Samantha Pregnancy: అవును.. నేను ప్రెగ్నెంట్.. మెటర్నిటీ బ్రేక్ తీసుకుంటున్నాను: సమంత
Samantha Pregnancy: సమంత తన ప్రెగ్నెన్సీని కన్ఫమ్ చేసింది. మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ లో ఆమె మెటర్నిటీ బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పింది. దీంతో అక్కడున్న వాళ్లందరూ సమంతకు కంగ్రాట్స్ చెప్పారు. పక్కనే ఉన్న ఆమె భర్త రాజ్ నిడిమోరు సిగ్గుపడుతూ కనిపించారు.
Samantha Pregnancy: స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు తన పర్సనల్ లైఫ్కు సంబంధించి మోస్ట్ అవేటెడ్ గుడ్ న్యూస్ను అఫీషియల్గా అనౌన్స్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ప్రెగ్నెన్సీ రూమర్లకు సమంత ఫుల్ స్టాప్ పెట్టింది.

తను నటిస్తూ స్వయంగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ డ్రామా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) థియేటర్లలో రూ. 50 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్బస్టర్ రన్ కొనసాగిస్తోంది. ఈ క్రేజీ మూవీ సక్సెస్ మీట్లో సమంత లైవ్లోనే ఎమోషనల్ అవుతూ తను త్వరలోనే తల్లి కాబోతున్నట్లు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది.
ఎమోషనల్ అయిన సమంత.. నా లైఫ్లో బెస్ట్ చాప్టర్
గత వారం రోజులుగా మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్, సక్సెస్ సెలబ్రేషన్స్లో సమంత బేబీ బంప్తో కనిపించడంతో నెటిజన్లు రకరకాల పోస్టులు పెట్టారు. ఇప్పుడు స్వయంగా సమంతే క్లారిటీ ఇవ్వడంతో మెగా సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.
సక్సెస్ మీట్ స్టేజీపై సమంత మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది. తన కెరీర్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ప్రతి దశలోనూ తనకు అండగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది.
"మాతృత్వం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక అద్భుతమైన చాప్టర్. నా లైఫ్లో స్టార్ట్ కాబోతున్న ఈ కొత్త జర్నీని నేను ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అందుకే సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను. ఈ గ్యాప్ కేవలం టెంపరరీ మాత్రమే.. మళ్లీ సరికొత్త ప్రాజెక్ట్స్తో మీ ముందుకు పవర్ఫుల్ కమ్బ్యాక్ ఇస్తాను" అని సమంత ప్రామిస్ చేసింది.
సమంత టైమింగ్ చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఒకవైపు బిగ్గెస్ట్ సోలో హిట్ సినిమా చేతిలో ఉండటం, అదే టైమ్లో పర్సనల్ లైఫ్లోనూ ఇంతకంటే పెద్ద హ్యాపీ మూమెంట్ రావడం నిజంగానే డబుల్ ధమాకా అని చెప్పాలి.
రాజ్ నిడిమోరుతో ప్రేమ, పెళ్లి, ప్రెగ్నెన్సీ
సమంత, ప్రముఖ బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (రాజ్ అండ్ డీకే ఫేమ్) గతంలో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' సిరీస్ల కోసం కలిసి వర్క్ చేశారు. ఆ ప్రొఫెషనల్ జర్నీ కాస్తా పర్సనల్ బాండింగ్గా మారి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. గత ఏడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లో ఉన్న లింగ భైరవి టెంపుల్లో వీరు చాలా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఆరు నెలలకే ఈ స్టార్ కపుల్ తమ లైఫ్లోకి కొత్త మెంబర్ను వెల్కమ్ చెప్పడానికి రెడీ అయ్యారు.
ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం సమంత ప్రస్తుతం ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉందని, డిసెంబర్ 2026 నాటికి బేబీ డెలివరీ ఉండబోతున్నట్లు సమాచారం. రీసెంట్గా తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లినప్పుడు కూడా రాజ్ నిడిమోరు జనాల రద్దీలో సమంతను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
నందిని రెడ్డి హాట్రిక్ హిట్.. సరికొత్త రికార్డులు
సమంత కెరీర్లో మైలురాయిగా నిలిచిన 'మా ఇంటి బంగారం' సినిమాను టాలెంట్ డైరెక్టర్ బి.వి. నందిని రెడ్డి తెరకెక్కించారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'జబర్దస్త్', 'ఓ బేబీ' సినిమాల తర్వాత ఈ జోడీకి ఇది హాట్రిక్ హిట్ కావడం విశేషం. ఈ సినిమాలో సమంత ఒక మాజీ హంతకురాలు పాత్రలో నటించింది. పెళ్లి చేసుకుని హౌస్వైఫ్గా సెటిల్ అయిన స్వర్ణ అనే మహిళ.. తన కొత్త ఫ్యామిలీకి పాత శత్రువుల వల్ల ప్రమాదం వస్తే గరిటె పక్కన పెట్టి ఎలా ఆయుధం పట్టిందనే ఇంట్రెస్టింగ్ పాయింట్తో నందిని రెడ్డి ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాను ఎక్సలెంట్గా డైరెక్ట్ చేశారు.
సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ ఈ సినిమా సక్సెస్లో కీ రోల్ ప్లే చేశాయి. ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ను భారీ రేటుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతం చేసుకుంది. ఒకేసారి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ చూస్తున్న సమంతకు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ చెప్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


