రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు-ఏడాది ముందు నుంచే వారణాసి ఇంటర్నేషనల్ మీడియా ప్రమోషన్స్-ప్రియాంక చోప్రా జై శ్రీరాం
వారణాసి అంటూ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. మహేష్ బాబు హీరోగా ఈ మైథాలజీ టైమ్ లైన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఈ మూవీ 2027లో రిలీజ్ కానుంది. కానీ జక్కన్న మాత్రం ఇప్పటి నుంచే ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రమోషన్స్ షురూ చేశారు.
వారణాసితో ప్రపంచ సినీ రంగంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టేలా లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో రికార్డులు బ్రేక్ చేయాలనే కంకణం కట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రపంచవ్యాప్తంగా మూవీకి భారీ క్రేజ్ దక్కేలా చూడటం కోసం ఇప్పుడే ఇంటర్నేషనల్ ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా కీ రోల్ ప్లే చేస్తోంది.

వారణాసి ప్రమోషన్లు
సాధారణంగా అయితే మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తారు. అదే లాంఛ్ ఈవెంట్ అయితే ఏదో క్లోజ్డ్ సర్క్యూట్ లో చేసేస్తారు. కానీ రాజమౌళి మాత్రం వారణాసి లాంఛ్ ఈవెంట్ నే భారీ స్థాయిలో నిర్వహించారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ ఈవెంట్ ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ ను తనవైపునకు తిప్పుకుంది. ఈ లాంఛ్ ఈవెంట్ నుంచే మూవీ ప్రమోషన్లు స్టార్ట్ చేసేశారు రాజమౌళి.
ప్రియాంక చోప్రాతో
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంది. హాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన ఈ ఇండియన్ భామను ఇంటర్నేషనల్ ప్రమోషన్లలో కీ రోల్ ప్లే చేసేలా రాజమౌళి చూస్తున్నారు. ఇవాళ (నవంబర్ 18) ఇన్ స్టాగ్రామ్ లో ప్రియాంక చోప్రా పోస్టు చూస్తే ఇదే స్పష్టమవుతోంది. వారణాసిలో హీరోగా నటిస్తున్న మహేష్ బాబు, విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్తో కలిసి హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది.
ఎంతో గౌరవం
మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్తో దిగిన ఫొటోలను ప్రియాంక చోప్రా మంగళవారం ఇన్ స్టాలో పోస్టు చేసింది.
‘‘తెలుగు, మలయాళం ఇండస్ట్రీలకు చెందిన ఈ ఇద్దరు లెజెండ్లతో పనిచేయడం, అది కూడా రాజమౌళి సినిమా కోసం కలవడం నాకు దక్కిన గౌరవం. ఇప్పుడేమో మూవీ రిలీజ్ కు ఏడాది ముందే ఇంటర్నేషనల్ మీడియా ముందు సినిమాను ప్రమోట్ చేస్తున్నాం. వాళ్ల రియాక్షన్స్, పెరుగుతున్న అంచనాలు ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. దేవుడి దయ వల్ల మీ అంచనాలను అందుకుంటాం. జై శ్రీరాం’’ అని క్యాప్షన్ లో పేర్కొంది ప్రియాంక చోప్రా.
రాజమౌళి ప్లాన్
లార్జర్ దేన్ లైఫ్ అనేలా సినిమాలు తీసే రాజమౌళి ప్రమోషన్లు కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ క్రియేట్ అయింది. వారణాసి సినిమా కోసం దీన్ని ఉపయోగించుకోవడానికి ఆయనకు ప్రియాంక చోప్రా ఓ ఆయుధంలా దొరికింది. ప్రియాంకాకు వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంది. అందుకే ఆమె సాయంతో ఇంటర్నేషనల్ స్థాయిలో వారణాసి ప్రమోషన్లు ఇరగదీయాలని రాజమౌళి ప్లాన్ చేశారు. ఈ సినిమా 2027 సమ్మర్ లో రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


