ఆ రెండేళ్లు నరకం చూశా.. తిండి కూడా తిననివ్వలేదు: బరువు తగ్గడంపై సమంత షాకింగ్ కామెంట్స్.. పిల్లి పేరు వెనుక సీక్రెట్ ఇదే
Samantha Ruth Prabhu: సమంత రూత్ ప్రభు తన మయోసైటిస్ నాటి కష్టాల గురించి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. ఆ రెండేళ్లు కనీసం తినాలన్నా తినలేకపోయానని, అందుకే బరువు తగ్గినట్లు ఆమె చెప్పింది. అంతేకాదు తన పెంపుడు పిల్లికి జెలాటో అనే పేరు పెట్టడం వెనుక సీక్రెట్ కూడా వెల్లడించింది.
Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి మనందరికీ తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడిన సమంత.. చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది.

నందిని రెడ్డి దర్శకత్వంలో ఆమె నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మా ఇంటి బంగారం' జూన్ 19న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత తన అనారోగ్యం, విపరీతంగా బరువు తగ్గడంపై వస్తున్న ట్రోల్స్, అలాగే తన పెంపుడు పిల్లి 'జెలాటో' పేరు వెనుక ఉన్న కన్నీటి కథను పంచుకుంది.
బరువు తగ్గడంపై సమంత ఘాటు సమాధానం
గత కొన్ని రోజులుగా సమంత లుక్స్, ఆమె వెయిట్ లాస్ గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. దీనిపై సమంత గలటా ప్లస్ ఇంటర్వ్యూలో చాలా ఓపెన్గా మాట్లాడింది. మయోసైటిస్ వల్ల తాను తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చిందని, ఏది పడితే అది తింటే రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపేదని తెలిపింది.
"చాలామంది నన్ను ఎప్పుడూ ఒకటే అడుగుతుంటారు.. ఎందుకు అంతలా బరువు తగ్గిపోయావని? అవతలి వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ పూర్తిగా తెలియదు. నేను కావాలని డైటింగ్ చేసి బరువు తగ్గలేదు. నాకు తినాలని ఉన్నా కూడా తినలేని పరిస్థితి. నేను తినలేకపోయాను" అంటూ తన బాధను వ్యక్తపరిచింది. ప్రస్తుతం తాను కొంచెం కోలుకున్నానని, ఇప్పుడు బాగానే తినగలుగుతున్నానని కానీ అతిగా ఏదీ తీసుకోలేనని స్పష్టం చేసింది.
ఆ పిల్లి పేరు 'జెలాటో' వెనుక ఉన్న కథ ఏంటంటే?
తన పెంపుడు పిల్లికి 'జెలాటో' అని పేరు పెట్టడం వెనుక ఉన్న ఎమోషనల్ జర్నీని సమంత రివీల్ చేసింది. "నేను అనారోగ్యం వల్ల సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఆ రెండేళ్లు నా తిండిపై ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. ఏ చిన్న ఫుడ్ తిన్నా నా పొట్ట అప్సెట్ అయి మయోసైటిస్ వ్యాధి మళ్లీ ఎక్కువయ్యేది. అందుకే రెండేళ్ల పాటు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒకే రకమైన చప్పటి ఆహారాన్ని తిన్నాను. ఆ నరకం చూశాక.. నా డైట్లో యాడ్ చేసుకోవడానికి డాక్టర్లు పర్మిషన్ ఇచ్చిన మొదటి స్వీట్ ఐటమ్.. షుగర్, డెయిరీ లేని జెలాటో ఐస్క్రీమ్. ఆ సమయంలో నేను దాని కోసమే ఎంతగానో ఎదురుచూసేదాన్ని. అందుకే నా లైఫ్లో అంత ప్రాధాన్యత ఉన్న ఆ పేరును నా పిల్లికి పెట్టుకున్నాను" అని సమంత చెప్పుకొచ్చింది.
సమంత హెల్త్, కెరీర్ టైమ్లైన్
- 2021: నాగ చైతన్యతో విడాకులు
- 2022: 'యశోద' ప్రమోషన్స్ సమయంలో మయోసైటిస్ వ్యాధి గుర్తింపు
- 2023-2025: సినిమాలకు లాంగ్ బ్రేక్, ట్రీట్మెంట్
- 2026: 'మా ఇంటి బంగారం' సినిమాతో గ్రాండ్ కంబ్యాక్
ఇండస్ట్రీ వదిలేయాలి అనుకున్నా.. నన్ను మార్చిన బ్రేక్
మయోసైటిస్ గుర్తించిన తర్వాత తన ఆలోచనా విధానం ఎలా మారిందో సమంత మరో ఇంటర్వ్యూలో పంచుకుంది. "నేను కెరీర్లో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పట్లో రాత్రింబవళ్లు కష్టపడి సినిమాలు చేయాలనే ఇగో ఉండేది. యాక్టర్గా మనకు ఎండ్ కార్డ్ అనేది ఉండదు అనుకుంటాం. కానీ ఈ బ్రేక్ సమయంలో నా కెరీర్ ముగింపును నేను ఊహించుకోగలిగాను. అది నన్ను చాలా మార్చింది. ఒకవేళ మళ్లీ ఇండస్ట్రీకి వస్తే నా పాత పద్ధతులను, లైఫ్ స్టైల్ను పూర్తిగా మార్చుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యాను" అని సమంత ఎమోషనల్ అయింది.
'మా ఇంటి బంగారం' ప్రీ-రిలీజ్ బిజినెస్ సంచలనం
నందిని రెడ్డి డైరెక్షన్లో వస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమాలో సమంత హౌస్వైఫ్ పాత్రలో కనిపిస్తూనే పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సమంత డూప్ లేకుండా రియల్ స్టంట్స్ చేసి గాయపడినట్లు స్వయంగా వెల్లడించింది. ఈ చిత్రంలో గౌతమి, శ్రీముఖి, దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సమంత స్వయంగా తన 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్పై రాజ్ నిడిమోరుతో కలిసి ఈ సినిమాను నిర్మించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా రిలీజ్కు ముందే థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా పూర్తి బడ్జెట్ పెట్టుబడిని రికవరీ చేసి ఇప్పటికే లాభాల్లోకి దూసుకెళ్లడం విశేషం. జూన్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమాతో సమంత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


