...
...
Next Story

Varanasi Netflix OTT: రాజమౌళి 'వారణాసి' ఓటీటీ డీల్‌పై నెట్‌ఫ్లిక్స్ బాస్ ఊహించని కామెంట్స్.. ఆ ఒక్క మాటతో మారిన లెక్కలు

Varanasi Netflix OTT: వారణాసి మూవీ ఓటీటీ డీల్ పై కీలకమైన అప్డేట్ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ బాస్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Published on: Jun 25, 2026, 09:21:54 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Varanasi Netflix OTT: గ్లోబల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా 'వారణాసి' (Varanasi) ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ విజువల్ వండర్‌గా తెరకెక్కుతోంది. ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ చుట్టూ రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా.. తాజాగా ఈ సినిమా ఓటిటి డీల్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (కంటెంట్) మానికా షెర్గిల్ చేసిన కామెంట్స్ ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ డిజిటల్ రైట్స్ పై సరికొత్త చర్చకు దారితీశాయి.

వారణాసి హక్కులు దక్కించుకున్నారా?

Varanasi Netflix OTT: రాజమౌళి 'వారణాసి' ఓటీటీ డీల్‌పై నెట్‌ఫ్లిక్స్ బాస్ ఊహించని కామెంట్స్.. ఆ ఒక్క మాటతో మారిన లెక్కలు
Varanasi Netflix OTT: రాజమౌళి 'వారణాసి' ఓటీటీ డీల్‌పై నెట్‌ఫ్లిక్స్ బాస్ ఊహించని కామెంట్స్.. ఆ ఒక్క మాటతో మారిన లెక్కలు

నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మానికా షెర్గిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు రాజమౌళి-మహేష్ బాబు సినిమా 'వారణాసి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందా అని ప్రశ్నించారు.

దీనికి మానికా షెర్గిల్ చాలా స్మార్ట్‌గా నవ్వుతూ సమాధానం దాటవేశారు. కొన్ని విషయాలు భవిష్యత్తులో ఒక సర్‌ప్రైజ్‌గా ఉంటేనే బాగుంటుందని ఆమె హింట్ ఇచ్చారు.

నెట్‌ఫ్లిక్స్ లోనే బెస్ట్ స్టోరీస్.. రికార్డు రేటుకు డీల్?

రాజమౌళి గత బ్లాక్‌బస్టర్ హిట్స్ 'బాహుబలి' ఫ్రాంచైజీతో పాటు ఆస్కార్ విన్నింగ్ సెన్సేషన్ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలు నెట్‌ఫ్లిక్స్ ద్వారానే అంతర్జాతీయంగా భారీ రీచ్ సాధించాయి. ఈ విషయాన్ని గుర్తు చేయగా.. ప్రపంచంలోని బెస్ట్ స్టోరీస్, బిగ్గెస్ట్ క్రియేటర్స్ ఎప్పుడూ నెట్‌ఫ్లిక్స్ లోనే ఉంటారంటూ ఆమె క్రేజీ ఆన్సర్ ఇచ్చారు.

అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయకపోయినప్పటికీ.. మానికా ఇచ్చిన హింట్స్ చూస్తుంటే 'వారణాసి' ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఒక మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ ఆఫర్‌ను మేకర్స్ ముందు ఉంచినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దాదాపు రూ. 1200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మ్యాగ్నమ్ ఓపస్‌కు లెజెండరీ రైటర్ కేవీ విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. మన పురాణాలు, మైథాలజీ అంశాలను బేస్ చేసుకుని గ్లోబల్ లెవెల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ స్క్రిప్ట్ డిజైన్ చేసినట్లు టాక్.

ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా జోనస్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కంప్లీట్‌గా ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో షూట్ చేస్తున్నారు. వరల్డ్ స్టేజ్ పై ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేసిన 'వారణాసి' సినిమా ఏప్రిల్ 7, 2027 న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe