నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పటివరకు చూడని వైల్డ్ లుక్లో దర్శనమిచ్చింది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఆమె నటిస్తున్న 'మైసా' (Mysaa) ఫస్ట్ గ్లింప్స్ బుధవారం (డిసెంబర్ 24) విడుదలైంది. రష్మిక గ్యాంగ్స్టర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన', రష్మిక 'మైసా' కలిస్తే బాగుంటుందని నెటిజన్లు కోరుకుంటున్నారు.
రష్మిక మైసా లుక్

సాధారణంగా క్లాస్, గ్లామర్ పాత్రల్లో కనిపించే రష్మిక మందన్న ఈసారి రూటు మార్చింది. చేతిలో రైఫిల్, ఒంటి నిండా రక్తం, కళ్ళలో కసి.. వెరసి 'మైసా' గ్లింప్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఒక నిమిషం 21 సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్లో రష్మిక కుర్తా-పైజామా ధరించి, గాయాలతో కనిపిస్తుంది.
దెబ్బలు తగిలి కింద పడిపోతున్నా, కుంటుతున్నా సరే.. చేతిలోని రైఫిల్ మాత్రం వదలదు. చివర్లో ఆమె వేసే కేక గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇందులో రష్మిక ఒక గోండు మహిళగా కనిపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఈశ్వరీ రావు (రష్మిక తల్లి పాత్రలో) చెప్పిన డైలాగ్స్ గ్లింప్స్కి ప్రాణం పోశాయి. "నా కూతురు చనిపోయిందని చెప్పారు. కానీ నా బిడ్డ రక్తాన్ని దాచలేక భూమి భయంతో కంపించింది.. నా బిడ్డ ఊపిరిని మోయలేక గాలి స్తంభించింది.. నా బిడ్డ ఆగ్రహాన్ని చూసి అగ్ని కూడా బూడిదైంది.. చివరకు నా బిడ్డను చంపలేక ఆ మృత్యువే చనిపోయింది. నా బిడ్డ ఎవరో తెలుసా?" అంటూ సాగే వాయిస్ ఓవర్ అద్భుతంగా ఉంది.
రష్మిక ఏమన్నదంటే?
ఈ గ్లింప్స్ను షేర్ చేస్తూ రష్మిక సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది. "ఇది ఓ పేద్ద మంచు కొండలో చిన్న ముక్క మాత్రమే. ఇది జస్ట్ సరదాగా ప్రపంచాన్ని పరిచయం చేయడానికే.. అసలైన సీరియస్ కంటెంట్ చూడాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే" అని చెప్పింది.
ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా
{{/usCountry}}ఈ గ్లింప్స్ను షేర్ చేస్తూ రష్మిక సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది. "ఇది ఓ పేద్ద మంచు కొండలో చిన్న ముక్క మాత్రమే. ఇది జస్ట్ సరదాగా ప్రపంచాన్ని పరిచయం చేయడానికే.. అసలైన సీరియస్ కంటెంట్ చూడాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే" అని చెప్పింది.
ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా
{{/usCountry}}ఈ ఏడాది 'ది గర్ల్ ఫ్రెండ్'లో సాఫ్ట్ రోల్ చేసిన రష్మిక.. ఇప్పుడు బీస్ట్ మోడ్లో కనిపించడం చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండతో లింక్ పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన' (Rowdy Janardhana) లుక్ (లుంగీ కట్టుకుని మాస్ అవతార్) వైరల్ అయ్యింది. ఇప్పుడు రష్మిక కూడా అదే రేంజ్ మాస్ లుక్లో ఉండటంతో.. "హజ్బెండ్ అండ్ వైఫీ పవర్ కపుల్ ఎనర్జీ చూపిస్తున్నారు" అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిస్తే ఆ సినిమా వేరే లెవెల్ ఉంటుందని ఆశిస్తున్నారు.
మైసా సినిమా విశేషాలు
మైసా మూవీని రవీంద్ర పుల్లె డైరెక్ట్ చేస్తున్నాడు. అతనికిదే తొలి సినిమా. ఇందులో రష్మికతోపాటు ఈశ్వరీ రావు, రావు రమేష్, గురు సోమసుందరం ప్రధాన పాత్రల్లో నటించారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించాడు. అతని బీజీఎం ఈ గ్లింప్స్ వీడియోను ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రస్తుతం తెలంగాణ, కేరళలోని దట్టమైన అడవుల్లో షూటింగ్ జరుగుతోంది.