...
...
Next Story

Shiva Nirvana: ఇరుముడిపై టీచర్ల గరంగరం.. డైరెక్టర్ శివ నిర్వాణ క్లారిటీ.. ఏమన్నారంటే?

Shiva Nirvana: ఇరుముడి మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ టీచర్ల నిరసనపై స్పందించారు. టీచర్ వృత్తిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, సమాజంలో కొందరు చెడు వ్యక్తుల గురించి చెప్పే ప్రయత్నంలోనే అలా చూపించినట్లు వివరణ ఇచ్చారు.

Published on: Sep 2, 2026, 20:35:10 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Shiva Nirvana: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటించిన రీసెంట్ మూవీ 'ఇరుముడి' (Irumudi) థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి 'జెనరేషనల్ బ్లాక్‌బస్టర్'గా నిలిచింది. అయితే ఈ భారీ సక్సెస్ జోష్ మధ్యలో సినిమాలో టీచర్ క్యారెక్టర్ ను చూపించిన తీరుపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాలపై డైరెక్టర్ శివ నిర్వాణ స్పందించారు.

టీచర్ల అభ్యంతరంపై శివ నిర్వాణ రియాక్షన్

Shiva Nirvana: ఇరుముడిపై టీచర్ల గరంగరం.. డైరెక్టర్ శివ నిర్వాణ క్లారిటీ.. ఏమన్నారంటే?
Shiva Nirvana: ఇరుముడిపై టీచర్ల గరంగరం.. డైరెక్టర్ శివ నిర్వాణ క్లారిటీ.. ఏమన్నారంటే?

ఇరుముడి సినిమాలో ఒక టీచర్ పాత్రను నెగిటివ్ షేడ్స్‌లో చూపించడం పట్ల కొంతమంది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై డైరెక్టర్ శివ నిర్వాణ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు.

తను కూడా టీచింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చానని శివ నిర్వాణ గుర్తు చేశారు. "ప్రతి వ్యవస్థలోనూ కొందరు చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఉంటారు. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగానే ఆ పాత్రను డిజైన్ చేశాను. అంతే తప్ప ఉపాధ్యాయ వృత్తిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. సినిమాలో ఒక మంచి టీచర్ క్యారెక్టర్‌ను కూడా చూపించాను" అని క్లారిటీ ఇచ్చారు.

తాను ఈ మధ్య తిరుపతికి వెళ్లినప్పుడు అక్కడ ఓ గవర్నమెంట్ టీచర్ తన దగ్గరికి వచ్చి సినిమా మొత్తం బాగుందని చెబుతూ టీచర్ల గురించి అలా చూపించడం నచ్చలేదని అన్నారని శివ తెలిపారు. అయితే తాను మరో టీచర్ ను మంచిగా చూపించిన విషయాన్ని మాత్రం గమనించలేదా అని తాను ప్రశ్నించినట్లు చెప్పారు.

నైజాం రీజియన్‌లో రికార్డు కలెక్షన్లు

ఈ సినిమాను ఇప్పటివరకు దాదాపు కోటి మందికి పైగా ఆడియన్స్ థియేటర్లలో చూశారని చెప్పారు. ఒక్క నైజాం రీజియన్‌లోనే 40 లక్షలకు పైగా ఫుట్‌ఫాల్స్ నమోదవడమంటే మామూలు విషయం కాదని ప్రొడ్యూసర్లు సంతోషం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాలలో ఇలాంటి రేర్ అచీవ్‌మెంట్ చాలా అరుదుగా చూస్తామని మైత్రి నవీన్ పేర్కొన్నారు.

మూడు కథల సమ్మేళనం.. రవితేజ వన్ మ్యాన్ షో

ఈ ఇరుముడి సినిమాలో క్రైమ్, భక్తి అంశాలతో పాటు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చాలా ఇంటెన్స్‌గా చూపించడమే ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చిందని డైరెక్టర్ చెప్పారు. తండ్రీకూతుళ్ల ఎమోషన్స్, హీరో క్యారెక్టర్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్‌గా నిలిచాయి.

మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ, కామెడీ, ఎమోషన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చారని శివ నిర్వాణ ప్రశంసించారు. మంచి కథ దొరికితే రవితేజ విశ్వరూపం చూపిస్తారని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసిందన్నారు. త్వరలోనే ఈ అపూర్వ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe