2022లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు రామ్ చరణ్. ఇప్పుడు బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో చరణ్ ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా 'కార్స్ విత్ స్టార్స్' అనే ఆటోమొబైల్ షోలో చిరంజీవి కొడుకు అడ్వాంటేజీ గురించి అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సరిచ్చాడు చరణ్.
రామ్ చరణ్ కామెంట్లు

రామ్ చరణ్ తన సినీ కెరీర్ లోని వైఫల్యాలు, విజయాలను ఎదుర్కోవడంపై ముచ్చటించాడు. తన తండ్రి చిరంజీవి, బాబాయి పవన్ కళ్యాణ్ వంటి అగ్ర నటులున్న కుటుంబ నేపథ్యం తనకు ఒక అడ్వాంటేజ్ అని కూడా ఆయన తెలిపాడు. చిరంజీవి కొడుకుగా ఒక ప్రముఖ కుటుంబ నేపథ్యం నుంచి రావడాన్ని ఎలా చూస్తారని అడిగినప్పుడు, రామ్ చరణ్ దానిని ఒక గొప్ప అడ్వాంటేజ్ అని అభివర్ణించారు.
నిజాయితీగా చెప్పాలంటే
"అలాంటి కుటుంబం నుండి అటువంటి అంతర్దృష్టి, అనుభవం కలిగి ఉండటం ఒక అందమైన అడ్వాంటేజ్. కొత్తగా నటన పాఠశాల నుండి ప్రారంభించే వారికంటే మీరు ప్రతిదీ కొంచెం వేగంగా నేర్చుకుంటారు. నిజాయితీగా చెప్పాలంటే, నేను దానిని ఒక అడ్వాంటేజ్ గానే చూశాను" అని రామ్ చరణ్ అన్నారు. అది భారంగా లేదా అని అడిగినప్పుడు, ఆయన నవ్వి.. "నాకు కష్టంగా అనిపించలేదు. ప్రేక్షకులకు అంగీకరించడం కష్టంగా అనిపించింది" అని బదులిచ్చారు.
మరీ సీరియస్ కాదు
తాను సాధించిన కీర్తిని ఎలా స్వీకరిస్తారని అడిగినప్పుడు, రామ్ చరణ్.. "నిజాయితీగా చెప్పాలంటే నన్ను నేను మరీ సీరియస్ గా తీసుకోను. ఉదయం 8 నుండి సాయంత్రం 6 వరకు నేను నా పనిని చాలా ఆసక్తితో చేస్తా. ఆ తర్వాత నన్ను నేను మర్చిపోతా. నా విజయాల గురించి నేను ఎక్కువగా ఆలోచించను" అని చరణ్ చెప్పారు. అయితే, వైఫల్యాల గురించి అడిగినప్పుడు.. "వైఫల్యాలు కష్టమైనవి. అవి మిమ్మల్ని ఒక మెట్టు వెనక్కి నెడతాయి" అని బదులిచ్చారు.
అదే ఇంట్రెస్టింగ్
2025లో 'గేమ్ ఛేంజర్' చిత్రం ఫెయిల్యూర్ తో రామ్ చరణ్ ఎదురుదెబ్బను ఎదుర్కొన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' అనే స్పోర్ట్స్ డ్రామాలో క్రికెటర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, జగపతి బాబు, దివ్యేందు వంటి స్టార్లూ ఉన్నారు. ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ పెద్ది సినిమాలోని తన పాత్ర తాను పోషించిన పాత్రల్లోకెల్లా అత్యంత ఆసక్తికరమైనది అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
{{/usCountry}}2025లో 'గేమ్ ఛేంజర్' చిత్రం ఫెయిల్యూర్ తో రామ్ చరణ్ ఎదురుదెబ్బను ఎదుర్కొన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' అనే స్పోర్ట్స్ డ్రామాలో క్రికెటర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, జగపతి బాబు, దివ్యేందు వంటి స్టార్లూ ఉన్నారు. ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ పెద్ది సినిమాలోని తన పాత్ర తాను పోషించిన పాత్రల్లోకెల్లా అత్యంత ఆసక్తికరమైనది అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
{{/usCountry}}