...
...
Next Story

నేను 25 ఏళ్లుగా డిన్నర్ కోసం బయటకు వెళ్లలేదు.. ముగ్గురు, నలుగురే ఫ్రెండ్స్ ఉన్నారు: సల్మాన్ ఖాన్ కామెంట్స్

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 25 ఏళ్లుగా తాను ఒక్కసారి కూడా డిన్నర్ కోసం బయటకు వెళ్లలేదని చెప్పాడు. తనకు ముగ్గురు, నలుగురు కంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరని అన్నాడు.

Published on: Dec 12, 2025, 21:21:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటపెట్టాడు. గత 25 ఏళ్లుగా తాను బయట ఎక్కడా డిన్నర్‌కు వెళ్లలేదని, తన జీవితం కేవలం ఇల్లు, షూటింగ్, ఎయిర్‌పోర్ట్ చుట్టూనే తిరుగుతుందని రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వెల్లడించాడు. ఈ క్రమంలో తన స్నేహితుల గురించి కూడా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

నా జీవితం అంతా అదే..

నేను 25 ఏళ్లుగా డిన్నర్ కోసం బయటకు వెళ్లలేదు.. ముగ్గురు, నలుగురే ఫ్రెండ్స్ ఉన్నారు: సల్మాన్ ఖాన్ కామెంట్స్ (Instagram)
నేను 25 ఏళ్లుగా డిన్నర్ కోసం బయటకు వెళ్లలేదు.. ముగ్గురు, నలుగురే ఫ్రెండ్స్ ఉన్నారు: సల్మాన్ ఖాన్ కామెంట్స్ (Instagram)

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురువారం (డిసెంబర్ 11) 'రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్'లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జరిగిన ఒక సెషన్‌లో తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా గత రెండున్నర దశాబ్దాలుగా తాను అనుసరిస్తున్న రొటీన్ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

తన లైఫ్ స్టైల్ గురించి సల్మాన్ మాట్లాడాడు. "నేను ఎక్కడికైనా బయటకు వెళ్లి డిన్నర్ చేసి దాదాపు 25-26 ఏళ్లు అవుతోంది. షూటింగ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు, ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్‌కు, హోటల్ నుంచి ఈవెంట్లకు.. అంతే! ఇదే నా జీవితం" అని సల్మాన్ చెప్పుకొచ్చాడు.

స్నేహితుల గురించి..

తన ప్రయాణంలో చాలా మంది దగ్గరి స్నేహితులను కోల్పోయానని సల్మాన్ గుర్తు చేసుకున్నాడు. "నా జీవితంలో ఎక్కువ భాగం కుటుంబం, స్నేహితులతోనే గడిపాను. అందులో చాలా మంది వెళ్లిపోయారు. ఇప్పుడు నాతో చాలా కాలం నుంచి ట్రావెల్ అవుతున్న పాత స్నేహితులు కేవలం నలుగురు లేదా ఐదుగురు మాత్రమే ఉన్నారు" అని ఎమోషనల్ అయ్యాడు.

సల్మాన్ ఖాన్ తదుపరి మూవీ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. 2020లో గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇది చాలా అరుదైన సరిహద్దు ఘర్షణ. ఇందులో తుపాకులు వాడలేదు. సైనికులు కర్రలు, రాళ్లతోనే ముఖాముఖి తలపడ్డారు. ఈ వాస్తవ ఘటనలను ఈ సినిమాలో చూపించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe