Singer Mangli : సింగర్ మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ వివాదం.. సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు

Singer Mangli : సింగర్ మంగ్లీ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. న్యాయవాది చేసిన ఆరోపణలపై ఆమె కూడా ఘాటుగా స్పందించారు. తాజాగా హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు.

Published on: Apr 14, 2026, 14:19:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ (సత్యవతి), అడ్వకేట్ సుబ్బారావు మధ్య చెలరేగిన వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కోట్ల రూపాయల మోసం, బెదిరింపులు, పోలీస్ స్టేషన్ డ్రామాలతో ఈ వ్యవహారం ముదిరింది. తాజగా హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు మంగ్లీ. న్యాయవాది సుబ్బారావుపై ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తూ.. కించపరుస్తున్నారని వెల్లడించారు. సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పంజాగుట్టు పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా జరిగింది.

సింగర్ మంగ్లీ
సింగర్ మంగ్లీ

వివాదానికి ప్రధాన కారణం

అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ఆయన చేసిన ప్రధాన ఆరోపణలు ఇవే:

పెట్టుబడుల పేరుతో మోసం: ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్, రియల్ ఎస్టేట్, సినిమా ఫైనాన్సింగ్ పేరుతో మంగ్లీ, ఆమె సోదరుడు శివ, ఇతరులు సుమారు 100 నుండి 150 మంది దగ్గర కోట్లు సేకరించారని ఆయన ఆరోపించారు.

బెదిరింపులు: ఇన్వెస్టర్ల తరపున తాను డబ్బులు తిరిగి అడగగా 'నిన్ను చంపి శవం కూడా దొరకకుండా చేస్తాం' అంటూ మంగ్లీ నేరుగా బెదిరింపులకు దిగిందని సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే ఫిర్యాదు సమయంలో పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా నెలకొన్నది. న్యాయవాది సుబ్బారావు మాట తీరు చూసి.. పోలీసులకు అనుమానం వచ్చి.. ఆల్కహాల్ టెస్ట్ చేశారు. 27 రీడింగ్ చూపించింది. దీంతో అందరూ షాక్ అయ్యారు.

తప్పుచేయలేదంటున్న మంగ్లీ

మరోవైపు మంగ్లీ కూడా ఈ కేసుకు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వెళ్లారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చింది. పాట ప్రాణంగా బతుకుతున్నానని వెల్లడించింది. మైక్రోఫైనాన్స్ పేరుతో మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరింది. అంతేకాదు సుబ్బారావు తనతో అసభ్యంబా ప్రవరించాడని మంగ్లీ చెబుతోంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు సుబ్బారావు ఇలాంటి ట్రిక్స్ చేస్తున్నట్టుగా ఆరోపించింది.

ఆయన మార్చి 21 నుండి తనను కలవాలని ఒత్తిడి చేస్తున్నారని, తాను నిరాకరించినందుకు తనను వేధిస్తున్నారని మంగ్లీ పేర్కొన్నారు. సుబ్బారావు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, తన పరువు తీసేలా మాట్లాడుతున్నారని మంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సుబ్బారావుపై సెక్షన్ 79, 351(3) కింద కేసు నమోదు చేశారు.

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా

ఈ కేసులో ఫిర్యాదు ఇవ్వడానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అడ్వకేట్ సుబ్బారావుకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సుబ్బారావు మద్యం మత్తులో ఉన్నారన్న అనుమానంతో పోలీసులు ఆయనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించారు.

పోలీసుల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మంగ్లీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, తనను అవమానించడానికే కావాలని ఈ పరీక్ష చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాను కాఫీ తాగి వచ్చానని, ఆల్కహాల్ తీసుకోలేదని సుబ్బారావు వెర్షన్.

పోలీసుల దర్యాప్తు

ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైక్రోఫైనాన్స్ మోసంపై మంగ్లీ సోదరుడు, ఇతరుల ప్రమేయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమయంలోనే హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను మంగ్లీ వెళ్లి కలిసి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం ఎటువైపు వెళ్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More