కొన్నిసార్లు అభిమానం హద్దులు దాటుతుంది. ఇలాంటివి చూసే వీళ్లేం ఫ్యాన్స్ అనిపిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్ల మీదకు ఎగబడే విషయంలో అభిమానుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఇలాంటి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమెను చుట్టుముట్టిన అభిమానులు తోసేసుకుంటూ హీరోయిన్ పైకి ఎగబడిపోయారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
రాజాసాబ్ సాంగ్

ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ రాజాసాబ్. ఇందులోని ముగ్గురు హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈ మూవీలోని సహన సహన అంటూ సాగే సాంగ్ ను బుధవారం (డిసెంబర్ 17) రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని లూలూ మాల్ లో సాంగ్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి నిధి అగర్వాల్ తో పాటు మరో హీరోయిన్ రిధి కుమార్ అటెండ్ అయ్యారు.
నిధి అగర్వాల్ పైకి
రాజాసాబ్ సాంగ్ సహన సహన సాంగ్ లాంఛ్ ఈవెంట్ కు భారీగా అభిమానులు వచ్చారు. ఈ ఈవెంట్ జరుగుతున్నంత సేపూ దగ్గరగా గుమి గూడి తోసుకుంటూనే ఉన్నారు. ఇక ఈవెంట్ అయిపోయి నిధి అగర్వాల్ వెళ్లిపోయే సమయంలో ఒక్కసారిగా ఆమెపైకి ఎగబడ్డారు. ఆమెపైకి తోసుకుంటూ వచ్చారు. హీరోయిన్ పై చేతులు వేశారు. అతి కష్టం మీద సెక్యూరిటీ సాయంతో నిధి కార్లోకి ఎక్కింది. కార్లోకి వెళ్లాక ఒక్కసారిగా ఓ మై గాడ్ అనుకుంది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
కామన్ సెన్స్ లేకుండా
నిధి అగర్వాల్ పట్ల ఫ్యాన్స్ ప్రవర్తించిన తీరు పట్ల తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కాస్త కామన్ సెన్స్ ఉన్నా పరిస్థితి ఇలా మారేది కాదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇది సిగ్గు చేటు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి టాక్సిక్ ఫ్యాన్ బిహేవియర్ ను యాక్సెప్ట్ చేయొద్దని అంటున్నారు. ఇది హీరోయిన్ ను ఫిజికల్ గా వేధించడమే అని పోస్ట్ లు పెడుతున్నారు.
{{/usCountry}}నిధి అగర్వాల్ పట్ల ఫ్యాన్స్ ప్రవర్తించిన తీరు పట్ల తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కాస్త కామన్ సెన్స్ ఉన్నా పరిస్థితి ఇలా మారేది కాదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇది సిగ్గు చేటు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి టాక్సిక్ ఫ్యాన్ బిహేవియర్ ను యాక్సెప్ట్ చేయొద్దని అంటున్నారు. ఇది హీరోయిన్ ను ఫిజికల్ గా వేధించడమే అని పోస్ట్ లు పెడుతున్నారు.
{{/usCountry}}రాజాసాబ్ రిలీజ్
ప్రభాస్ మూవీ 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. జనవరి 9న థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతుంది. ఈ హారర్ థ్రిల్లర్ లో ప్రభాస్ వింటేజీ లుక్ లో కనిపిస్తున్నాడు. దీనికి మారుతి డైరెక్టర్. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక హీరోయిన్లు.
ఇప్పటికే రాజాసాబ్ ట్రైలర్, రెబల్ సాబ్ సాంగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు వచ్చిన మెలోడీ సహన కూడా ఆకట్టుకుంటోంది.