Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పేస్తుంటాడు. ఇన్ని రోజులూ ధురంధర్ 2ను ఆహా అంటూ పొగిడేసిన అతను.. ఇప్పుడు ఫస్ట్ టైమ్ నెగెటివ్ కామెంట్లు చేశాడు. ఒక విషయంలో మాత్రం మూవీని అపోజ్ చేశాడు. సినిమాలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాత్రను చిత్రించిన తీరు సరిగ్గా లేదని వర్మ అభిప్రాయపడ్డాడు.
ఆర్జీవీ కామెంట్లు

ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీతో నిర్వహించిన తాజా ఇంటర్వ్యూలో ఆర్జీవీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ధురంధర్ 2 మేకింగ్, క్రాఫ్ట్ అద్భుతంగా ఉన్నప్పటికీ, దావూద్ ఇబ్రహీం పాత్ర విషయంలో తనకు భిన్నమైన అభిప్రాయం ఉందని చెప్పాడు. సినిమాలో దావూద్ను 'బడే సాహబ్' అని పిలుస్తూ, పాకిస్థాన్తో కలిసి భారత్లో ఉగ్ర కార్యకలాపాలను నడిపించే కీలక వ్యక్తిగా చూపించారు.
నాకు నచ్చనది
" ధురంధర్ 2 సినిమాలో నాకు నచ్చని అంశం ఏదైనా ఉందంటే అది దావూద్ ఇబ్రహీం పాత్రను చూపించిన విధానమే. మేకర్స్ దగ్గర వారికి తెలిసిన సొంత సమాచారం ఉండవచ్చు, కానీ నా అవగాహన ప్రకారం అది తప్పు" అని ఆర్జీవీ అన్నాడు. తన వాదనను సమర్థించుకుంటూ.. "నేను చెప్పేదే పూర్తి నిజమని కూడా అనను. కానీ నాకు తెలిసిన విషయాలతో పోల్చితే సినిమాలో దావూద్ గురించి చెప్పింది పొంతన లేకుండా ఉంది" అని రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశాడు.
వాస్తవం ఎవరికీ తెలియదు
అండర్ వరల్డ్ వంటి అంశాల మీద సినిమాలు తీసేటప్పుడు అసలు నిజాన్ని నిర్ధారించడం ఎవరికీ సాధ్యం కాదని ఆర్జీవీ అభిప్రాయపడ్డాడు. "సినిమాలో ఒక విషయాన్ని చూపించినప్పుడు దాన్ని మేకర్స్ నిరూపించలేరు, విమర్శకులు దాన్ని కాదనలేరు. ఎవరి దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉండవు" అని ఆర్జీవీ పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా దావూద్ అనారోగ్యంతో ఉన్నాడని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడని తాను విన్నట్లు వర్మ తెలిపాడు. తన అంచనా ప్రకారం దావూద్ ఎప్పుడో ఈ నేర ప్రపంచం నుండి తప్పుకొని ఉండవచ్చని ఆయన అంచనా వేశాడు.
ఆదిత్య ధర్ నా గురువు
గతంలో ధురంధర్ 2 సినిమాను చూసిన ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'షోలే' తర్వాత అంతటి ప్రభావం చూపిన సినిమా ఇదని, దర్శకుడు ఆదిత్య ధర్ తనకు కొత్త గురువు అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నాడు. తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిన 'సత్య' సినిమా తనపై ఎంత ప్రభావం చూపిందో, ఈ చిత్రం కూడా తన ఆలోచనా విధానాన్ని అంతే మార్చివేసిందని ఆర్జీవీ గతంలో చెప్పాడు.
ధురంధర్ 2 ప్రభంజనం
{{/usCountry}}గతంలో ధురంధర్ 2 సినిమాను చూసిన ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'షోలే' తర్వాత అంతటి ప్రభావం చూపిన సినిమా ఇదని, దర్శకుడు ఆదిత్య ధర్ తనకు కొత్త గురువు అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నాడు. తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిన 'సత్య' సినిమా తనపై ఎంత ప్రభావం చూపిందో, ఈ చిత్రం కూడా తన ఆలోచనా విధానాన్ని అంతే మార్చివేసిందని ఆర్జీవీ గతంలో చెప్పాడు.
ధురంధర్ 2 ప్రభంజనం
{{/usCountry}}ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 1,700 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. రణ్వీర్ సింగ్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ ఫ్రాంచైజీలోని రెండు భాగాలు కలిపి దాదాపు 3,000 కోట్ల రూపాయల మైలురాయిని దాటడం విశేషం.
1993 ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం జీవితం ఆధారంగా గతంలో ఆర్జీవీ కూడా 'సత్య', 'కంపెనీ' వంటి అద్భుతమైన క్రైమ్ డ్రామాలను రూపొందించిన సంగతి తెలిసిందే. అందుకే అండర్ వరల్డ్ పై అతను చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.