...
...
Next Story

Dharman: రజనీకాంత్ స్వాగ్.. నా స్టైల్ ఉంటుంది.. కాస్త టెన్షన్‌గానే ఉంది: ధర్మన్ మూవీ డైరెక్టర్ కామెంట్స్

Dharman: రజనీకాంత్ లీడ్ రోల్లో కమల్ హాసన్ నిర్మిస్తున్న ధర్మన్ మూవీ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు కాస్త టెన్షన్ లోనే ఉన్నాడట. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కావడంతో మూవీ ఎలా వస్తుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే రజనీ స్వాగ్, తన స్టైల్ ఇందులో ఉంటుందని అతడు చెప్పాడు.

Published on: Jul 4, 2026, 09:46:21 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Dharman: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ అనగానే ఇండియన్ బాక్సాఫీస్ కు పూనకాలు గ్యారెంటీ. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీ హీరోగా 'ధర్మన్' అనే క్రేజీ ప్రాజెక్ట్ రీసెంట్ గా ఎనౌన్స్ అయిన విషయం తెలిసిందే.

ఇది చాలా పెద్ద బాధ్యత

Dharman: రజనీకాంత్ స్వాగ్.. నా స్టైల్ ఉంటుంది.. కాస్త టెన్షన్‌గానే ఉంది: ధర్మన్ మూవీ డైరెక్టర్ కామెంట్స్
Dharman: రజనీకాంత్ స్వాగ్.. నా స్టైల్ ఉంటుంది.. కాస్త టెన్షన్‌గానే ఉంది: ధర్మన్ మూవీ డైరెక్టర్ కామెంట్స్

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు కొట్టేశాడు. 'ఓ మై కడవులే', 'డ్రాగన్' లాంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేస్తుండటం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అశ్వత్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.

"ధర్మన్ సినిమా నా లైఫ్ లోనే నేను తీసుకున్న అతి పెద్ద బాధ్యత. ఈ సినిమా గురించి ఆలోచించిన ప్రతిసారీ నాకు భయంగా, చాలా ఆందోళనగా ఉంటుంది" అని అశ్వత్ తన మనసులోని మాట బయటపెట్టాడు. ఈ టెన్షన్ గురించే డైరెక్ట్ గా రజనీకాంత్ కు కూడా చెప్పానని, ఎక్కువ ఆలోచించకుండా వర్క్ ను ఎంజాయ్ చేయమని ఆయన సలహా ఇచ్చారని అన్నాడు. రజనీ సార్ తో సెట్స్ లో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉందని చెప్పుకొచ్చాడు.

రజనీ స్వాగ్.. నా స్టైల్

జైలర్ లాంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత రజనీకాంత్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఏజ్ ను కూడా లెక్కచేయకుండా సెట్స్ లో ఫుల్ ఎనర్జీతో రెచ్చిపోతున్నాడు. ఇక ధర్మన్ సినిమాలో సీనియర్ బ్యూటీ సిమ్రాన్, యంగ్ గ్లామర్ క్వీన్ రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పేట సినిమా తర్వాత మళ్లీ రజనీ, సిమ్రాన్ కాంబో రిపీట్ అవ్వడం ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చే న్యూస్.

జైలర్ కు 'హుకుమ్' సాంగ్ తో ప్రాణం పోసిన రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. అనిరుధ్ బేస్ బాదితే థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. కాస్త టైమ్ తీసుకుని పక్కా ప్లానింగ్ తో 2027లో ఈ సినిమాను గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe