Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు, బాక్సాఫీస్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ అంటేనే రికార్డుల వేట. ముఖ్యంగా 'ఈద్' పండుగ వచ్చిందంటే థియేటర్ల వద్ద సల్మాన్ మేనియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొంతకాలంగా సరైన సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సల్మాన్.. ఇప్పుడు తన మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో తన ఈద్ (రంజాన్)కు తిరిగి వచ్చేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఏడాది ఈద్ కానుకగా సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీ రిలీజ్ కానుంది.
టాలీవుడ్ దర్శకుడితో క్రేజీ కాంబో..

సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీని ఈ మధ్యే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా.. నయనతార ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ విండో వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా సల్మాన్, నయనతార, వంశీ పైడిపల్లి రావడం ఈ వీడియోలో చూడొచ్చు. వీడియో చివర్లో సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి ఫిల్మ్ ఈద్ 2027 అని అనౌన్స్ చేశారు.
'బృందావనం', 'ఎవడు', 'మహర్షి' వంటి సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వంశీ.. చివరిగా దళపతి విజయ్తో 'వారసుడు' (Varisu) తీసి భారీ విజయాన్ని అందుకున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ను ఎమోషన్స్తో జోడించి చెప్పడంలో వంశీ సిద్ధహస్తుడు. ఇప్పుడు అదే మ్యాజిక్ను సల్మాన్ ఖాన్ ఇమేజ్కు తగ్గట్టుగా బాలీవుడ్ తెరపై చూపించబోతున్నారు. సౌత్ దర్శకులు ప్రస్తుతం బాలీవుడ్లో సృష్టిస్తున్న ప్రభంజనాన్ని చూస్తుంటే.. వంశీ - సల్మాన్ కలయికలో రాబోయే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
జతకట్టనున్న లేడీ సూపర్ స్టార్..
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతోంది. షారుఖ్ ఖాన్ 'జవాన్' చిత్రంతో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నయనతారకు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు సల్మాన్ సరసన ఆమె నటించనుండటం ఈ ప్రాజెక్ట్పై అంచనాలను రెట్టింపు చేస్తోంది.
{{/usCountry}}ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతోంది. షారుఖ్ ఖాన్ 'జవాన్' చిత్రంతో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నయనతారకు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు సల్మాన్ సరసన ఆమె నటించనుండటం ఈ ప్రాజెక్ట్పై అంచనాలను రెట్టింపు చేస్తోంది.
{{/usCountry}}వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. యాక్షన్, రొమాన్స్ కలగలిసిన ఈ కథలో నయనతార పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.
సల్లూ భాయ్ ఈద్ సెంటిమెంట్
సల్మాన్ ఖాన్ కెరీర్లో 'వాంటెడ్', 'దబంగ్', 'భజరంగీ భాయిజాన్', 'సుల్తాన్' వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలన్నీ ఈద్ పండుగ రోజే విడుదలయ్యాయి. అందుకే ఈ సీజన్ను సల్మాన్ తన అడ్డాగా భావిస్తారు. గతేడాది సికిందర్ మూవీతో వచ్చినా అది నిరాశ పరిచింది. ఈ ఏడాది మాతృభూమి మూవీతో ఈద్ కు వస్తాడని భావించినా అది కుదరలేదు. దీంతో వచ్చే ఏడాది వంశీ పైడిపల్లి మూవీపై సల్మాన్ ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా దర్శకుడు ఎవరు?
ఈ చిత్రానికి తెలుగు పాపులర్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇది బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్.
2. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి సినిమాలో హీరోయిన్ ఎవరు?
లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన కథానాయికగా నటిస్తున్నారు.
3. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి సినిమా ఎప్పుడు విడుదల కానుంది?
ఈ చిత్రాన్ని 2027 ఈద్ పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది.