Pranay Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా సోదరుడు, భద్రకాళి పిక్చర్స్ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా యూట్యూబ్ రివ్యూయర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రీసెంట్గా తను ప్రొడ్యూస్ చేసిన 'రోమాంచకం' సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో ఫిల్మ్ క్రిటిక్స్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. "దమ్ముంటే రాబోయే ప్రభాస్ 'స్పిరిట్' సినిమాను కూడా ఇలాగే తొక్కేయండి చూద్దాం" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
రివ్యూయర్లకు ప్రణయ్ ఛాలెంజ్

'ట్యాగ్ తెలుగు' యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ, "సినిమా రివ్యూలు ఇవ్వడం చాలా ఈజీ జాబ్" అని తేల్చేశారు. థియేటర్లలోకి వచ్చే ప్రతి 10 సినిమాల్లో 9 సినిమాలు ఫెయిల్ అవుతుంటాయని, అందుకే రివ్యూయర్లు ఈజీగా కామెంట్స్ చేసేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒక సినిమా ప్రొడక్షన్ వెనుక డైరెక్టర్, టీమ్ పడే కష్టం రివ్యూయర్లు గ్రహించలేరని చెప్పారు.
ఆడియన్స్ ఇచ్చే తీర్పుతో పోలిస్తే రివ్యూయర్ల నెగెటివిటీ ఎల్లప్పుడూ నిలవదని ఆయన స్పష్టం చేశారు. చిన్న సినిమా కాబట్టి 'రోమాంచకం'పై కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు రివ్యూలు రాశారని ఆరోపించారు. నిజంగా రివ్యూయర్లకు ఆ సత్తా ఉంటే, త్వరలో రాబోతున్న ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ 'స్పిరిట్' రిలీజ్ టైమ్లో తమ పవర్ చూపించాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
'రోమాంచకం' బాక్స్ ఆఫీస్ ట్రాక్ రికార్డ్
వేణు గోపాల్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన 'రోమాంచకం' మూవీ సెప్టెంబర్ 3న థియేటర్లలోకి వచ్చింది. 'మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో ఒక డేటింగ్ యాప్ ఫౌండర్ చుట్టూ తిరిగే లవ్, యాక్షన్ డ్రామాను చూపించారు.
వరల్డ్ వైడ్ గా ఈ సినిమా దాదాపు రూ. 9.72 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్, మ్యూజిక్ బాగున్నా.. మిక్స్డ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోయింది.
ప్రభాస్ 'స్పిరిట్' క్రేజీ అప్డేట్స్
{{/usCountry}}వరల్డ్ వైడ్ గా ఈ సినిమా దాదాపు రూ. 9.72 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్, మ్యూజిక్ బాగున్నా.. మిక్స్డ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోయింది.
ప్రభాస్ 'స్పిరిట్' క్రేజీ అప్డేట్స్
{{/usCountry}}మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' పై వరల్డ్ వైడ్ గా మైండ్ బ్లాకింగ్ అంచనాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేసిన సందీప్, ఈసారి ప్రభాస్ను ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో ప్రెజెంట్ చేస్తున్నారు.
ఖైదీగా మారిన ఓ ఇంటెన్స్ పోలీసు చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది. ఇందులో నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, కాంచన, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గతంలో కొరియన్ సూపర్స్టార్ డాన్ లీ ఈ సినిమాలో నటిస్తున్నారంటూ వచ్చిన రూమర్లను ప్రణయ్ రెడ్డి వంగా పూర్తిగా ఖండించారు. ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది.