Salman Khan: టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో చేతులు కలిపాడు. అప్పుడెప్పుడో మూడేళ్ల కిందట దళపతి విజయ్ తో వారసుడు మూవీ చేసిన అతడు.. ఈసారి సల్మాన్ తో మూవీ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ సోమవారం (మార్చి 30) వచ్చేసింది. ఎప్పటినుంచో ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న రూమర్స్ను నిజం చేస్తూ.. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖానే ఈ విషయాన్ని తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
సల్మాన్ ఖాన్ మాస్ ట్వీట్..

ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి సల్మాన్ ఖాన్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్స్లో ఒక పోస్ట్ పెట్టి ఫ్యాన్స్కు ఫుల్ కిక్ ఇచ్చాడు. తనదైన సిగ్నేచర్ స్టైల్లో "దిల్, దిమాగ్, జిగర్ సే, ఫ్రమ్ దిస్ ఏప్రిల్" అని క్యాప్షన్ పెట్టి ఈ సినిమా అప్డేట్ ఇచ్చాడు.
ఈ డైలాగ్ చూస్తుంటేనే సినిమాలో సల్మాన్ యాక్షన్, ఎమోషన్ ఏ రేంజ్లో ఉండబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు. సల్మాన్ ఖాన్ లాంటి ఒక మాస్ హీరోను మన టాలీవుడ్ డైరెక్టర్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలని అభిమానులంతా చాలా ఎక్సయిటింగ్గా వెయిట్ చేస్తున్నారు.
భారీ బడ్జెట్.. దిల్ రాజు ప్రొడక్షన్..
ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికొస్తే, ఈ ఏడాది ఏప్రిల్ 2026 నుంచే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చాలా గ్రాండ్ స్కేల్లో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు.
దిల్ రాజుతో పాటు కుల్దీప్ రాథోడ్, రఫీ ఖాజీ ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని పక్కాగా చెప్పొచ్చు.
వచ్చే ఏడాది గ్రాండ్ రిలీజ్..
ఈ భారీ చిత్రాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం టార్గెట్గా పెట్టుకుంది. అంటే సినిమా రిలీజ్ కోసం మనం వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయక తప్పదు. సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లాంటి ఇతర కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలోనే అఫీషియల్గా బయటకు రానున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.
వంశీ పైడిపల్లి గురించి..
{{/usCountry}}ఈ భారీ చిత్రాన్ని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం టార్గెట్గా పెట్టుకుంది. అంటే సినిమా రిలీజ్ కోసం మనం వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయక తప్పదు. సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లాంటి ఇతర కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలోనే అఫీషియల్గా బయటకు రానున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.
వంశీ పైడిపల్లి గురించి..
{{/usCountry}}2007లో ప్రభాస్ తో మున్నా సినిమా తీసి టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు వంశీ పైడిపల్లి. ఆ తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, దళపతి విజయ్ లాంటి స్టార్లతో మూవీస్ చేశాడు. అతని ఖాతాలో బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి, వారసుడులాంటి సినిమాలు ఉన్నాయి.
19 ఏళ్ల కెరీర్లో కేవలం ఆరే సినిమాలు తీసిన వంశీ.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో మూవీ చేయబోతుండటం నిజంగా విశేషమే. ప్రస్తుతం సల్మాన్.. మాతృభూమి మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.