ఈ సినిమా నిజంగా స్పెషల్.. నిజాయితీగా తీశారు: జాన్వీ కపూర్ మూవీకి షారుక్ ఖాన్ రివ్యూ.. ఈ ఓటీటీలో చూడండి

జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెట్వా నటించిన హోమ్‌బౌండ్ మూవీకి బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ రివ్యూ ఇచ్చాడు. ఈ సినిమా నిజంగా చాలా స్పెషల్ అని, చాలా నిజాయితీగా తీశారని అతడు అనడం విశేషం.

Published on: Dec 10, 2025 8:17 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియా తరఫున 2026 ఆస్కార్ లకు ఎంపికైన మూవీ 'హోమ్‌బౌండ్'. ప్రముఖ దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ఈ సినిమాను చూసిన సూపర్ స్టార్ షారుక్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. సినిమాలోని నిజాయితీ, భావోద్వేగాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అతడు చెప్పాడు. ఇది నిజంగా ప్రత్యేకమైన సినిమా అని కొనియాడాడు.

ఈ సినిమా నిజంగా స్పెషల్.. నిజాయితీగా తీశారు: జాన్వీ కపూర్ మూవీకి షారుక్ ఖాన్ రివ్యూ.. ఈ ఓటీటీలో చూడండి
ఈ సినిమా నిజంగా స్పెషల్.. నిజాయితీగా తీశారు: జాన్వీ కపూర్ మూవీకి షారుక్ ఖాన్ రివ్యూ.. ఈ ఓటీటీలో చూడండి

హోమ్‌బౌండ్‌పై షారుక్ రివ్యూ ఇదే

ఆస్కార్స్ కు ఇండియా తరఫున అధికారిక ఎంట్రీగా నిలిచిన హోమ్‌బౌండ్ మూవీపై బుధవారం (డిసెంబర్ 10) ఎక్స్ వేదికగా షారుక్ రివ్యూ ఇచ్చాడు. ఇందులో అతడు మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

"హోమ్‌బౌండ్ మూవీ చాలా సున్నితంగా, నిజాయితీగా, మనసును తాకేలా ఉంది. ఇంత మానవీయమైన, ఆసక్తికరమైన సినిమాను సృష్టించిన అద్భుతమైన టీమ్‌కు నా ప్రేమ, నా హగ్స్. నిజంగా ప్రత్యేకమైన చిత్రాన్ని తీసి మీరు ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్నారు" అంటూ చిత్ర బృందాన్ని, నటీనటులైన ఇషాన్ ఖట్టర్, విశాల్ జేత్వా, జాన్వీ కపూర్, నిర్మాత కరణ్ జోహార్‌లను ట్యాగ్ చేశాడు.

హోమ్‌బౌండ్ సినిమా కథేంటి?

షోయబ్ (ఇషాన్ ఖట్టర్), చందన్ (విశాల్ జేత్వా) అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితుల కథే ఈ హోమ్‌బౌండ్ మూవీ. పోలీస్ ఫోర్స్‌లో చేరాలనే ఆ ఇద్దరి కల చుట్టూ వారి జీవితాలు ఎలా మలుపు తిరిగాయన్నదే కథాంశం. స్నేహం, విధి నిర్వహణ, భారతీయ యువత ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ఇందులో చూపించారు. జాన్వీ కపూర్ ఈ కథకు అవసరమైన ఎమోషనల్ డెప్త్‌ను అందించింది.

ఆస్కార్ రేసులో..

నవంబర్ 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. 2026 అకాడమీ అవార్డులలో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్' విభాగంలో ఇండియా తరఫున ఈ సినిమా అధికారిక ఎంట్రీగా ఎంపికైంది.

కరణ్ జోహార్, అదార్ పూనావాలా నిర్మించిన ఈ చిత్రానికి హాలీవుడ్ లెజెండ్ మార్టిన్ స్కోర్సెస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం. మరోవైపు 'డంకీ' (2023) తర్వాత షారుక్ ఖాన్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రాబోయే 'కింగ్' (King) చిత్రంలో కనిపించనున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో అతని కూతురు సుహానా ఖాన్, దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.