Shiva Nirvana: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటించిన రీసెంట్ మూవీ 'ఇరుముడి' (Irumudi) థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి 'జెనరేషనల్ బ్లాక్బస్టర్'గా నిలిచింది. అయితే ఈ భారీ సక్సెస్ జోష్ మధ్యలో సినిమాలో టీచర్ క్యారెక్టర్ ను చూపించిన తీరుపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలపై డైరెక్టర్ శివ నిర్వాణ స్పందించారు.
టీచర్ల అభ్యంతరంపై శివ నిర్వాణ రియాక్షన్

ఇరుముడి సినిమాలో ఒక టీచర్ పాత్రను నెగిటివ్ షేడ్స్లో చూపించడం పట్ల కొంతమంది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై డైరెక్టర్ శివ నిర్వాణ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు.
తను కూడా టీచింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చానని శివ నిర్వాణ గుర్తు చేశారు. "ప్రతి వ్యవస్థలోనూ కొందరు చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఉంటారు. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగానే ఆ పాత్రను డిజైన్ చేశాను. అంతే తప్ప ఉపాధ్యాయ వృత్తిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. సినిమాలో ఒక మంచి టీచర్ క్యారెక్టర్ను కూడా చూపించాను" అని క్లారిటీ ఇచ్చారు.
తాను ఈ మధ్య తిరుపతికి వెళ్లినప్పుడు అక్కడ ఓ గవర్నమెంట్ టీచర్ తన దగ్గరికి వచ్చి సినిమా మొత్తం బాగుందని చెబుతూ టీచర్ల గురించి అలా చూపించడం నచ్చలేదని అన్నారని శివ తెలిపారు. అయితే తాను మరో టీచర్ ను మంచిగా చూపించిన విషయాన్ని మాత్రం గమనించలేదా అని తాను ప్రశ్నించినట్లు చెప్పారు.
నైజాం రీజియన్లో రికార్డు కలెక్షన్లు
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి సినిమా ఊహించిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టింది. నైజాం ఏరియాలో రూ. 10 కోట్ల టార్గెట్ పెట్టుకుంటే, దానికి చాలా రెట్లు ఎక్కువ కలెక్షన్లు సాధించి తమను ఆశ్చర్యపరిచిందని ప్రొడ్యూసర్ మైత్రీ రవి వెల్లడించారు.
{{/usCountry}}టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి సినిమా ఊహించిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టింది. నైజాం ఏరియాలో రూ. 10 కోట్ల టార్గెట్ పెట్టుకుంటే, దానికి చాలా రెట్లు ఎక్కువ కలెక్షన్లు సాధించి తమను ఆశ్చర్యపరిచిందని ప్రొడ్యూసర్ మైత్రీ రవి వెల్లడించారు.
{{/usCountry}}ఈ సినిమాను ఇప్పటివరకు దాదాపు కోటి మందికి పైగా ఆడియన్స్ థియేటర్లలో చూశారని చెప్పారు. ఒక్క నైజాం రీజియన్లోనే 40 లక్షలకు పైగా ఫుట్ఫాల్స్ నమోదవడమంటే మామూలు విషయం కాదని ప్రొడ్యూసర్లు సంతోషం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలలో ఇలాంటి రేర్ అచీవ్మెంట్ చాలా అరుదుగా చూస్తామని మైత్రి నవీన్ పేర్కొన్నారు.
మూడు కథల సమ్మేళనం.. రవితేజ వన్ మ్యాన్ షో
ఈ ఇరుముడి సినిమాలో క్రైమ్, భక్తి అంశాలతో పాటు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చాలా ఇంటెన్స్గా చూపించడమే ఆడియన్స్కు విపరీతంగా నచ్చిందని డైరెక్టర్ చెప్పారు. తండ్రీకూతుళ్ల ఎమోషన్స్, హీరో క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మేషన్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్గా నిలిచాయి.
మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ, కామెడీ, ఎమోషన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని శివ నిర్వాణ ప్రశంసించారు. మంచి కథ దొరికితే రవితేజ విశ్వరూపం చూపిస్తారని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసిందన్నారు. త్వరలోనే ఈ అపూర్వ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తోంది.