సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా పేరును అధికారికంగా 'మాతృభూమి' (Maatrubhumi) గా మార్చుతున్నట్లు సోమవారం (మార్చి 16) అనౌన్స్ చేశాడు. గతంలో ఈ సినిమాకు 'బాటిల్ ఆఫ్ గల్వాన్' (Battle of Galwan) అనే పేరు ఉండేది. ఈ సినిమాపై చైనా నుండి వ్యక్తమైన తీవ్ర అభ్యంతరాలు, వివాదాల మధ్య ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం.
సల్మాన్ ఖాన్ సినిమా పేరు మార్పు

సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ.. సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో ఇలా రాశాడు. “మే వార్ రెస్ట్ ఇన్ పీస్ (May War Rest In Peace). #Maatrubhumi.” అంటూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశాడు.
ఈ పోస్టర్లో సల్మాన్ ఖాన్ యుద్ధ క్షేత్రంలో గాయపడిన ఒక సైనికుడిగా కనిపిస్తున్నాడు. అతని ముఖం మొత్తం రక్తం, మట్టి, గాయాలతో నిండి ఉండి సినిమా తీవ్రతను తెలియజేస్తోంది. నుదుటిపై లోతైన గాయం, ముఖంపై కమిలిన గుర్తులు కనిపిస్తున్నాయి.
ఇంటెన్స్ లుక్స్ తో నేరుగా కెమెరా వైపు చూస్తున్న సల్మాన్, ముళ్ల తీగ చుట్టిన ఒక ఆయుధాన్ని రక్తంతో నిండిన చేతితో గట్టిగా పట్టుకుని ఉన్నాడు. దుమ్ముతో నిండిన బ్యాక్గ్రౌండ్లో ఇతర సైనికుల నీడలు మసకగా కనిపిస్తున్నాయి. అంతకుముందే ఈ సినిమా నుండి అరిజీత్ సింగ్ పాడిన 'మాతృభూమి' అనే పాట విడుదలై మంచి గుర్తింపు పొందింది.
మాతృభూమి మూవీ నేపథ్యం
దర్శకుడు అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2020లో గల్వాన్ లోయలో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల ఆధారంగా రూపొందుతోంది. ఇందులో సల్మాన్ ఖాన్ బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రలో నటిస్తున్నాడు. 16 బీహార్ రెజిమెంట్కు చెందిన సంతోష్ బాబు.. మరో 19 మంది సైనికులతో కలిసి భారత భూభాగాన్ని కాపాడుతూ వీరమరణం పొందారు. ఆయన త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం మరణానంతరం రెండో అత్యున్నత యుద్ధ పురస్కారం ‘మహావీర చక్ర’తో గౌరవించింది.
టైటిల్పై చైనా అభ్యంతరం
సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్పై చైనా ప్రభుత్వ పత్రిక 'గ్లోబల్ టైమ్స్' విమర్శలు గుప్పించింది. ఈ సినిమాలో వాస్తవాలను వక్రీకరించారని, అతిగా చూపించారని ఆరోపించింది.
{{/usCountry}}సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్పై చైనా ప్రభుత్వ పత్రిక 'గ్లోబల్ టైమ్స్' విమర్శలు గుప్పించింది. ఈ సినిమాలో వాస్తవాలను వక్రీకరించారని, అతిగా చూపించారని ఆరోపించింది.
{{/usCountry}}ఆ టీజర్లో సల్మాన్ ఖాన్ నేతృత్వంలోని భారత సైనికుల బృందం చైనా పీఎల్ఏ (PLA) సైన్యంపైకి దూసుకెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో 'మేరా భారత్ దేశ్ మహాన్ హై' అనే పాట వినిపిస్తుంది. టీజర్లో సల్మాన్ ఖాన్ చెప్పే వాయిస్ ఓవర్.. "సైనికులారా గుర్తుంచుకోండి, మీకు గాయమైతే దాన్ని ఒక మెడల్లా భావించండి, ఒకవేళ మరణం కనిపిస్తే దానికి సెల్యూట్ చేయండి" అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఇప్పటికే 6 కోట్ల వ్యూస్ను సాధించింది.