మెడలో మంగళసూత్రంతో మెరిసిన సమంత-భర్త రాజ్ నిడిమోరు చేసిన పనికి ఫిదా కావాల్సిందే-వీడియో వైరల్
ఇటీవల సమంత రూత్ ప్రభు, తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో సమంత మెడలో మంగళసూత్రంతో మెరిసింది. ఇదే సమయంలో రాజ్ చేసిన ఓ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సెలబ్రిటీ జంట సమంతా రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు రీసెంట్ గా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. సమంత మెడలో మంగళసూత్రంతో మెరిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇందులో తాళిబొట్టుతో ఉన్న సమంత పై నెటిజన్లు ఫోకస్ పెడుతున్నారు. ఈ సందర్భంగా సమంత భర్త రాజ్ చేసిన ఓ పనిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
మంగళసూత్రంతో సమంత
మంగళసూత్రంతో సమంత
ఇటీవల రాజ్ తో కలిసి సమంత హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె మంగళసూత్రంతో కనిపించింది. దీంతో ఆమె స్టైల్ కు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సమంత వదులుగా ఉన్న బ్లేజర్, దానికి సరిపోయే ఫార్మల్ ప్యాంట్ తో పాటు నల్లటి లోపలి టాప్ ను వేసుకుంది.
ఎయిరోపోర్ట్ బయట
సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు జంటగా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. వారు బయటకు వెళ్ళేటప్పుడు రాజ్ తో యానిమేట్ గా సమంత చాట్ చేయడం కనిపించింది. వారు అభిమానులతో కొన్ని చిత్రాలను క్లిక్ చేయడానికి కూడా ఆగిపోయారు. కానీ ఆమె మంగళసూత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.
రాజ్ ఏం చేశాడంటే?
రాజ్ బ్రౌన్ షర్టు ధరించి నీలం డెనిమ్ జీన్స్ వేసుకున్నాడు. తన భార్య కారు దగ్గరకు వచ్చినప్పుడు రాజ్ డోర్ తీశాడు. రాజ్ చేసిన ఈ పనికి, భార్య పట్ల తనకున్న గౌరవానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
"ఆమె సంతోషంగా ఉండటం చూసి నేను చాలా హ్యాపీగా ఉన్నా’’ అని ఓ ఫ్యాన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. "వావ్ ఆమె మెరుస్తుంది, ప్రేమ దక్కింది’’ అని ఒకరు, "నిజంగా ఆమె మెరుస్తోంది" అని మరొకరు పోస్ట్ చేశారు. అందమైన జంట అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
గతేడాది డిసెంబర్ 1న సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. తన పెళ్లి ఫొటోలను షేర్ చేసి సమంత అభిమానులందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ జంట కోయంబత్తూరులో ఒక సన్నిహిత, భూత యోగ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. రీసెంట్ గా ఈ జోడీ పోర్చుగల్ లోని లిస్బన్ కు హనీమూన్ కు వెళ్లింది. రెండో పెళ్లి తర్వాత సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు మళ్లీ వచ్చేస్తోంది.