...
...
Next Story

Ramayana Promotions: సినిమా ప్రమోషన్లకే రూ.375 కోట్లు.. ఇదో గ్లోబల్ రికార్డు.. రామాయణ మేకర్స్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Ramayana Promotions: రామాయణ మూవీ ప్రమోషన్ల కోసమే సోనీ పిక్చర్స్ ఏకంగా రూ.375 కోట్లు ఖర్చు చేయబోతుందన్న వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇండియన్ సినిమాలో ఈ మొత్తంతో ఈ సినిమా తీస్తేనే భారీ బడ్జెట్ మూవీ అంటారు. అలాంటిది ప్రమోషన్ల కోసమే ఇంత మొత్తం అంటే ఆశ్చర్యం కలిగించేదే.

Published on: Jul 25, 2026, 09:53:05 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ramayana Promotions: బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, విజనరీ డైరెక్టర్ నితీష్ తివారీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఎపిక్ మూవీ 'రామాయణం' (Ramayana) ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. ఈ రెండు భాగాల విజువల్ వండర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను హాలీవుడ్ దిగ్గజ సంస్థ 'సోనీ పిక్చర్స్' (Sony Pictures) దక్కించుకుంది.

Ramayana Promotions: సినిమా ప్రమోషన్లకే రూ.375 కోట్లు.. ఇదో గ్లోబల్ రికార్డు.. రామాయణ మేకర్స్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Ramayana Promotions: సినిమా ప్రమోషన్లకే రూ.375 కోట్లు.. ఇదో గ్లోబల్ రికార్డు.. రామాయణ మేకర్స్ ప్లాన్ మామూలుగా లేదుగా!

హాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ విజువల్ వండర్‌ను గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ చేసేందుకు సోనీ పిక్చర్స్ పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్ల కోసం ఏకంగా రూ. 375 కోట్లు కేటాయించడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షాక్‌కు గురిచేస్తోంది.

ప్రమోషన్ల కోసమే రూ. 375 కోట్లు.. ఇదో గ్లోబల్ రికార్డు

రామాయణ సినిమా ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కోసం సోనీ పిక్చర్స్ ఏకంగా రూ. 235 కోట్లు ఖర్చు చేయనుండగా, భారతీయ మేకర్స్ మరో రూ. 140 కోట్లు జోడిస్తుండటం విశేషం. ఒక ఇండియన్ సినిమా పబ్లిసిటీ కోసం ఈ స్థాయిలో ఏకంగా రూ. 375 కోట్లు కేటాయించడం చరిత్రలో ఇదే తొలిసారి.

అవతార్, మార్వెల్ సినిమాల రేంజ్‌లో ప్రమోషన్లు నిర్వహించి, ప్రపంచంలో ఉన్న ప్రతీ మూలకూ ఈ ఇతిహాస విశిష్టతను తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రొడ్యూసర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.

రణ్‌బీర్, సాయి పల్లవి, యశ్ కాంబో..

'దంగల్' లాంటి ఆల్-టైమ్ రికార్డు హిట్‌తో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటిన నితీష్ తివారీ.. ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి తమ నటనతో మైమరపించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ మైథలాజికల్ డ్రామాకి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ (Hans Zimmer) కలిసి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మర్ ఎంట్రీతో ఈ సినిమా ఆడియో లెవెల్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది.

వరల్డ్ క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం ఆస్కార్ అందుకున్న స్టూడియోస్ పనిచేస్తుండగా, ఐమాక్స్ (IMAX) 3D కెమెరాలతో విజువల్స్‌ను అత్యంత గ్రాండ్‌గా డిజైన్ చేస్తున్నారు.

కామిక్-కాన్ లో హంగామా.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

అమెరికాలో జరిగిన ప్రసిద్ధ 'శాన్ డియాగో కామిక్-కాన్' (SDCC) వేదికగా రామాయణం ప్రాజెక్ట్‌ను మేకర్స్ ప్రెజెంట్ చేసినప్పుడు గ్లోబల్ ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది.

అయితే అనుకోని కారణాల వల్ల శుక్రవారం (జులై 24) విడుదల కావలసిన ఈ సినిమా అధికారిక ట్రైలర్ వాయిదా పడింది. సోనీ పిక్చర్స్ భాగస్వామ్యం అధికారికంగా ఖరారైనందున, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి గ్రాండ్ ఈవెంట్ ద్వారా కొత్త ట్రైలర్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్న ఈ విజువల్ ఎపిక్ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe