...
...
Next Story

Ramayana Teaser: రామాయణ టీజర్‌లోని ఈ 5 విషయాలను గమనించారా? రాముడి వనవాసం నుంచి రావణుడి పుష్పక విమానం వరకు..

Ramayana Teaser: నితేష్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణం' టీజర్ విడుదలైంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ కనిపిస్తుండగా.. టీజర్‌లో దాగి ఉన్న కొన్ని అద్భుతమైన అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Published on: Apr 2, 2026, 14:09:32 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్న నితేష్ తివారీ, నమిత్ మల్హోత్రా ల 'రామాయణం' (Ramayana) టీజర్ గురువారం (ఏప్రిల్ 2) విడుదలైంది. ఈ వారం మొదట్లో అమెరికాలో విడుదలైన ఈ టీజర్.. ఇప్పుడు భారత్‌లోనూ సందడి చేస్తోంది.

Ramayana Teaser: రామాయణ టీజర్‌లోని ఈ 5 విషయాలను గమనించారా? రాముడి వనవాసం నుంచి రావణుడి పుష్పక విమానం వరకు..
Ramayana Teaser: రామాయణ టీజర్‌లోని ఈ 5 విషయాలను గమనించారా? రాముడి వనవాసం నుంచి రావణుడి పుష్పక విమానం వరకు..

రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్న ఈ టీజర్‌లో డైలాగ్స్ ఏవీ లేకపోయినా.. విజువల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అయితే ఈ టీజర్‌లో ఒకవేళ మీరు గమనించకపోయి ఉంటే ఈ 5 కీలకమైన విషయాలను మరోసారి జాగ్రత్తగా చూడండి.

1. సీతమ్మ స్వయంవరం - శివధనుర్భంగం

టీజర్‌లో ఒక సన్నివేశంలో రాముడు శివధనుస్సును (పినాక) ఎత్తడం కనిపిస్తుంది. జనక మహారాజు తన కుమార్తె సీతను వివాహం చేసుకోవాలంటే ఈ భారీ ధనుస్సును ఎక్కుపెట్టాలని షరతు విధిస్తారు. ఎందరో రాజులు విఫలమైన చోట, రాముడు ఎంతో ప్రశాంతంగా ధనుస్సును ఎత్తి నారి సంధిస్తాడు. ఆ సమయంలో ధనుస్సు మధ్యలోకి విరిగిపోవడం కూడా మనం చూడవచ్చు. అలాగే రాముడు నడుచుకుంటూ వస్తుంటే పూల వర్షం కురిపించే దృశ్యాలు కూడా స్వయంవర ఘట్టాన్ని గుర్తు చేస్తున్నాయి.

2. పట్టాభిషేకం నుంచి వనవాసం వరకు..

రాముడి జీవితంలో అత్యంత భావోద్వేగపూరితమైన మలుపును టీజర్‌లో చూపించారు. ఒక వైపు దశరథ మహారాజు సమక్షంలో రాజ దుస్తుల్లో పట్టాభిషేకానికి సిద్ధమవుతున్న రాముడు కనిపిస్తే.. తర్వాతి క్షణంలోనే సాధారణ వస్త్రధారణలో తండ్రికి వీడ్కోలు చెబుతూ 14 ఏళ్ల వనవాసానికి వెళ్లడం కనిపిస్తుంది. అయోధ్య ప్రజల కన్నీటి వీడ్కోలు మధ్య సుమంత్రుడు నడుపుతున్న రథంలో రాముడు వెళ్లడం ప్రేక్షకులను కదిలిస్తుంది.

3. దండకారణ్యంలో రాక్షస సంహారం

రావణుడు సీతను అపహరించుకుపోతుంటే అడ్డుకున్న జటాయువు.. పోరాటంలో ప్రాణాలు కోల్పోతాడు. తన తండ్రి దశరథుడి స్నేహితుడైన జటాయువు చేసిన త్యాగానికి గౌరవంగా.. రాముడు స్వయంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాడు. టీజర్‌లోని కొన్ని విజువల్స్ రాముడు, లక్ష్మణుడు కలిసి జటాయువుకు చితి పేర్చి, నీటితో సంప్రదాయబద్ధంగా కర్మలు నిర్వహించినట్లు సూచిస్తున్నాయి.

5. రావణుడి పుష్పక విమానం

విశ్వకర్మ నిర్మించిన దివ్యమైన విమానం 'పుష్పక విమానం'. గతంలో కొన్ని సినిమాల్లో దీన్ని నెమలి ఆకారంలో చూపించినా.. ఈ చిత్రంలో మాత్రం దీనికి కొత్త రూపునిచ్చారు. టీజర్‌లో ఇది ఎంతో క్లిష్టమైన డిజైన్‌తో కూడిన తామర పువ్వు ఆకారంలో, ఎగిరే వస్తువులా కనిపిస్తుంది. కుబేరుడి నుంచి రావణుడు దీన్ని స్వాధీనం చేసుకుని.. సీతను లంకకు తీసుకెళ్లడానికి వాడతాడు. యుద్ధం తర్వాత రాముడు అయోధ్యకు రావడానికి కూడా దీన్నే ఉపయోగిస్తాడు.

నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మహా కావ్యం రెండు భాగాలుగా విడుదల కానుంది. 'రామాయణ: పార్ట్ 1' 2026 దీపావళికి, 'రామాయణ: పార్ట్ 2' 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. రామాయణం సినిమాలో రాముడు, సీత పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు?

ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు.

2. రావణుడిగా ఏ నటుడు కనిపిస్తున్నాడు?

కన్నడ సూపర్ స్టార్ యష్ (KGF ఫేమ్) రావణుడి పాత్రను పోషిస్తున్నారు.

3. ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది?

మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి థియేటర్లలో విడుదల కానున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe