...
...
Next Story

Prashanth Neel: తారక్ అడిగిన ఆ ఒక్క ప్రశ్నకు సమాధానానికి మూడేళ్లు పట్టింది.. అతిపెద్ద దేశభక్తి సినిమా ఇది: ప్రశాంత్ నీల్

Prashanth Neel: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'డ్రాగన్' (Dragon) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్రపై ప్రశాంత్ నీల్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

Published on: May 20, 2026, 18:28:21 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Prashanth Neel: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్ ఇప్పటికే రికార్డుల వేట మొదలుపెట్టింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో.. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రంలో తారక్ క్యారెక్టరైజేషన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Prashanth Neel: తారక్ అడిగిన ఆ ఒక్క ప్రశ్నకు సమాధానానికి మూడేళ్లు పట్టింది.. అతిపెద్ద దేశభక్తి సినిమా ఇది: ప్రశాంత్ నీల్
Prashanth Neel: తారక్ అడిగిన ఆ ఒక్క ప్రశ్నకు సమాధానానికి మూడేళ్లు పట్టింది.. అతిపెద్ద దేశభక్తి సినిమా ఇది: ప్రశాంత్ నీల్

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ఒప్పుకోవడం ఆయన కెరీర్‌లోనే అత్యంత కఠినమైన నిర్ణయాలలో ఒకటి అని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితమే తాను ఎన్టీఆర్‌ను కలిసి ఈ చిత్రానికి సంబంధించిన కోర్ ఐడియాను చెప్పినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. గలాటా ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీల్ ఏమన్నారో చూడండి.

నా కెరీర్‌లోనే 'డార్కెస్ట్' క్యారెక్టర్ ఇది

ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా విపరీతమైన ఎమోషనల్ డ్రామా ఉంటుందని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పాత్ర గురించి ఆయన మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

"ఇది కేవలం ట్రైలర్ లేదా గ్లింప్స్‌లో కనిపించే ఎలివేషన్స్ గురించి కాదు. సినిమాలో ఉండే బలమైన డ్రామా గురించి. ఇంతటి భారీ స్టార్‌డమ్ ఉన్న ఒక హీరో.. ఇలాంటి పాత్రను పోషించడానికి ఒప్పుకోవడం నిజంగా ఒక పెద్ద నిర్ణయం. సినిమా ముగిసే సమయానికి ప్రేక్షకులకు అది అర్థమవుతుంది. ఇది చాలా డార్క్ క్యారెక్టర్. ఇప్పటివరకు నా సినిమాల్లో నేను రాసిన అన్ని పాత్రల కంటే ఇది అత్యంత క్రూరమైన, డార్కెస్ట్ క్యారెక్టర్. బహుశా కాదు కచ్చితంగా నేను రాసిన వాటిలో ఇదే మోస్ట్ డార్క్ రోల్" అని ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బహుశా ఇదే అతిపెద్ది దేశభక్తి సినిమా

ఇంతటి నెగెటివ్ షేడ్స్ ఉన్న రిస్కీ క్యారెక్టర్ చేయడానికి ఎన్టీఆర్ ఎలా ఒప్పుకున్నారనే విషయాన్ని కూడా దర్శకుడు వివరించారు. కథ విన్న తర్వాత ఎన్టీఆర్ పెద్దగా కండిషన్లు ఏమీ పెట్టలేదని, కానీ ఒకే ఒక్క ముఖ్యమైన ప్రశ్న అడిగారని నీల్ చెప్పారు.

"ఆ క్యారెక్టర్ చేసే విపరీతమైన పనుల వెనుక పక్కా కారణం, బలమైన డ్రామా ఉందా?" అని తారక్ అడిగినట్లు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఆ పాత్ర ప్రవర్తనను, అది చేసే పనులను జస్టిఫై చేయడానికి, దాని వెనుక ఉన్న బలమైన కారణాన్ని స్క్రీన్‌ప్లే రూపంలో తీసుకురావడానికి ప్రశాంత్ నీల్ అండ్ టీమ్‌కు ఏకంగా మూడు సంవత్సరాల సమయం పట్టిందట.

ఒకసారి ఆ బలమైన కారణం, డ్రామా సిద్ధమైన తర్వాత, ఎన్టీఆర్ ఏమాత్రం వెనుకాడకుండా.. "నేను ఈ పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు కూడా నీల్ చెప్పారు.

ఎన్టీఆర్ లాంటి భారీ క్రేజ్ ఉన్న గ్లోబల్ స్టార్ ఇలాంటి రిస్కీ పాత్రను పోషించడం సాధారణ విషయం కాదని, సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు తాను చెప్పిన మాటల్లోని తీవ్రత ప్రేక్షకులకు పూర్తిగా అర్థమవుతుందని, ఇది ఎంతమాత్రం అతిశయోక్తి కాదని ప్రశాంత్ నీల్ నమ్మకంగా చెప్పారు.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe