నటుడు నుండి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున చేసిన కామెంట్స్పై సూపర్ స్టార్ రజనీకాంత్ మౌనం వీడాడు. డీఎంకే (DMK) బెదిరింపుల వల్లే రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదని ఆధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై రజనీకాంత్ మంగళవారం (మార్చి 17)న తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు.
రజనీకాంత్ ఏమన్నాడంటే?

తమిళంలో రాసిన ఆ స్టేట్మెంట్లో రజనీకాంత్ ఇలా అన్నాడు. "నాపై చేసిన ఈ తప్పుడు వ్యాఖ్యలను ఖండిస్తూ, నాకు సపోర్ట్గా నిలిచిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తమిళనాడు ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి, తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ నైనార్ నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, తమిళనాడు మంత్రి రఘుపతి, తిరుమావళవన్, ఎస్.పి. వేలుమణి, నా ఫ్రెండ్ అన్నామలై, అర్జునమూర్తి, అన్బుమణి రామదాస్, జి.కె. వాసన్, జాన్ పాండియన్, పుగళేంది.. ఇలా వివిధ పార్టీలకు చెందిన పొలిటికల్ లీడర్లందరికీ థాంక్స్." అని చెప్పాడు.
ఆయన ఇంకా ఆ నోట్ లో మాట్లాడుతూ.. "నన్ను సపోర్ట్ చేసిన అమీర్, జి. ధనంజయన్ లాంటి నా సినీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కి, నక్కీరన్ గోపాల్, రంగరాజ్ పాండే లాంటి మీడియా మిత్రులకు, వీటన్నింటికీ మించి నన్ను ఎప్పుడూ పైకి లేపే నా దైవ సమానమైన ఫ్యాన్స్కు థాంక్స్. కాలం మాట్లాడదు, కానీ వేచి చూసి సరైన సమాధానం చెబుతుంది" అని పేర్కొన్నాడు.
అసలు వివాదం ఏంటి?
మార్చి 12న జరిగిన ఒక నిరసనలో విజయ్ కి చెందిన టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున మాట్లాడుతూ.. డీఎంకే ఫ్యామిలీ రజనీకాంత్ను బెదిరించిందని, అందుకే ఆయన పాలిటిక్స్ లోకి రాకుండా ఆగిపోయారని ఆరోపించారు.
గతంలో అంటే డిసెంబర్ 2020లో రజనీకాంత్ తను పార్టీ పెడుతున్నట్లు, 2021 అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేస్తానని అనౌన్స్ చేశాడు. కానీ ఆ తర్వాత తన హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోవడాన్ని 'దేవుడు ఇచ్చిన హెచ్చరిక'గా భావించి రాజకీయాల్లోకి వచ్చే ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎలక్టోరల్ పాలిటిక్స్ లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని అప్పుడు చెప్పాడు.
{{/usCountry}}గతంలో అంటే డిసెంబర్ 2020లో రజనీకాంత్ తను పార్టీ పెడుతున్నట్లు, 2021 అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేస్తానని అనౌన్స్ చేశాడు. కానీ ఆ తర్వాత తన హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోవడాన్ని 'దేవుడు ఇచ్చిన హెచ్చరిక'గా భావించి రాజకీయాల్లోకి వచ్చే ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎలక్టోరల్ పాలిటిక్స్ లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని అప్పుడు చెప్పాడు.
{{/usCountry}}మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) రీసెంట్ గా అనౌన్స్ చేసిన ప్రకారం.. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న కౌంటింగ్ ఉంటుంది.