Ram Charan Idol Arjun Theatre: మెగా పవర్స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న హై-వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ రిలీజ్కు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. జూన్ 3న స్పెషల్ ప్రీమియర్స్, జూన్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేయడంతో మెగా ఫ్యాన్స్ అప్పుడే రచ్చ మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే తమ హీరో మీద ఉన్న అభిమానాన్ని చూపించుకోవడానికి హైదరాబాద్ కూకట్పల్లిలోని ఫేమస్ ‘అర్జున్ థియేటర్’ దగ్గర ఫ్యాన్స్ ఒక స్పెషల్ విగ్రహాన్ని (Statue) ఏర్పాటు చేశారు. కానీ ఫ్యాన్స్ కష్టం కాస్తా సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ మెటీరియల్గా మారిపోయింది.
చరణ్ విగ్రహమే.. కానీ ఫేస్ కట్ వేరే!
‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ రగ్గడ్ మాస్ లుక్ను బేస్ చేసుకుని ఈ విగ్రహాన్ని డిజైన్ చేయించారు. అయితే ఆ విగ్రహం ఓపెన్ చేసిన వెంటనే నెటిజన్ల మైండ్ బ్లాక్ అయింది. అది ఏ యాంగిల్లోనూ రామ్ చరణ్లా లేకపోవడమే దానికి కారణం. ఇంకేముంది.. ఎక్స్ వేదికగా మీమ్స్ రాయుళ్లు రంగంలోకి దిగి ఓ రేంజ్లో ఆడుకోవడం స్టార్ట్ చేశారు.
ఒక నెటిజన్ వెటకారంగా.. "సూపర్ అన్నా, ఇంతకీ అది ఎవరి విగ్రహం?" అని అడగ్గా.. మరొకరు "వాళ్లు చేయించింది రామ్ చరణ్ విగ్రహం.. కానీ చూస్తే రాహుల్ రామకృష్ణలా ఉంది" అంటూ సెటైర్లు వేశారు. ఇంకొందరైతే అది మలయాళ యాక్టర్ జోజు జార్జ్ విగ్రహంలా ఉందంటూ ఫోటోలు పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు.
వెనకేసుకొచ్చిన టీమ్.. సారీ చెప్పిన ఫ్యాన్స్
ఈ విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రామ్కు 'ఆర్సీ యువశక్తి' ప్రెసిడెంట్, ‘మైఖేల్’, ‘A1 ఎక్స్ప్రెస్’ సినిమాల ప్రొడ్యూసర్ పసుపులేటి శివ (శివ చెర్రీ) ముఖ్య అతిథిగా వెళ్లారు. ట్రోల్స్ డోస్ పెరగడంతో ఆయన ఫ్యాన్స్ కష్టాన్ని సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు.
{{/usCountry}}ఈ విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రామ్కు 'ఆర్సీ యువశక్తి' ప్రెసిడెంట్, ‘మైఖేల్’, ‘A1 ఎక్స్ప్రెస్’ సినిమాల ప్రొడ్యూసర్ పసుపులేటి శివ (శివ చెర్రీ) ముఖ్య అతిథిగా వెళ్లారు. ట్రోల్స్ డోస్ పెరగడంతో ఆయన ఫ్యాన్స్ కష్టాన్ని సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు.
{{/usCountry}}"దూరం నుంచి కామెంట్ చేయడం చాలా ఈజీ. కానీ ఫ్యాన్స్ చేసే ప్రతి పని వెనుక నిజమైన ప్రేమ, కష్టం ఉంటాయి. ఈ ఈవెంట్ను లోకల్ కూకట్పల్లి ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ట్విట్టర్లో కొన్ని నెగెటివ్ కామెంట్స్ చూశాను, కానీ వాళ్ళ ఎమోషన్ను, డెడికేషన్ను మనం అర్థం చేసుకోవాలి" అని శివ చెర్రీ చెప్పుకొచ్చారు.
మరోవైపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కూకట్పల్లి రామ్ చరణ్ ఫ్యాన్స్ క్లబ్ (KUKATPALLYRCFC) మాత్రం జరిగిన మిస్టేక్ను ఒప్పుకుంటూ పబ్లిక్గా క్షమాపణలు చెప్పింది. "మేము అందరికీ హృదయపూర్వకంగా సారీ చెబుతున్నాము. రామ్ చరణ్ గారిపై మాకున్న ఇష్టాన్ని స్పెషల్గా చూపించాలనే ఈ విగ్రహాన్ని పెట్టాం. కానీ దురదృష్టవశాత్తూ ఎగ్జిక్యూషన్ అనుకున్నట్లుగా రాలేదు. ఇది ఒక 'మిస్ఫైర్'. ఎవరి మనోభావాలనైనా, సనాతన ధర్మాన్ని కానీ కించపరచాలనే ఉద్దేశం మాకు అస్సలు లేదు. మా ప్రయత్నం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి" అని ఫ్యాన్స్ క్లబ్ క్లారిటీ ఇచ్చింది.
‘పెద్ది’ ప్రీ-రిలీజ్ హైప్
ఈ ట్రోల్స్ పక్కన పెడితే.. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కోసం ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే పెద్ది ప్రీరిలీజ్ బిజినెస్, యూఎస్ఏ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
సినిమా రన్టైమ్ లాక్ అవ్వడం, సెన్సార్ రిపోర్టు కూడా పాజిటివ్గా రావడంతో.. రామ్ చరణ్ కెరీర్లోనే ఇదొక మైల్స్టోన్ అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
రామ్ చరణ్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏ థియేటర్ దగ్గర ఏర్పాటు చేశారు?
హైదరాబాద్, కూకట్పల్లిలోని ఫేమస్ అర్జున్ థియేటర్ (Arjun Theatre) దగ్గర మెగా ఫ్యాన్స్ ఈ విగ్రహాన్ని పెట్టారు.
రామ్ చరణ్ విగ్రహాన్ని నెటిజన్లు ఏయే యాక్టర్స్తో పోల్చారు?
ఈ విగ్రహం అస్సలు రామ్ చరణ్లా లేదంటూ.. మలయాళ యాక్టర్ జోజు జార్జ్, తెలుగు యాక్టర్స్ నవీన్ చంద్ర, రాహుల్ రామకృష్ణ ఫేస్ కట్స్తో నెటిజన్లు పోల్చారు.
'పెద్ది' సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? (Peddi release date)
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జూన్ 4, 2026 న గ్రాండ్గా వరల్డ్వైడ్ రిలీజ్ కానుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో జూన్ 3 నుంచే స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోలు స్టార్ట్ అవుతున్నాయి.