...
...
Next Story

Sobhita: గ్లోబల్‌గా సత్తా చాటుతున్న తెలుగు అమ్మాయిలు.. దుబాయ్ ఇన్‌ఫ్లూయెన్సర్ వీడియో.. శోభితా, మంచు లక్ష్మీ కామెంట్స్

Sobhita Dhulipala Reacts To Dubai Influencer Srilata Video: ఓ దుబాయ్ ఇన్‌ఫ్లూయెన్సర్ శ్రీలత అడ్డెపల్లి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ వీడియోపై హీరోయిన్ శోభిత ధూళిపాళ, మంచు లక్ష్మీ, రాపర్ రాజా కుమారి రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేశారు. శ్రీలతకు మద్దతుగా నిలిచారు.

Published on: May 10, 2026, 18:40:44 IST
Advertisement

Sobhita Dhulipala Reacts To Dubai Influencer Srilata Video: అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదిక 'మెట్ గాలా' (Met Gala). ఇటీవల జరిగిన ఈ ఈవెంట్‌లో తెలుగు మూలాలున్న మోడల్ భవితా మండవ 'షానెల్' (Chanel) బ్రాండ్ తరపున ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

విమర్శలు వచ్చినప్పటికీ

గ్లోబల్‌గా సత్తా చాటుతున్న తెలుగు అమ్మాయిలు.. దుబాయ్ ఇన్‌ఫ్లూయెన్సర్ వీడియో.. శోభితా, మంచు లక్ష్మీ కామెంట్స్
గ్లోబల్‌గా సత్తా చాటుతున్న తెలుగు అమ్మాయిలు.. దుబాయ్ ఇన్‌ఫ్లూయెన్సర్ వీడియో.. శోభితా, మంచు లక్ష్మీ కామెంట్స్

అయితే భవితా మండవ ధరించిన జీన్స్ దుస్తులపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై ఒక తెలుగమ్మాయి మెరవడం మనందరికీ గర్వకారణం. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్ శ్రీలత అడ్డెపల్లి.. తెలుగు మహిళల ప్రాతినిధ్యంపై రూపొందించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

శ్రీలత తన వీడియోలో భవితా మండవ, నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ, రాపర్ రాజా కుమారి, వ్యాపారవేత్త దీపికా ముత్యాల వంటి వారిని ఉదాహరణగా తీసుకున్నారు. వీరిందరికీ ఒక సామాన్యమైన అంశం ఉందని, అది వారందరికి తెలుగు మూలాలు ఉన్నాయని శ్రీలత చెప్పుకొచ్చారు.

మధ్యతరగతి గడప దాటి.. గ్లోబల్ శిఖరాలకు!

"భవితా, శోభితా, రాజా కుమారి, దీపికా ముత్యాల వీరందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అది తెలుగుతనం. వీరందరు బ్రౌన్ కలర్‌లో ఉంటారు. ఎందుకంటే వీరంతా తెలుగు మూలాల నుంచి వచ్చారు. సాధారణంగా తెలుగు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలకు కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ, ఈ మహిళలు ఆ చట్రాలను బద్దలు కొట్టారు. సమాజం ఆశించని రంగాలను ఎంచుకుని, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండాను ఎగురవేశారు" అని శ్రీలత కొనియాడారు.

ఈ వీడియోపై స్పందించిన నటి శోభిత ధూళిపాళ మనసుకు హత్తుకునే సలహా ఇచ్చారు. "నీ మనసు ఏం చెబుతుందో అదే చేయి. తర్కానికి అందకపోయినా నీ ఇన్‌స్ట్నింక్ట్ (సహజాత విజ్ఞత)ను నమ్ము. ఈ జీవితం చాలా చిన్నది, నిన్ను నువ్వు గౌరవించుకో" అని శోభిత ధూళిపాళ కామెంట్ చేశారు.

ఇక రాపర్ రాజా కుమారి స్పందిస్తూ.. "నన్ను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుగు సోదరి. నీ కలలను నిజం చేసుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు" అని ప్రోత్సహించారు. మంచు లక్ష్మీ కూడా "తెలుగు అమ్మాయిల ప్రాతినిధ్యం పెరగాలి, నీకు నా మద్దతు ఉంటుంది" అని రాసుకొచ్చారు.

రూపాన్ని కాదు.. వారి కృషిని చూడండి

భవితా మండవ వేసుకున్న దుస్తులపై వస్తున్న విమర్శల గురించి శ్రీలత స్పందిస్తూ.. "ఒక తెలుగమ్మాయి అంతర్జాతీయ వేదికపై ఉన్నప్పుడు మనం ఇంకా గొప్పగా చూడాలని ఆశించవచ్చు. కానీ ఆ ఒక్క నిమిషం కనిపించిన దుస్తుల ఆధారంగా వారి ప్రతిభను తక్కువ చేయవద్దు" అని హితవు పలికారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి హాలీవుడ్, గ్లోబల్ ఫ్యాషన్ మార్కెట్లలో రాణిస్తున్న ఈ మహిళలు ఎందరో యువతులకు స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. భవితా మండవ ఎవరు? ఎందుకు వార్తల్లో నిలిచారు?

భవితా మండవ తెలుగు మూలాలున్న అంతర్జాతీయ మోడల్. ఇటీవల మెట్ గాలా (Met Gala 2026) వేదికపై ప్రముఖ లగ్జరీ బ్రాండ్ 'షానెల్' తరపున ర్యాంప్ వాక్ చేయడంతో ఆమె వార్తల్లో నిలిచారు.

2. శోభితా ధూళిపాళ్ల నేపథ్యం ఏమిటి?

శోభితా ధూళిపాళ్ల ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన నటి. ఆమె మాజీ మిస్ ఇండియా ఎర్త్ విజేత. 'మేడ్ ఇన్ హెవెన్' సిరీస్, హాలీవుడ్ చిత్రం 'మంకీ మ్యాన్' ద్వారా ఆమె అంతర్జాతీయ గుర్తింపు పొందారు.

3. రాజా కుమారి ఎవరు?

రాజా కుమారి అమెరికాలో స్థిరపడిన తెలుగు సంతతికి చెందిన ప్రముఖ రాపర్, గాయని. ఆమె తన సంగీతంలో భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా తెలుగు మూలాలను ప్రతిబింబిస్తూ అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

4. శ్రీలత అడ్డెపల్లి ఎవరు? ఆమె వీడియో ఉద్దేశం ఏమిటి?

శ్రీలత అడ్డెపల్లి దుబాయ్‌లో ఉంటున్న తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్. అంతర్జాతీయ వేదికలపై తెలుగు మహిళల ప్రాతినిధ్యం, వారు ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆమె తన వీడియోలో చర్చించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe