Meena: ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన నటి మీనా. తెలుగులోనూ అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేసింది. ఇప్పుడు కథా బలమున్న క్యారెక్టర్లు ఎంపిక చేసుకుంటూ, సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చేస్తోంది. అయితే ఈ మధ్య మీనా ఇల్లు గురించి తెగ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రూ.10 కోట్ల ఇల్లును రూ.100 కోట్లకు అమ్మిందనే టాపిక్ తెగ వైరల్ అయింది.
మీనా ఇల్లు

సీనియర్ నటి మీనాకు చెన్నైలోని సైదాపేట శ్రీరామ్ కాలనీలో ఓ పెద్ద బంగ్లా ఉంది. ప్యాలెస్ లా ఉన్న ఈ ఇల్లు గురించి ఇప్పుడు వార్తలు తెగ వైరల్ గా మారాయి. 20 ఏళ్ల క్రితమే మీనా ఎంతో ఇష్టంగా ఈ ఇల్లు కట్టించుకుంది. కేరళ సంప్రదాయ శైలిలో రాజభవనంలా ఈ ఇంటిని తీర్చిదిద్దుకుంది. ఇందుకు అప్పట్లో సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసిందని తెలిసింది.
రూ.100 కోట్లకు
రూ.10 కోట్లతో ఖర్చుతో మీనా దగ్గరుండి మరీ కట్టించుకున్న ఇల్లును ఇప్పుడు ఆమె రూ.100 కోట్లకు అమ్మిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రూ.10 కోట్లు పెడితే రూ.100 కోట్లు వచ్చాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఓ ఎన్ఆర్ఐ జోడీ ఈ బంగ్లాపై మనసు పడిందని, అందుకే రూ.100 కోట్లు అయినా ఓకే అన్నారనే వార్తలు వచ్చాయి.
ఎలాంటి డీల్ జరగలేదని
తన ఇల్లు అమ్మకం గురించి మీనా ఇంతవరకూ స్పందించలేదు. అయితే మీనా సన్నిహితులు మాత్రం దీనిపై ఓ క్లారిటీనిచ్చారు. మీనా ఇల్లు అమ్మిందనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని, ఇది కేవలం పుకారు మాత్రమే అని కొట్టిపారేశారు. మీనాకు కేవలం అది ఒక బిల్డింగ్ మాత్రమే కాదని, అంతకు మించిన ఎమోషన్ అని తెలిపారు.
మీనా భర్త సాగర్ ఆ ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. మీనా కుమార్తె నైనిక అక్కడే పుట్టి పెరిగింది. దీంతో మీనాకు ఆ ఇల్లుతో బలమైన అనుబంధం ఏర్పడింది. మీనా భర్త చనిపోయిన నేపథ్యంలో ఆ ఇంటితో బంధాన్ని మీనా తెంచుకోదని ఆమె సన్నిహితులు స్పష్టం చేశారు.
దృశ్యంతో
{{/usCountry}}మీనా భర్త సాగర్ ఆ ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. మీనా కుమార్తె నైనిక అక్కడే పుట్టి పెరిగింది. దీంతో మీనాకు ఆ ఇల్లుతో బలమైన అనుబంధం ఏర్పడింది. మీనా భర్త చనిపోయిన నేపథ్యంలో ఆ ఇంటితో బంధాన్ని మీనా తెంచుకోదని ఆమె సన్నిహితులు స్పష్టం చేశారు.
దృశ్యంతో
{{/usCountry}}తెలుగులో చంటి, సుందరకాండ, సూర్యవంశం, ముఠా మేస్త్రి, బొబ్బిలి సింహం, అల్లరి అల్లుడు, సీతారామయ్య గారి మనవరాలు తదితర సినిమాలతో మీనా అలరించింది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ సీనియర్ నటి తిరిగి దృశ్యంతో అదరగొట్టింది. దృశ్యం 2లోనూ తన నటనతో మెప్పించింది. ఇప్పుడు దృశ్యం 3తో త్వరలో ఆడియన్స్ ను పలకరించబోతుంది.