తెలుగులో టాప్ సీరియల్స్ అందించే స్టార్ మా మరో సీరియల్ ను తీసుకొస్తోంది. ఈ సీరియల్ పేరు గోదావరి. తండ్రి లేని కుటుంబానికి ఓ ఆడబిడ్డే ఎలా పెద్ద దిక్కు అయింది అనే ఎమోషనల్ స్టోరీతో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. మరి ఆ విశేషాలేంటో చూడండి.
గోదావరి సీరియల్ ప్రోమో

స్టార్ మాలోకి సరికొత్త సీరియల్ త్వరలోనే రాబోతోంది. తాజాగా ఆ ఛానెల్ ఈ సీరియల్ ప్రోమోను రిలీజ్ చేసింది. 3 నిమిషాల పాటు సాగిన ఈ ప్రోమో మొదట సరదాగా అనిపించినా.. చివరికి ఎమోషనల్ గా ముగిసింది. ఇది తండ్రి లేని నలుగురు కూతుళ్ల చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది. ఆ కుటుంబానికి జాహ్నవి అనే రెండో కూతురే పెద్ద దిక్కుగా ఉంటుంది. ఈ ప్రోమోలో ఆ తండ్రే తన నలుగురు కూతుళ్లను పరిచయం చేస్తున్నట్లుగా చూపించారు.
మొదట అమెరికా సంబంధం అంటే చాలు పెళ్లికి రెడీ అయిపోయే మొదటి కూతురిని, తర్వాత జీవితంలో ఏం చేయాలో తెలియని మూడో కూతురిని చూపిస్తారు. ఆ తర్వాత కుటుంబ భారాన్ని మోస్తున్న రెండో కూతురు జాహ్నవిని పరిచయం చేశారు. చివరిగా అనారోగ్యంతో బాధపడుతున్న తన నాలుగో కూతురిని ఆ తండ్రి చూపిస్తాడు. కానీ నిజానికి ఆ తండ్రే వాళ్ల జీవితాల్లో లేడని ప్రోమో చివర్లో చెప్పడం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తుంది.
గోదావరి సీరియల్ విశేషాలు
గోదావరి సీరియల్ టెలికాస్ట్ తేదీని స్టార్ మా వెల్లడించలేదు. అయితే త్వరలోనే రానుందని మాత్రం చెప్పింది. ఇందులో ఆ తండ్రి పాత్రలో సీనియర్ నటుడు రాజా రవీంద్ర నటించడం విశేషం. ఇక అతడు కాకుండా అనుమిత దత్త, గంటా మౌనిక, మధురిమ, సంధ్య వరలక్ష్మిలాంటి వాళ్లు నటించారు.
ఇది విజయ్ టీవీలో వచ్చే మహానది సీరియల్ కు తెలుగు రీమేక్. ఇప్పటికే ఈ తమిళ సీరియల్ కు కన్నడ, మలయాళ రీమేక్స్ టెలికాస్ట్ అవుతుండగా.. తెలుగులో గోదావరి పేరుతో స్టార్ మా తీసుకురానుంది. సీరియల్ టెలికాస్ట్ తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
{{/usCountry}}ఇది విజయ్ టీవీలో వచ్చే మహానది సీరియల్ కు తెలుగు రీమేక్. ఇప్పటికే ఈ తమిళ సీరియల్ కు కన్నడ, మలయాళ రీమేక్స్ టెలికాస్ట్ అవుతుండగా.. తెలుగులో గోదావరి పేరుతో స్టార్ మా తీసుకురానుంది. సీరియల్ టెలికాస్ట్ తేదీని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
{{/usCountry}}