ఆ శృంగారభరితమైన పాట నేను పాడలేను.. భర్తకు తేల్చి చెప్పిన స్టార్ సింగర్.. మోటోరోలా ఫోన్ రికార్డింగ్తో మారిన తలరాత!
Singer Rekha Bhardwaj On Namak Ishq Ka Song Omkara: బాలీవుడ్ క్లాసిక్ మూవీ ఓంకార విడుదలై త్వరలోనే 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా అందులోని ఐకానిక్ సాంగ్ మేకింగ్ వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాలను, తన భర్త విశాల్ భరద్వాజ్ ఫోన్ రికార్డింగ్ ముచ్చట్లను స్టార్ సింగర్ రేఖ భరద్వాజ్ పంచుకున్నారు.
Singer Rekha Bhardwaj On Namak Ishq Ka Song Omkara: సినిమా పరిశ్రమలో కొన్ని పాటలు ట్రెండ్ సెట్టర్గా నిలుస్తాయి. అలాంటి వాటిల్లో రెండు దశాబ్దాల క్రితం వచ్చి ప్రేక్షకులను ఊపేసిన ‘ఓంకార’ చిత్రంలోని ‘నమక్ ఇష్క్ కా’ సాంగ్ ఒకటి.

మాస్ స్టెప్పులతో
బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా బసు తన మాస్ స్టెప్పులతో థియేటర్లలో సెగలు రేపిన ఈ పాట, ప్రముఖ సింగర్ రేఖ భరద్వాజ్ కెరీర్ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. అప్పటివరకు పరిశ్రమలో ఉన్నా రాని గుర్తింపును ఈ ఒక్క సాంగ్ తెచ్చిపెట్టింది. అయితే, మొదట్లో ఈ పాటను పాడేందుకు ఆమె అస్సలు ఇష్టపడలేదనే ఆసక్తికరమైన విషయాన్ని స్వయంగా రేఖ భరద్వాజ్ తాజాగా వెల్లడించారు.
ఈ ఏడాది జూలై నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న ఓంకార చిత్రం విలియం షేక్స్పియర్ ప్రసిద్ధ నాటకం ‘ఒథెల్లో’ ఆధారంగా తెరకెక్కింది. డైరెక్టర్, సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందించిన ఈ రివేంజ్ క్రైమ్ డ్రామా భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.
మోటోరోలా ఫ్లిప్ ఫోన్లో తొలి రికార్డింగ్
ఈ పాట రూపుదిద్దుకున్న రోజులను రేఖ భరద్వాజ్ గుర్తుచేసుకున్నారు. "ఆ సమయంలో విశాల్ చాలా బిజీగా ఉండేవారు. ట్యూన్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఒకటి రెండు లైన్లు రాగానే నా దగ్గరకు వచ్చి పాడి వినిపించేవారు. బాగుందా, దీనిని మరింత డెవలప్ చేయాలా అని అడిగేవారు. ఈ పాట కంటే ముందు నేను కేవలం ఎమోషనల్, బాధాకరమైన మెలోడీ పాటలు మాత్రమే పాడగలను అనుకునేదాన్ని" అని రేఖ భరద్వాజ్ పేర్కొన్నారు.
ఆ క్రమంలోనే ఈ ట్యూన్ పాడుతున్నప్పుడు ఆమె నోటి వెంట సహజంగానే కొన్ని హై నోట్స్ (High Notes) వచ్చాయి. ఆ వేరియేషన్ వినగానే విశాల్ భరద్వాజ్ మైండ్ బ్లాక్ అయిపోయింది. వెంటనే తన దగ్గరున్న పాత మోటోరోలా ఫ్లిప్ ఫోన్లో దానిని రికార్డ్ చేశారు. "నువ్వు మర్చిపోతావు, నేను మర్చిపోతాను.. అందుకే రికార్డ్ చేస్తున్నా" అని విశాల్ అన్నట్లు రేఖ గుర్తుచేసుకున్నారు.
పాడలేనని భయపడ్డాను!
ట్యూన్ వినడానికి కొత్తగా ఉన్నా, ఒక రాంచీ (కాస్త శృంగారభరితమైన) మాస్ సాంగ్ పాడటం తనకు పెద్ద సవాలుగా అనిపించిందని రేఖ చెప్పారు. "ఈ పాట గ్రాఫ్ నిరంతరం మారుతూ ఉంటుంది. ఇంత కష్టమైన పాటను నేను పాడలేనని విశాల్తో చెప్పాను" అని రేఖ వివరించారు.
అయినప్పటికీ, భర్త ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన నమ్మకంతో మైక్ ముందుకు వచ్చిన రేఖ.. ఆ పాటకు తన గాత్రంతో ప్రాణం పోశారు. విడుదలయ్యాక ఈ పాట చార్ట్బస్టర్గా నిలిచి, రేఖ భరద్వాజ్ను ప్రతి ఇంట్లో ఒక స్టార్ సింగర్గా నిలబెట్టింది.
షేక్స్పియర్ ట్రైలాజీలో మైలురాయి
‘ఓంకార’ చిత్రంలో ‘నమక్ ఇష్క్ కా’తో పాటు ‘బీడీ జలైలే’ అనే మరో ఐకానిక్ డ్యాన్స్ నంబర్ కూడా సంచలనం సృష్టించింది. అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, వివేక్ ఒబెరాయ్, కొంకణా సేన్ శర్మ, నసీరుద్దీన్ షా వంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన షేక్స్పియర్ నాటకాల త్రయంలో ఇది రెండో చిత్రం. 2003లో వచ్చిన ‘మక్బూల్’ (మెక్బెత్ ఆధారంగా), 2014లో వచ్చిన ‘హైదర్’ (హామ్లెట్ ఆధారంగా) చిత్రాల మధ్య ‘ఓంకార’ ఒక అద్భుత దృశ్యకావ్యంగా నిలిచిపోయింది.
ఒక చిన్న మొబైల్ ఫోన్ రికార్డింగ్ నుంచి మొదలైన ప్రయాణం.. ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలోనే ఒక క్లాసిక్గా మిగిలిపోవడం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


