P Susheela Janaki: ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలో లెజెండరీగా ఎదిగిన ఎస్.జానకి ఇప్పుడు మన మధ్యలో లేరు. శనివారం (జూలై 11) ఆమె మరణించిన సంగతి తెలిసిందే. ఆమె కన్నుమూశారనే వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మరో దిగ్గజ సింగర్ పి.సుశీల ఎమోషనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
పి సుశీల ఎమోషనల్

జానకమ్మ మరణంపై పి.సుశీల ఎమోషనల్ అయ్యారు. జానకి గురించి సుశీలమ్మ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
‘‘ఏం చెప్పాలమ్మా. మద్రాస్ లో రెండు పర్వతాలం మేం. ఆవిడ (జానకి) గడగడలాడించింది. దెబ్బ మీద దెబ్బ కొట్టి ఆవిడను తీసుకెళ్లి పోయాడు దేవుడు. ఇప్పుడు మ్యూజిక్కే లేదు. ఆ పిల్ల ఎన్ని రకాలుగా పాడుతుందో ఎవరూ ఊహించలేదు. అందుకే ఆవిడకు నా పేరు మీద ఫస్ట్ అవార్డు ఇచ్చాం. నా జీవితంలో నేను చేసిన మంచి పని అదే’’ అని సుశీలమ్మ ఎమోషనల్ అయ్యారు.
కళ్ల నీళ్లు రావడం లేదు
‘‘తెలియకుండానే పుడతాం. తెలియకుండానే వెళ్లిపోతాం. మగ గొంతుతో, చిన్న పిల్లలా, పెద్దవాడిలా ఆమె పాడేది. ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకోవాలో ఆవిడకు తెలుసు. నేను ఆమె పక్కన ఉత్సవ విగ్రహమే. ఆమె లేని బాధ ఇది. కళ్ల నీళ్లు కూడా రావడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు’’ అని బాధ పడుతూ సుశీల చెప్పారు.
కళ్లు చల్లబడ్డాయా?
{{/usCountry}}‘‘తెలియకుండానే పుడతాం. తెలియకుండానే వెళ్లిపోతాం. మగ గొంతుతో, చిన్న పిల్లలా, పెద్దవాడిలా ఆమె పాడేది. ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకోవాలో ఆవిడకు తెలుసు. నేను ఆమె పక్కన ఉత్సవ విగ్రహమే. ఆమె లేని బాధ ఇది. కళ్ల నీళ్లు కూడా రావడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు’’ అని బాధ పడుతూ సుశీల చెప్పారు.
కళ్లు చల్లబడ్డాయా?
{{/usCountry}}‘‘ఆవిడను సరస్వతి దేవి పిలుచుకుంటుందని అనుకుంటున్నా. అక్కడ కచేరీ కోసం రమ్మని ఉంటుంది. ఈ లక్ ఎవరికీ రాదు. ఉన్నన్నాళ్లూ మా ఇద్దరిని వేధించారు. నా మీద ఆవిడకు, ఆవిడ మీద నాకు చెప్పి ఏడిపించుకుని తిన్నారు. ఇప్పుడు వాళ్లద్దరికీ చల్లగా ఉంటాయా కళ్లు? ఏం సాధించారు మీరు? ఆవిడ అన్ని సాధించింది.
ఆమెకు చావు లేదు. సరస్వతీ పక్కనే ఆమె ఉంటుంది. జనం పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇలాంటి వాయిస్ దొరికింది’’ అని 90 ఏళ్ల సుశీలమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
మరణం లేని గొంతు
88 ఏళ్ల జానకమ్మ అనారోగ్య కారణాలతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రం కర్ణాటకలో ప్రభుత్వ లాంఛనాలతో జానకి అంత్యక్రియలు జరిగాయి. 20 భాషల్లో దాదాపు 48 వేలకు పైగా పాటలు పాడారు జానకమ్మ. మధుర గానంతో ప్రేక్షకులను అలరించారు. అందుకే జానకమ్మకు మరణం ఉంటుందేమో కానీ ఆమె గొంతుకు మరణం ఉండదు.