Shruti Haasan: టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మరోసారి తన బోల్డ్ కామెంట్స్తో వార్తల్లో నిలిచారు. ప్రొఫెషనల్ లైఫ్తో పాటు పర్సనల్, సోషల్ విషయాలపై ఎప్పుడూ ఓపెన్గా మాట్లాడే ఈ బ్యూటీ, తాజాగా పీరియడ్స్ (నెలసరి) తీవ్రతపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలని దేవుళ్లను వేలసార్లు ప్రార్థిస్తుంటానని శ్రుతి చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
దేవుడికి వేలసార్లు దండం పెట్టా.. శ్రుతి ఏమన్నారంటే?

నటి సోహా అలీ ఖాన్తో కలిసి పాల్గొన్న ఒక టాక్ షోలో పీరియడ్స్, హార్మోనల్ మార్పులపై శృతి హాసన్ చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు. "పీరియడ్స్ వల్ల వచ్చే విపరీతమైన నొప్పిని తగ్గించడానికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది. మగవాళ్లకు కూడా నెలకు ఒకసారి పీరియడ్స్ రావాలని నేను రోజుకి వేలసార్లు దేవుడిని కోరుకుంటాను. అలా జరిగితేనే వాళ్లకు ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. దాంతో పాటు షూటింగ్ కాంట్రాక్ట్లలో పీరియడ్స్ లీవ్స్ ఇచ్చే క్లాజ్ కచ్చితంగా చేరుస్తారు" అని శృతి వ్యాఖ్యానించారు.
ఈ కామెంట్స్పై సోహా అలీ ఖాన్ స్పందిస్తూ.. ఒకవేళ మగవాళ్లకు పీరియడ్స్ వస్తే 'నాకు ఎంత బ్లీడింగ్ అయింది, నా టాంపాన్ సైజ్ ఎంత పెద్దది' అని వాళ్లు పోటీ పెట్టుకుంటారని సరదాగా చమత్కరించారు.
షూటింగ్ సెట్లో చేదు అనుభవం.. హీరోలకు ఒకలా, మాకు ఒకలా..
తన కెరీర్ ప్రారంభంలో షూటింగ్ సెట్స్లో ఎదురైన కష్టాలను శృతి హాసన్ గుర్తుచేసుకున్నారు. "కెరీర్ మొదట్లో పీరియడ్ నొప్పి గురించి సెట్లో మాట్లాడటానికి చాలా భయపడేదాన్ని. అది కేవలం ఒక అపోహ మాత్రమే కాదు, అసలు ఆ టాపిక్ ఎవరూ ఎత్తేవారు కూడా కాదు. అసలు నా ఎనర్జీ ఎందుకు తగ్గింది, నేను ఎందుకు డిఫరెంట్గా కనిపిస్తున్నానో అని డైరెక్టర్లు విచిత్రంగా చూసేవారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ఒక చేదు అనుభవాన్ని పంచుకుంటూ.. "ఒకసారి నా కో-స్టార్ మోకాలు సర్జరీ చేయించుకుంటే, ఆయన ఇబ్బంది పడకుండా టీమ్ మొత్తం రూల్స్ మార్చేసింది. కానీ పీరియడ్ క్రాంప్స్తో నేను నరకం చూస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత కూతురు ఉన్న ఒక డైరెక్టర్కి నా పరిస్థితి వివరిస్తే, ఆయన అర్థం చేసుకుని షూటింగ్ అడ్జస్ట్ చేశారు. అప్పుడే పరిస్థితి మెల్లగా మారింది" అని చెప్పారు.
రూ. 518 కోట్ల హిట్.. శ్రుతి హాసన్ క్రేజీ లైనప్
{{/usCountry}}అలాగే ఒక చేదు అనుభవాన్ని పంచుకుంటూ.. "ఒకసారి నా కో-స్టార్ మోకాలు సర్జరీ చేయించుకుంటే, ఆయన ఇబ్బంది పడకుండా టీమ్ మొత్తం రూల్స్ మార్చేసింది. కానీ పీరియడ్ క్రాంప్స్తో నేను నరకం చూస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత కూతురు ఉన్న ఒక డైరెక్టర్కి నా పరిస్థితి వివరిస్తే, ఆయన అర్థం చేసుకుని షూటింగ్ అడ్జస్ట్ చేశారు. అప్పుడే పరిస్థితి మెల్లగా మారింది" అని చెప్పారు.
రూ. 518 కోట్ల హిట్.. శ్రుతి హాసన్ క్రేజీ లైనప్
{{/usCountry}}ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే, శృతి హాసన్ రీసెంట్గా తమిళ సూపర్స్టార్ రజనీకాంత్తో కలిసి 'కూలీ' (Coolie) సినిమాలో నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.518 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్బస్టర్గా నిలిచింది. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, ఆమిర్ ఖాన్ కామియోలతో ఈ సినిమా సంచలనం సృష్టించింది.
ఇది కాకుండా రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమాలో ‘హెలెలో’ స్పెషల్ సాంగ్తో శ్రుతి మాస్ ఆడియన్స్ను ఊపేసింది. ప్రస్తుతం డైరెక్టర్ మిస్కిన్ కాంబినేషన్లో విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న ‘ట్రైన్’ (Train) సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ కాంబోలో ఒక క్రేజీ తెలుగు ప్రాజెక్ట్లో శ్రుతి బిజీగా ఉన్నారు.