...
...
Next Story

Rashmika Mandanna: రష్మికతో పబ్లిగ్గా దారుణమైన ప్రవర్తన.. బాలీవుడ్ స్టార్ హీరోపై తీవ్ర విమర్శలు

Rashmika Mandanna: బాలీవుడ్ సినిమా 'కాక్‌టెయిల్-2' ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. సహనటుడు షాహిద్ కపూర్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Published on: May 18, 2026, 14:21:50 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Rashmika Mandanna: సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. ప్రస్తుతం ఆమె షాహిద్ కపూర్, కృతి సనన్ లతో కలిసి నటిస్తున్న క్రేజీ బాలీవుడ్ సీక్వెల్ ప్రాజెక్ట్ 'కాక్‌టెయిల్-2'. హోమి అడజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.

Rashmika Mandanna: రష్మికతో పబ్లిగ్గా దారుణమైన ప్రవర్తన.. బాలీవుడ్ స్టార్ హీరోపై తీవ్ర విమర్శలు
Rashmika Mandanna: రష్మికతో పబ్లిగ్గా దారుణమైన ప్రవర్తన.. బాలీవుడ్ స్టార్ హీరోపై తీవ్ర విమర్శలు

ఈ నేపథ్యంలో చిత్ర బృందం ముంబైలో భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ముంబైలో ఏర్పాటు చేసిన 'కాక్‌టెయిల్-2' మ్యూజికల్ ఈవెంట్ కు చిత్ర యూనిట్ అంతా హాజరైంది. అయితే ఈ ఈవెంట్ లో రష్మిక మందన్న ఒక అసౌకర్యమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

రష్మికతో షాహిద్ అసభ్య ప్రవర్తన

ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా హీరో షాహిద్ కపూర్, రష్మిక మందన్న ఇద్దరూ కలిసి మీడియా కెమెరాలకు పోజులు ఇస్తున్నారు. ఆ సమయంలో షాహిద్ కపూర్ హఠాత్తుగా రష్మిక భుజంపై చేయి వేశారు. ఆయన చేయి వేసిన మరుక్షణమే రష్మిక తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు స్పష్టంగా కనిపించింది. షాహిద్ అలా చేయి వేయగానే ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పక్కకు తప్పుకున్నారు.

ఆ సమయంలో అక్కడ మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు ఉండటంతో రష్మిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఆ అసౌకర్యాన్ని బయటకు చూపించకుండా ముఖంపై నవ్వును అలాగే మెయింటైన్ చేశారు. అయినప్పటికీ ఆమె బాడీ లాంగ్వేజ్ లోని మార్పును, ఆమె ముఖంలో ఒక్కసారిగా వచ్చిన ఆ ఇబ్బందికర భావాన్ని కెమెరాలు స్పష్టంగా రికార్డ్ చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో చర్చ

రష్మిక ప్రమోషన్స్ కోసం నవ్వుతూ మేనేజ్ చేసినప్పటికీ, ఆమె మనసులో ఎంత ఇబ్బంది పడిందో ఆ వీడియో చూస్తేనే అర్థమవుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీలైనా సరే పబ్లిక్ ఈవెంట్స్ లో ఉండేటప్పుడు వ్యక్తిగత సరిహద్దులను గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: రష్మిక మందన్న, షాహిద్ కపూర్ కలిసి నటిస్తున్న సినిమా పేరు ఏమిటి?

జవాబు: రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం 'కాక్‌టెయిల్-2'. ఇది 2012లో వచ్చిన సూపర్ హిట్ 'కాక్‌టెయిల్' సినిమాకు సీక్వెల్.

ప్రశ్న: ముంబై ప్రమోషన్స్ లో రష్మికకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది?

జవాబు: సినిమా ప్రమోషన్స్ లో మీడియా ముందు పోజులు ఇస్తున్న సమయంలో హీరో షాహిద్ కపూర్ రష్మిక భుజంపై చేయి వేశారు. ఆ స్పర్శతో అసౌకర్యంగా ఫీలైన రష్మిక తక్షణమే పక్కకు తప్పుకున్నారు.

ప్రశ్న: 'కాక్‌టెయిల్-2' సినిమా ఎప్పుడు విడుదల కానుంది?

జవాబు: హోమి అడజానియా దర్శకత్వంలో లవ్ రంజన్ కథ అందించిన 'కాక్‌టెయిల్-2' సినిమా జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను మే 29న లాంచ్ చేయనున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe