ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. కల్కి 2898 ఏడీ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ సంక్రాంతి బరిలో నిలుస్తోంది. జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమాకు అమెరికాలో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.
ది రాజా సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్

ప్రభాస్ ది రాజా సాబ్ సందడి అప్పుడే మొదలైంది. నిజానికి అమెరికాలోనూ డిసెంబర్ 4 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సినీమార్క్ థియేటర్స్ మాత్రం రెండు రోజుల ముందుగానే ఈ బుకింగ్స్ మొదలుపెట్టడం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఈసారి సంక్రాంతికి చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, దళపతి విజయ్ జన నాయగన్ లాంటి సినిమాలతో ది రాజా సాబ్ పోటీ పడనుంది. ఇండియాలో ఇప్పటి వరకూ చూడనటువంటి హారర్ అంటూ మేకర్స్ ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ది రాజా సాబ్ రన్టైమ్
ఇక ది రాజా సాబ్ మూవీ రన్ టైమ్ కూడా ఆసక్తి రేపుతోంది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో అక్కడి బుకింగ్ పోర్టల్ ఈ మూవీ రన్ టైమ్ రివీల్ చేసింది. దాని ప్రకారం 3 గంటల 15 నిమిషాలు కావడం విశేషం. అయితే ఇది ఫైనల్ కాదు. సెన్సార్ తర్వాత మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేస్తారు. అది కూడా ఇంచుమించు దీనికి దగ్గరగానే ఉంటుంది. ఆ లెక్కన మరో సినిమా భారీ రన్ టైమ్తో రాబోతోంది.
డార్లింగ్ ప్రభాస్ ను మరోసారి వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్ తో ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు డైరెక్టర్ మారుతి. ఈ నేపథ్యంలో ఈ భారీ రన్ టైమ్ కూడా ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ ఓ కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. అతనితోపాటు మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్, బొమన్ ఇరానీ, జరీనా వహాబ్, సుముద్రఖని లాంటి వాళ్లు నటించారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
{{/usCountry}}డార్లింగ్ ప్రభాస్ ను మరోసారి వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్ తో ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు డైరెక్టర్ మారుతి. ఈ నేపథ్యంలో ఈ భారీ రన్ టైమ్ కూడా ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ ఓ కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. అతనితోపాటు మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్, బొమన్ ఇరానీ, జరీనా వహాబ్, సుముద్రఖని లాంటి వాళ్లు నటించారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
{{/usCountry}}