ్యకరంగా అడిగేవారు. నేను నటనను సరస్వతీ దేవిలా భావించి పూర్తి నిష్ఠతో పనిచేశాను. కానీ ప్రజలు నన్ను నిజ జీవితంలో కూడా అలాగే చూస్తారని ఊహించలేదు" అని అనంగ్షా బిస్వాస్ తీవ్రంగా కలత చెందారు.
పాత్రలను బట్టి వ్యక్తిత్వాన్ని చూడటం దారుణం
బోల్డ్ లేదా విలన్ పాత్రలు వేసే నటీనటులను విడిగా చూడగల మానసిక పరిణతి ప్రేక్షకుల్లో రావాలని ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన ఇంటర్వ్యూ కథనంలో ఆమె కోరారు. సినిమాల్లో పాత్రలను బట్టి నటుల వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూడటం దారుణమని ధ్వజమెత్తారు.
'మిర్జాపూర్: ది మూవీ'తో మళ్లీ వెండితెరకు
{{/usCountry}}బోల్డ్ లేదా విలన్ పాత్రలు వేసే నటీనటులను విడిగా చూడగల మానసిక పరిణతి ప్రేక్షకుల్లో రావాలని ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన ఇంటర్వ్యూ కథనంలో ఆమె కోరారు. సినిమాల్లో పాత్రలను బట్టి నటుల వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూడటం దారుణమని ధ్వజమెత్తారు.
'మిర్జాపూర్: ది మూవీ'తో మళ్లీ వెండితెరకు
{{/usCountry}}ఇదిలా ఉంటే, ఓటీటీలో రికార్డులు సృష్టించిన మీర్జాపూర్ సిరీస్, ఇప్పుడు బిగ్ స్క్రీన్ సినిమాగా రూపాంతరం చెందుతుండటం అరుదైన విషయంగా చెప్పవచ్చు. అభిమానుల నుంచి వచ్చిన భారీ డిమాండ్ చూసే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత ఫర్హాన్ అక్తర్ స్పష్టం చేశారు.
అభిమానుల ప్రేమాభినాల ఫలితమే
"ఎక్కడికి వెళ్లినా మీర్జాపూర్ నెక్ట్స్ వెర్షన్ ఎప్పుడు వస్తుందని నన్ను అడిగేవారు. అభిమానుల ప్రేమాభిమానాల ఫలితమే ఈ చిత్రం" అని ఫర్హాన్ అక్తర్ సంతోషం వ్యక్తం చేశారు.
మీర్జాపూర్ సినిమా నటీనటులు
ఈ భారీ ప్రాజెక్ట్లో ఖాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గూడ్డూ పండిట్గా అలీ ఫజల్, మున్నా భయ్యాగా దివ్యేందు శర్మ, బీనా త్రిపాఠిగా రసికా దుగల్ తిరిగి సందడి చేయనున్నారు. మొదటి సీజన్లో విక్రాంత్ మాస్సీ పోషించిన ‘బబ్లూ పండిట్’ పాత్రను ఈ సినిమాలో 'పంచాయత్' ఫేమ్ జితేంద్ర కుమార్ పోషిస్తుండటం విశేషం.
బోల్డ్ కంటెంట్ చేసే నటీనటులకు
తెలుగు రాష్ట్రాల్లోనూ 'మీర్జాపూర్' సిరీస్కు విశేషమైన క్రేజ్ ఉంది. డిజిటల్ మాధ్యమాల్లో బోల్డ్ కంటెంట్ చేసే నటీనటులు ఆన్లైన్ ట్రోలింగ్, సైబర్ వేధింపులకు గురికావడంపై ఇప్పుడు టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.