ఎప్పుడో 29 ఏళ్ల కిందట అంటే 1997లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘బోర్డర్’లో భైరన్ సింగ్ రాథోడ్ పాత్రలో మెప్పించాడు సునీల్ శెట్టి. ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ ‘బోర్డర్ 2’లో తన కొడుకు అహాన్ శెట్టి నటించడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాడు. అయితే తన కొడుకు సినిమా అయినా సరే తాను ఇప్పుడే చూడనని అతడు ఓ కండిషన్ పెట్టుకున్నాడు. మిడ్-డేతో మాట్లాడుతూ తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో వెల్లడించాడు.
రూ. 500 కోట్లు వస్తేనే..

గత వారం జరిగిన బోర్డర్ 2 సినిమా ప్రీమియర్ షోకి సునీల్ శెట్టి హాజరయ్యాడు. కానీ సినిమా చూడలేదు. దీని గురించి అతడు మాట్లాడుతూ.. "ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల వసూళ్లు సాధించే వరకు నేను చూడనని మొదటి రోజు నుంచే చెప్పాను. ఇది నా కొడుకు అహాన్ కోసం నేను మొక్కుకున్న మొక్కు. ఇప్పటివరకు నేను ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదు. నన్ను తప్పుగా అనుకోవద్దు. ఇది అహంకారం కాదు. కేవలం సినిమాపై ఉన్న ఒక నమ్మకం మాత్రమే" అని వివరించాడు.
థియేటర్ బయటే కూర్చున్నా..
ప్రీమియర్ షో రోజున తన భార్య మానా శెట్టి, కూతురు అతియా శెట్టి, అల్లుడు కేఎల్ రాహుల్ అందరూ సినిమా చూశారని, కానీ తాను మాత్రం మూడున్నర గంటల పాటు థియేటర్ బయటే కూర్చున్నానని సునీల్ చెప్పాడు. బయట అందరినీ కలుస్తూ, వారి అభినందనలు స్వీకరిస్తూ సమయం గడిపానన్నాడు. తన భార్యకు సినిమా చాలా బాగా నచ్చిందని తెలిపాడు. 'ధురంధర్' తర్వాత మరో హిందీ సినిమా ఇంత బాగా ఆడుతుండటం సంతోషంగా ఉందన్నాడు.
వారితో కలిసి చూస్తా..
బోర్డర్ 2 సినిమా రూ.500 కోట్ల మార్కును దాటగానే తన కుమారుడు అహాన్, అతని స్నేహితులు, తన కుటుంబం, సన్నీ డియోల్, వరుణ్ ధావన్ అందరితో కలిసి సినిమా చూస్తానని సునీల్ శెట్టి చెప్పాడు. అహాన్ తీసుకున్న నిర్ణయాల పట్ల తనకు ఎప్పుడూ గర్వంగా ఉంటుందని పేర్కొన్నాడు.
{{/usCountry}}బోర్డర్ 2 సినిమా రూ.500 కోట్ల మార్కును దాటగానే తన కుమారుడు అహాన్, అతని స్నేహితులు, తన కుటుంబం, సన్నీ డియోల్, వరుణ్ ధావన్ అందరితో కలిసి సినిమా చూస్తానని సునీల్ శెట్టి చెప్పాడు. అహాన్ తీసుకున్న నిర్ణయాల పట్ల తనకు ఎప్పుడూ గర్వంగా ఉంటుందని పేర్కొన్నాడు.
{{/usCountry}}అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ‘బోర్డర్ 2’ జనవరి 23న విడుదలైంది. ఇందులో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి, మోనా సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆరు రోజుల్లోనే రూ.300 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. సునీల్ శెట్టి అంచనా వేస్తున్నట్లు రూ.500 కోట్ల మార్క్ దాటడం పెద్ద కష్టంగా అనిపించడం లేదు.