వావ్.. వావ్.. వావ్..ధురంధర్ సినిమాపై మనసు పారేసుకున్న శోభితా ధూళిపాళ..రివ్యూ వైరల్

ఇప్పుడు ఇండియన్ మూవీ సెన్సేషన్ ధురంధర్. కలెక్షన్ల రికార్డులు తిరగరాస్తోంది ఈ సినిమా. ఈ చిత్రంపై తాజాగా శోభితా ధూళిపాళ మనసు పారేసుకుంది. వావ్, వావ్, వావ్ అంటూ ఇన్ స్టాలో తన రివ్యూ ఇచ్చేసింది. ఆ పోస్ట్ వైరల్ గా మారింది. 

Published on: Dec 27, 2025, 21:33:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ధురంధర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ఈ సినిమా ముచ్చట్లే కనిపిస్తున్నాయి. సెలబ్రిటీలు కూడా ఈ చిత్రం గురించే మాట్లాడుతున్నారు. తాజాగా నాగ చైతన్య భార్య శోభితా ధూళిపాళ కూడా ధురంధర్ సినిమాపై మనసు పారేసుకుంది. మూవీ తెగ నచ్చేసిందని రివ్యూ ఇచ్చేసింది.

ధురంధర్ సినిమాపై శోభితా రివ్యూ
ధురంధర్ సినిమాపై శోభితా రివ్యూ

ధురంధర్ పై శోభితా లవ్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన చేయడంతో పాటు ప్రముఖుల ప్రశంసలను అందుకుంటోంది. ఇప్పుడు, నటి శోభితా ధూళిపాళ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించింది. రణవీర్ సింగ్, సారా అర్జున్ యాక్టింగ్ కు ఆమె ఫిదా అయిపోయింది.

వావ్, వావ్, వావ్

శోభితా ధూళిపాళ శనివారం (డిసెంబర్ 27) తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ధురంధర్ ను ప్రశంసించింది. ‘‘వావ్. వావ్. వావ్. ఉత్కంఠభరితమైనది. మైండ్ బ్లోయింగ్. స్ఫూర్తిదాయకం. మిగతా వాటిలా కాదు. సుప్రీమ్!! ఆదిత్య, రణ్ వీర్ (చేతులు జోడించడం,సెల్యూట్, హార్ట్ ఎమోజీలు) సారా అర్జున్ ఎంత ప్రతిభ, ఏం అందం (ఎరుపు గులాబీ ఎమోజీ)" అని శోభితా పేర్కంది. డిసెంబర్ 5న విడుదలైన ధురంధర్ చిత్రం భారతదేశంలో రూ.662 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

శోభితా స్టోరీ
శోభితా స్టోరీ

ఈ సెలబ్రిటీలు

ఇప్పటి వరకు ప్రీతి జింటా, అల్లు అర్జున్, అనుపమ్ ఖేర్, సందీప్ వంగా రెడ్డి, హృతిక్ రోషన్ వంటి పలువురు ప్రముఖులు ధురంధర్ చిత్రాన్ని ప్రశంసించారు. చాలా కాలంగా తాను చూసిన ఉత్తమ చిత్రాలలో ధురంధర్ ఒకటిగా ప్రీతి అభివర్ణించారు. ఆమె నోట్ లో ఒక భాగం ఇలా ఉంది, "ఇది చాలా కాలంగా నేను చూసిన ఉత్తమ చిత్రాలలో ఒకటి. రా అండ్ రియల్. రణ్ వీర్, అక్షయ్, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ ప్రతి ఒకరు గొప్పగా నటించారు’’ అని పేర్కొంది.

ధురంధర్ గురించి..

ధురంధర్ ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాలలో టాప్ 9 స్థానాన్ని పొందింది. ఈ చిత్రంలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ, మానవ్ గోహిల్ తదితరులు నటించారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కాందహార్ విమాన హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో రహస్య ఇంటెలిజెన్స్ కార్యకలాపాలను ఇది అనుసరిస్తుంది.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ ధురంధర్ 2 మార్చి 19 న థియేటర్లలో విడుదల కానుంది. గూఢచర్యం-థ్రిల్లర్ 2026 హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో గ్రాండ్ ఈద్, గుడి పడ్వా, ఉగాది సందర్భంగా విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More