దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్, నిర్మాత విపుల్ అమృత్లాల్ షా కలయికలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ 2' ఫిబ్రవరిలో విడుదలై దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ సినిమాపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ సినిమాకు విమర్శించగా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ దీనిని సమాజానికి అద్దం పట్టే చిత్రమని అభివర్ణించారు.
రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ అధికారిక 'ఎక్స్' ఖాతా ది కేరళ స్టోరీ 2 మూవీపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ను షేర్ చేసింది. "ఈ సినిమాను ఎవరూ చూడటం లేదు. కేరళ సంస్కృతి, సంప్రదాయాలు ఏమిటో ఈ దేశ ప్రజలకు తెలుసని ఇది నిరూపిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా మీడియా, సినిమాలను కొన్ని వర్గాలను కించపరచడానికి, సమాజంలో విద్వేషాలు పెంచడానికి ఆయుధాలుగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. "కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా, ఇతరులకు హాని కలిగించేలా కథనాలను ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా నిజం మాట్లాడాలని చూస్తే వారిపై దాడులు జరుగుతున్నాయి. నేను నిత్యం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాను" అని రాహుల్ గాంధీ ఆ వీడియోలో అనడం చూడొచ్చు.
మనోజ్ తివారీ భార్య కౌంటర్
రాహుల్ గాంధీ, ఇతర విమర్శకులపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ మండిపడ్డారు. ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. "లోకం అన్నాక రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ ఇంట్లో కూర్చుని విమర్శించే వారు ఒక్కసారి థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. ఆ తర్వాత నిజమైన డాక్యుమెంట్లు, కేసులను చదవండి. అప్పుడు ఇది తప్పుడు ప్రచారమా లేదా సమాజానికి అద్దం పట్టే చిత్రమా అనేది మీకే అర్థమవుతుంది" అని హితవు పలికారు.
ఏ హిందూ అమ్మాయి కూడా ఈ సినిమాలో చూపించిన బాధితుల్లాంటి పరిస్థితులను ఎదుర్కోకూడదని, మనం ఒక సమాజంగా ఎక్కడున్నామో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ది కేరళ స్టోరీ 2 సినిమా నేపథ్యం, వివాదం
{{/usCountry}}ఏ హిందూ అమ్మాయి కూడా ఈ సినిమాలో చూపించిన బాధితుల్లాంటి పరిస్థితులను ఎదుర్కోకూడదని, మనం ఒక సమాజంగా ఎక్కడున్నామో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ది కేరళ స్టోరీ 2 సినిమా నేపథ్యం, వివాదం
{{/usCountry}}2023లో వచ్చిన 'ది కేరళ స్టోరీ'కి ఇది సీక్వెల్. ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. మతం మారి పెళ్లి చేసుకున్న ముగ్గురు యువతులు ఏ విధంగా మోసపోయారు, వారు అనుభవించిన నరకం ఏమిటనేది ఈ సినిమా కథ.
ఈ సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తొలుత సింగిల్ బెంచ్ స్టే ఇచ్చినప్పటికీ, తదుపరి విచారణలో ధర్మాసనం స్టేను ఎత్తివేస్తూ విడుదలకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఈ సినిమా రాజకీయ రంగు పులుముకుని సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.