...
...
Next Story

సమంత ఎంగేజ్‌మెంట్ రింగ్ గుర్తించని అభిమానులు.. కొన్ని నెలల కిందటే నిశ్చితార్థం.. తాజా ఫొటోలతో సీక్రెట్ బయటికి..

సమంత రూత్ ప్రభు రెండో పెళ్లిలో రాజ్ పెట్టిన రింగు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలుసు కదా. దీని గురించి ప్రత్యేకంగా సెర్చ్ చేస్తుంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ రింగు సమంత వేలికి ఉండటం కొందరు రెడిట్ యూజర్లు గుర్తించారు.

Published on: Dec 2, 2025, 13:58:57 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్) వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో డిసెంబర్ 1న వీరిద్దరూ 'లింగ భైరవి దేవి' సన్నిధిలో భూత శుద్ధి విధానంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? నిశ్చితార్థం ఎప్పుడు జరిగింది? అనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. తాజాగా సోషల్ మీడియా డిటెక్టివ్స్ సమంత వేలికి ఉన్న భారీ ఉంగరాన్ని గమనించి.. వారి ఎంగేజ్మెంట్ టైమ్‌లైన్‌పై ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

ఆ ఉంగరం కథేంటి?

సమంత ఎంగేజ్‌మెంట్ రింగ్ గుర్తించని అభిమానులు.. కొన్ని నెలల కిందటే నిశ్చితార్థం.. తాజా ఫొటోలతో సీక్రెట్ బయటికి..
సమంత ఎంగేజ్‌మెంట్ రింగ్ గుర్తించని అభిమానులు.. కొన్ని నెలల కిందటే నిశ్చితార్థం.. తాజా ఫొటోలతో సీక్రెట్ బయటికి..

సమంత, రాజ్‌లు తమ బంధం గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. కానీ పెళ్లి తర్వాత సమంత షేర్ చేసిన ఫోటోలలో రాజ్ ఆమె వేలికి ఒక భారీ ఉంగరాన్ని తొడుగుతున్న దృశ్యం ఉంది. ఈ ఫోటోను నిశితంగా గమనించిన నెటిజన్లు.. ఆ ఉంగరం తమకు ముందే తెలుసు అని గుర్తించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 13న (వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు) సమంత తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. పింక్ డ్రెస్సులో ఉన్న ఆ ఫోటోలో ఆమె ఉంగరపు వేలికి అదే ఉంగరం ఉంది. అంటే వీరి నిశ్చితార్థం బహుశా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగి ఉండవచ్చని రెడిట్ (Reddit) వేదికగా చర్చ జరుగుతోంది.

అప్పుడే హింట్ ఇచ్చారా?

ఫిబ్రవరిలో సమంత ఆ ఫోటో పెట్టినప్పుడే చాలామంది అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. "ఆమె ఎంగేజ్మెంట్ అయిపోయిందని నాకొక్కడికే అనిపిస్తుందా?" అని అప్పట్లోనే కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు పెళ్లి ఫోటోలు చూశాక అది నిజమే అని తేలిపోయింది.

ఒక నెటిజన్ ఆ పాత ఫోటోను పోస్ట్ చేస్తూ.. "ఇప్పుడు అంతా అర్థమవుతోంది. వారి ఎంగేజ్మెంట్ జరిగి చాలా కాలం అయ్యింది" అని రాసుకొచ్చారు. ఆ ఉంగరం డిజైన్, మెటీరియల్ గురించి కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరొకరు సరదాగా స్పందిస్తూ.. "మనందరం రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ రింగ్ చూస్తూ బిజీగా ఉండిపోయాం.. సమంత రింగ్‌ను మిస్ అయ్యాం" అని కామెంట్ చేయడం విశేషం.

సమంత రెండో పెళ్లి విశేషాలు

అటు రాజ్ నిడిమోరు 2015లో శ్యామలి డేని వివాహం చేసుకోగా, 2022లో విడిపోయారని సమాచారం. 2024లో సమంత, రాజ్ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు మొదలయ్యాయి. మొత్తానికి ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచిన తమ ప్రేమ బంధాన్ని.. సమంత-రాజ్ ఇప్పుడు అధికారికంగా పెళ్లితో ధృవీకరించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe