...
...
Next Story

Prakash Raj: ఇది మరో స్వతంత్ర పోరాటం.. వాళ్లకు నేను అండగా నిలబడతా: ప్రకాష్ రాజ్ ట్వీట్

Prakash Raj: ప్రకాష్ రాజ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు. ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనను అతడు మరో స్వతంత్ర పోరాటంతో పోల్చడం గమనార్హం. ఈ పోరాటంలో వాళ్లకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశాడు.

Published on: Jul 21, 2026, 20:03:55 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఢిల్లీ వీధుల్లోకి దిగి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీట్ (NEET) పరీక్షల్లో జరిగిన అక్రమాలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP), విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనకు మద్దతుగా ఆయన జంతర్ మంతర్ వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరో స్వాతంత్య్ర పోరాటం లాంటి ఉద్యమం మొదలైందంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

Prakash Raj: ఇది మరో స్వతంత్ర పోరాటం.. వాళ్లకు నేను అండగా నిలబడతా: ప్రకాష్ రాజ్ ట్వీట్ (PTI)
Prakash Raj: ఇది మరో స్వతంత్ర పోరాటం.. వాళ్లకు నేను అండగా నిలబడతా: ప్రకాష్ రాజ్ ట్వీట్ (PTI)

జులై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన 'చలో సంసద్' మార్చ్‌ లో ప్రకాష్ రాజ్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అంతకుముందు జూన్‌లో బెంగళూరులో జరిగిన నిరసనలో కూడా పాల్గొన్న ఆయన.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన వీడియో మోంటేజ్‌ను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

"దేశ యువత భవిష్యత్తు కోసం మళ్లీ స్వాతంత్ర్య పోరాటం!"

"నా దేశ యువత తమ భవిష్యత్తు కోసం అద్భుతంగా పోరాడుతోంది. మళ్లీ స్వాతంత్య్ర పోరాటం లాంటి ఒక గొప్ప ఉద్యమం ఇక్కడ రూపుదిద్దుకుంటోంది. ఈ మార్పుకు నేను నిరంతరం మద్దతుగా నిలుస్తాను. విద్యార్థుల చేతులు పట్టుకుని, నా శక్తిని వారికి అందిస్తూ వారి ఉజ్జ్వల భవిష్యత్తు కోసం తోడుగా ఉంటాను" అని ప్రకాష్ రాజ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన పాపులర్ ప్రమోషనల్ హ్యాష్ టాగ్ `#justasking` ను కూడా ఈ పోస్ట్‌కు జత చేశారు.

ఈ నిరసన సందర్భంగా మీడియా ప్రతినిధులు బాలీవుడ్ టాప్ స్టార్ల మౌనం గురించి ప్రశ్నించగా ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తోందని ఆయన అన్నారు. సినిమా ఇండస్ట్రీలోని పెద్ద నటులు తమ పవర్‌ఫుల్ గళాన్ని ప్రజల సమస్యలపై ఉపయోగించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

"రేపు చరిత్ర రాసేటప్పుడు తప్పు చేసిన వారిని ఆ ప్రజలు క్షమిస్తారేమో గానీ, సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు నోరుమూసుకుని మౌనంగా ఉన్న వారిని ఎప్పటికీ క్షమించరు. ఎవరు ఎలాంటి వారో ఇలాంటి ఉద్యమాలే నిరూపిస్తాయి. ప్రజల కోసం నిలబడే నైతికత ఎవరికి ఉందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది" అంటూ బాలీవుడ్ ప్రముఖులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఇతర సినీ ప్రముఖుల మద్దతు.. వాంగ్చుక్‌తో భేటీ

ఢిల్లీలో జరిగిన ఈ సుదీర్ఘ పోరాటంలో ప్రకాష్ రాజ్‌తో పాటు ప్రముఖ నటి షబానా అజ్మీ, పూనమ్ పాండే కూడా రోడ్డెక్కి విద్యార్థులకు మద్దతు తెలిపారు. అంతేకాకుండా హాలీవుడ్, బాలీవుడ్ స్థాయిలో గుర్తింపు ఉన్న హృతిక్ రోషన్, సోనాక్షి సిన్హా, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ, గాయని చిన్మయి శ్రీపాద లాంటి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ ఉద్యమానికి మద్దతు పలికారు.

ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్‌ను స్వయంగా కలిసి మాట్లాడిన ప్రకాష్ రాజ్, ఆ ఫొటోలను కూడా ఇంటర్నెట్‌లో షేర్ చేశారు. దక్షిణాది, ఉత్తరాది భాషల్లో వందలాది విలక్షణమైన పాత్రలతో అలరించిన ప్రకాష్ రాజ్, సామాజిక అంశాలపై నిలదీయడంలో ఎప్పుడూ ముందుంటారు. గతంలో ఆయన ప్రారంభించిన 'జస్ట్ ఆస్కింగ్' క్యాంపెయిన్ కూడా నేషనల్ వైడ్‌గా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చినప్పటి నుంచే ప్రకాష్ రాజ్ తన దాడిని తీవ్రం చేశారు. ప్రతి అంశంలోనూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe