...
...
Next Story

Srinivasa Mangapuram: మరో ఘట్టమనేని హీరో థియేటర్లకు వచ్చేస్తున్నాడు.. శ్రీనివాస మంగాపురం రిలీజ్ డేట్ ఇదే

Srinivasa Mangapuram: మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా నటిస్తున్న శ్రీనివాస మంగాపురం మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. బాలీవుడ్ నటి రవీనా టండన్ కూతురు రషా తడానీ ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమా జులై 30న థియేటర్లలోకి రానుంది.

Published on: Jul 3, 2026, 17:17:07 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో యంగ్ సెన్సేషన్ టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న, దివంగత రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ 'శ్రీనివాస మంగాపురం'. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా జులై 30న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

సోలో రిలీజ్ దొరకడంతో పెరిగిన అంచనాలు

Srinivasa Mangapuram: మరో ఘట్టమనేని హీరో థియేటర్లకు వచ్చేస్తున్నాడు.. శ్రీనివాస మంగాపురం రిలీజ్ డేట్ ఇదే
Srinivasa Mangapuram: మరో ఘట్టమనేని హీరో థియేటర్లకు వచ్చేస్తున్నాడు.. శ్రీనివాస మంగాపురం రిలీజ్ డేట్ ఇదే

ఈ జులై నెలఖారులో పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఏవీ బాక్సాఫీస్ బరిలో లేవు. ఒక డెబ్యూ హీరోకి సోలో రిలీజ్ డేట్ దొరకడం అనేది కచ్చితంగా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఈ క్రమంలో సినిమా మీద ఆడియన్స్ లో బజ్ మరింత పెంచడానికి మేకర్స్ గట్టిగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అగ్రెసివ్ మార్కెటింగ్ తో యూత్ కు రీచ్ అయ్యేలా స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, సుధీర్ బాబు, అశోక్ గల్లా.. ఇలా ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడో తరం నుంచి హీరోగా లాంచ్ అవుతున్న జయకృష్ణపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో భారీ ఆశలు ఉన్నాయి.

విలన్ గా మోహన్ బాబు.. బ్యూటీ క్వీన్ రాషా డెబ్యూ

శ్రీనివాస మంగాపురం మూవీలో జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని నటిస్తోంది. ఇప్పటికే తన గ్లామర్ తో నేషనల్ వైడ్ గా యూత్ ను ఎట్రాక్ట్ చేసిన రాషాకు ఇదే ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్.

'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' లాంటి రా అండ్ రస్టిక్ హిట్స్ ఇచ్చిన అజయ్ భూపతి.. ఈసారి కూడా తన మార్క్ మిస్ కాకుండా చూసుకున్నాడు. స్క్రీన్ మీద ఒక అద్భుతమైన రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కు తోడుగా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమాను చాలా పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడట. జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉందని, రాషా తడాని ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని ఇన్ సైడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి.

'కల్కి 2898 AD' లాంటి గ్లోబల్ హిట్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ సినిమాను సమర్పించడం ప్రాజెక్ట్ రేంజ్ ను పెంచేసింది. పి కిరణ్ నిర్మించిన ఈ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో జులై 30న తేలిపోతుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe