Dharman: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ అనగానే ఇండియన్ బాక్సాఫీస్ కు పూనకాలు గ్యారెంటీ. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీ హీరోగా 'ధర్మన్' అనే క్రేజీ ప్రాజెక్ట్ రీసెంట్ గా ఎనౌన్స్ అయిన విషయం తెలిసిందే.
ఇది చాలా పెద్ద బాధ్యత

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు కొట్టేశాడు. 'ఓ మై కడవులే', 'డ్రాగన్' లాంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేస్తుండటం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అశ్వత్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.
"ధర్మన్ సినిమా నా లైఫ్ లోనే నేను తీసుకున్న అతి పెద్ద బాధ్యత. ఈ సినిమా గురించి ఆలోచించిన ప్రతిసారీ నాకు భయంగా, చాలా ఆందోళనగా ఉంటుంది" అని అశ్వత్ తన మనసులోని మాట బయటపెట్టాడు. ఈ టెన్షన్ గురించే డైరెక్ట్ గా రజనీకాంత్ కు కూడా చెప్పానని, ఎక్కువ ఆలోచించకుండా వర్క్ ను ఎంజాయ్ చేయమని ఆయన సలహా ఇచ్చారని అన్నాడు. రజనీ సార్ తో సెట్స్ లో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉందని చెప్పుకొచ్చాడు.
రజనీ స్వాగ్.. నా స్టైల్
ఈ ధర్మన్ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒక పర్ఫెక్ట్ మాస్టర్ పీస్ లా తీస్తున్నామని అశ్వత్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇందులో రజనీ సార్ వింటేజ్ స్వాగ్ తో పాటు తన మార్క్ మేకింగ్ స్టైల్ కచ్చితంగా ఉంటుందని అశ్వత్ మాట ఇచ్చాడు. నిజానికి ఈ ప్రాజెక్ట్ కోసం ముందు వేరే డైరెక్టర్స్ ను అనుకున్నా, స్టోరీ సిట్టింగ్స్ లో ఎన్నో మార్పులు జరిగి ఫైనల్ గా ఆ లక్కీ ఛాన్స్ అశ్వత్ కు దక్కింది.
{{/usCountry}}ఈ ధర్మన్ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒక పర్ఫెక్ట్ మాస్టర్ పీస్ లా తీస్తున్నామని అశ్వత్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇందులో రజనీ సార్ వింటేజ్ స్వాగ్ తో పాటు తన మార్క్ మేకింగ్ స్టైల్ కచ్చితంగా ఉంటుందని అశ్వత్ మాట ఇచ్చాడు. నిజానికి ఈ ప్రాజెక్ట్ కోసం ముందు వేరే డైరెక్టర్స్ ను అనుకున్నా, స్టోరీ సిట్టింగ్స్ లో ఎన్నో మార్పులు జరిగి ఫైనల్ గా ఆ లక్కీ ఛాన్స్ అశ్వత్ కు దక్కింది.
{{/usCountry}}జైలర్ లాంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత రజనీకాంత్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఏజ్ ను కూడా లెక్కచేయకుండా సెట్స్ లో ఫుల్ ఎనర్జీతో రెచ్చిపోతున్నాడు. ఇక ధర్మన్ సినిమాలో సీనియర్ బ్యూటీ సిమ్రాన్, యంగ్ గ్లామర్ క్వీన్ రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పేట సినిమా తర్వాత మళ్లీ రజనీ, సిమ్రాన్ కాంబో రిపీట్ అవ్వడం ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చే న్యూస్.
జైలర్ కు 'హుకుమ్' సాంగ్ తో ప్రాణం పోసిన రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. అనిరుధ్ బేస్ బాదితే థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. కాస్త టైమ్ తీసుకుని పక్కా ప్లానింగ్ తో 2027లో ఈ సినిమాను గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు.