ది కేరళ స్టోరీ 2పై ప్రకాష్ రాజ్ కౌంటర్.. బీఫ్, పోర్క్ చిత్రాలు పోస్ట్.. జస్ట్ ఆస్కింగ్ అంటూ
రిలీజ్ కు ముందే తీవ్ర వివాదాస్పదమైన మూవీ ‘ది కేరళ స్టోరీ 2’. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో ఓ సీన్ తో కాంట్రవర్సీ మరింత ముదిరింది. దీనిపై తాజాగా ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశాడు.
ది కేరళ స్టోరీ 2 సినిమాపై వివాదాలు ఆగడం లేదు. రోజురోజుకూ కాంట్రవర్సీ ముదురుతోంది. తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా పోస్టు ద్వారా ది కేరళ స్టోరీ 2 సినిమాపై కౌంటర్ వేశాడు. ఈ మూవీకి కామాఖ్య నారాయణ్ డైెరెక్టర్. విపుల్ విపుల్ అమృత లాల్ షా ప్రొడ్యూసర్. ఈ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ది కేరళ స్టోరీ 2 వివాదం
లవ్ జీహాద్, బలవంతపు మత మార్పిడుల నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ‘ది కేరళ స్టోరీ 2 ’. తాజాగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ లో ఓ సీన్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఓ ముస్లిం కుటుంబం ఓ అమ్మాయికి బలవంతంగా బీఫ్ తినిపించినట్లు ఈ ట్రైలర్ లో చూపించారు. దీంతో కాంట్రవర్సీ కలకలం రేగింది.
ప్రకాష్ రాజ్ కౌంటర్
‘ది కేరళ స్టోరీ 2’ సినిమాపై ప్రకాష్ రాజ్ కౌంటర్ వైరల్ గా మారింది. ఆయన తన ఎక్స్ ఖాతాలో పోర్క్, బీఫ్, చేపలు, వెజ్ అన్నం వంటకాల చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. "పంది మాంసం, బీఫ్, చేపలు, శాఖాహార సద్యా (వెజ్ తాలి)తో కలిసి సామరస్యంగా ఎలా ఉంటాయో అనేదే నిజమైన కేరళ స్టోరీ. దయచేసి ఆస్వాదించండి. జస్ట్ ఆస్కింగ్. అందరికీ హ్యాపీ సండే’’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్.
అనురాగ్ కశ్యప్ విమర్శలు
ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కూడా ది కేరళ స్టోరీ 2 మూవీపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. "ది కేరళ స్టోరీ ఒక చెత్త సినిమా. అది బూటకపు ప్రచారం. పూర్తిగా అబద్ధం. అలా ఎవరు బీఫ్ తినిపిస్తారు? అలా కనీసం కిచిడీ కూడా తినిపించరు. ఇది పనికిమాలిన సినిమా. దీనిని చెత్త అంటారు" అని అనురాగ్ కశ్యప్ తీవ్రంగా విమర్శించాడు.
సీఎం కామెంట్లు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ది కేరళ స్టోరీ మూవీని విమర్శించారు. "సుస్థిర అభివృద్ధిలో ముందుండి, శాంతిభద్రతల నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తున్న మత సామరస్య భూమి అయిన కేరళను తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించే ప్రయత్నాలను మనం సమిష్టిగా తిరస్కరించాలి. కేరళ లౌకిక పునాదిని తప్పుడు ప్రచారంతో దెబ్బతీయకుండా చూసుకోవడం, లౌకికవాద, సోదరభావ విలువలను నిలబెట్టుకోవడం మనందరి బాధ్యత" అని కేరళ సీఎం అన్నారు.

E-Paper












