...
...
Next Story

ఓటీటీలోకి ఆది సాయికుమార్ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.1 రేటింగ్.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్

ఓటీటీలోకి తెలుగు మిస్టిక్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. గతేడాది క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఓ ఊళ్లో ఉల్క పడిన తర్వాత జరిగే అనూహ్య పరిణామాల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

Published on: Jan 15, 2026, 14:46:25 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తెలుగులో ఆది సాయికుమార్ నటించిన మిస్టిక్ థ్రిల్లర్ మూవీ శంబాల. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైంది. ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సినిమాకు ఐఎండీబీలో 8.1 రేటింగ్ నమోదైంది. ఇప్పుడీ మూవీ జనవరి 22 నుంచి ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. మరి ఆ విశేషాలేంటో ఇక్కడ చూడండి.

శంబాల ఓటీటీ రిలీజ్ డేట్

ఓటీటీలోకి ఆది సాయికుమార్ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.1 రేటింగ్.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఆది సాయికుమార్ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.1 రేటింగ్.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్

ఆది సాయికుమార్ ఓ యువ సైంటిస్ట్ పాత్రలో నటించిన మూవీ శంబాల. ఈ సినిమాను జనవరి 22 నుంచి ఆహా వీడియో ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. అంతేకాదు ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు 24 గంటలు ముందుగానే అంటే జనవరి 21 నుంచే చూడొచ్చు.

“అపోహలు సజీవంగా మారే, విధి గర్జించే ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టండి. ఆది సాయికుమార్ శంబాల జనవరి 22న ఆహాలో ప్రీమియర్ అవుతుంది. ఆహా గోల్డ్ యూజర్స్ కు 24 గంటల ముందే యాక్సెస్” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

శంబాల మూవీ గురించి..

ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్, స్వాసిక విజయన్, మధు నందన్, ఇంద్రనీల్, రవివర్మ, మీసాల లక్ష్మణ్ లాంటి వాళ్లు నటించిన ఈ శంబాల మూవీని యగంధర్ ముని డైరెక్ట్ చేశాడు. క్రిస్మస్ సందర్భంగా గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైంది. హారర్, మిస్టరీ, థ్రిల్లర్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ శంబాల తెరకెక్కింది.

ఈ శంబాల మూవీ కథ 1980వ దశకంలో జరుగుతుంది. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న శంబాల గ్రామంలో ఓ ఉల్క పడటంతో పరిస్థితులన్నీ మారుతాయి. ఊరి జనం హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెడతారు. దాంతో ఊరికి బండ భూతం పట్టిందని జనం అనుకుంటారు. రాము దగ్గర ఉన్న ఆవుకు పాలు పితికితే రక్తం వస్తుందని దాన్ని చంపాలనుకుంటారు ప్రజలు.

అసలు ఊరి జనం ఎందుకు అలా ప్రవర్తిస్తుంటారు? వాటికి ఆ ఉల్క (బండ భూతానికి)కి సంబంధం ఉంటుందా? ఉల్క ఎలా పడింది? దాని నేపథ్యం ఏంటీ? విక్రమ్ ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాడా అనేదే ఈ శంబాల మూవీ స్టోరీ.

ఈ సినిమాలో ప్రేక్షకుడికి వెన్నులో వణుకు పుట్టించే సీన్స్, ఉత్కంఠభరితమైన ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్‌లు సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. క్లైమ్యాక్స్ కూడా ఆసక్తి రేపేలా ఉంది. హారర్, మిస్టిక్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లు ఈ సినిమాను ఆహా వీడియో ఓటీటీలో చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe