Pawan Kalyan Fan Niranjan: జనసేన క్యాడర్లో, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానుల్లో తీవ్ర విషాదం నిండింది. గత కొంతకాలంగా మంచానికే పరిమితమై, మరణంతో పోరాడిన హన్మకొండకు చెందిన ‘చోటా గబ్బర్ సింగ్’ పొనుగంటి నిరంజన్ కన్నుమూశారు. నిరంజన్ మరణవార్త తెలియడంతో సోషల్ మీడియా వేదికగా Pawan Kalyan fan Niranjan passes away అనే హాష్ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్

తెలంగాణలోని హన్మకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ ఓ అరుదైన వ్యాధితో బాధపడ్డారు. అతను పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఇటీవల పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంజన్ ఇంటికి కూడా వెళ్లారు. ఇప్పుడు నిరంజన్ మరణ వార్త తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అతని ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు.
అభిమాని కోరిక కోసం
కొద్దివారాల క్రితమే నిరంజన్ జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణం చోటుచేసుకుంది. తాను చనిపోయేలోపు ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ను చూడాలనే నిరంజన్ ఆవేదన సోషల్ మీడియా ద్వారా పవన్కు చేరింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా అత్యంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ అన్ని ప్రోటోకాల్స్ పక్కనబెట్టి తెలంగాణలోని హన్మకొండ హనుమాన్ నగర్లోని నిరంజన్ నివాసానికి స్వయంగా విచ్చేశారు.
పవన్ ఇచ్చిన భరోసా
కేవలం పరామర్శించడమే కాకుండా, నిరంజన్ వైద్య ఖర్చుల కోసం పవన్ కళ్యాణ్ రూ.1 లక్ష తక్షణ ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఆ కుటుంబ జీవనోపాధి కోసం తెలంగాణ జనసేన నేతల ఆధ్వర్యంలో ఒక శాశ్వత క్యాంటీన్ (ఫుడ్ కోర్ట్) ఏర్పాటు చేసేలా బాధ్యతలు అప్పగించారు. నిరంజన్ కు కుక్కపిల్ల అంటే ఇష్టం అని అప్పుడు చెప్పారు. పవన్ ఆ రోజే కుక్కపిల్లను బహుమతిగా అందించారు.
ఒకవేళ ఓజీ 2 మూవీ సినిమా స్టార్ట్ అయితే నిరంజన్ ను స్పెషల్ గెస్ట్ గా పిలుస్తానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అప్పుడు ఆ కుర్రాడి ఆరోగ్య పరిస్థితి చూసి పవన్ కళ్యాణ్ మనసు చలించింది. ఆయన ఎమోషనల్ అయ్యారు.
ఆ డ్యాన్స్ వీడియోలు చూసి
{{/usCountry}}ఒకవేళ ఓజీ 2 మూవీ సినిమా స్టార్ట్ అయితే నిరంజన్ ను స్పెషల్ గెస్ట్ గా పిలుస్తానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అప్పుడు ఆ కుర్రాడి ఆరోగ్య పరిస్థితి చూసి పవన్ కళ్యాణ్ మనసు చలించింది. ఆయన ఎమోషనల్ అయ్యారు.
ఆ డ్యాన్స్ వీడియోలు చూసి
{{/usCountry}}నిరంజన్ గతంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు పవన్ సినిమాల సాంగ్స్ కు వేసిన డాన్స్ వీడియోలను చూసి పవన్ అప్పట్లో మురిసిపోయారు. తన ఆఖరి శ్వాస విడిచే ముందే తన ఆరాధ్య నటుడిని ప్రత్యక్షంగా కలుసుకుని, తన అతిపెద్ద కలను నిరంజన్ నెరవేర్చుకున్నారు. ఇప్పుడు ఆ ఓదార్పు ఒక్కటే అతని కుటుంబానికి మిగిలింది.
అసలేంటి ఈ ‘డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ’ వ్యాధి?
నిరంజన్ చిన్నతనం నుంచి 'డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ' (Duchenne Muscular Dystrophy - DMD) అనే అత్యంత అరుదైన జన్యుపరమైన రుగ్మతతో బాధపడ్డారు. ఈ వ్యాధి వల్ల శరీరంలోని కండరాలు క్రమంగా బలహీనపడి, ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది.
ఒక దశలో ఊపిరితిత్తులు, గుండె కండరాలు కూడా పనిచేయడం మానేస్తాయి. వైద్యశాస్త్రంలో దీనికి సరైన చికిత్స లేకపోవడంతో, నిరంజన్ సుదీర్ఘ కాలం పాటు నరకయాతన అనుభవించారు. చివరకు మరణంతో చేసిన పోరాటంలో ఈ చోటా గబ్బర్ సింగ్ ముగించారు.