Suriya: కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో సూర్య, వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons). 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో సూర్య కామెంట్స్ వైరల్ గా మారాయి.
సూర్య కామెంట్స్

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్య మాట్లాడుతూ దర్శకుడు వెంకీ అట్లూరి మేకింగ్ విజన్పై ప్రశంసల వర్షం కురిపించారు.
"దుల్కర్ సల్మాన్తో వెంకీ తీసిన 'లక్కీ భాస్కర్' సినిమా చూసిన తర్వాత నాకు చాలా నచ్చింది. ఆ వెంటనే వెంకీ దర్శకత్వంలో ఎలాగైనా ఒక సినిమా చేయాలని మనసులో బలంగా అనుకున్నాను’’ అని సూర్య తెలిపారు.
నాగవంశీ ఫోన్ చేసి
‘‘నా కోరిక దేవుడు విన్నాడేమో.. వెంటనే సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఫోన్ చేసి 'వెంకీ అట్లూరి డేట్స్ ఖరారయ్యాయి, మీ కాంబోలో సినిమా సెట్ చేద్దాం' అని చెప్పారు. అలా ఈ కాంబినేషన్ సాధ్యమైంది" అని సూర్య వెల్లడించారు.
ఆ బయోపిక్
ఈ వేదికపై సూర్య ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని బయటపెట్టారు. వెంకీ అట్లూరి మొదట తన వద్దకు ఒక బయోపిక్ కథతో వచ్చారని తెలిపారు. "నాగవంశీ కాంబినేషన్ ఒకే చేశాక, వెంకీ నా దగ్గరకు ఒక పవర్ ఫుల్ బయోపిక్ స్క్రిప్ట్ తెచ్చారు. ఆ కథ వినగానే చాలా బాగా అనిపించింది. కానీ ఆ సినిమాను మేం చేయలేదు" అని సూర్య చెప్పారు.
అదే కారణం
వెంకీ అట్లూరి తీసిన గత రెండు చిత్రాలు 'సార్' (తమిళంలో 'వాతి'), 'లక్కీ భాస్కర్' రెండూ కూడా గత శతాబ్దం నాటి పీరియాడిక్ బ్యాక్డ్రాప్లోనే సాగాయి. మళ్లీ వరుసగా మూడో సినిమా కూడా పీరియాడిక్ బయోపిక్గా తీస్తే ప్రేక్షకులు రొటీన్గా భావిస్తారని, 'మొనాటనీ'ని నివారించడానికి ఆ ప్రాజెక్ట్ను పక్కనపెట్టారు.
{{/usCountry}}వెంకీ అట్లూరి తీసిన గత రెండు చిత్రాలు 'సార్' (తమిళంలో 'వాతి'), 'లక్కీ భాస్కర్' రెండూ కూడా గత శతాబ్దం నాటి పీరియాడిక్ బ్యాక్డ్రాప్లోనే సాగాయి. మళ్లీ వరుసగా మూడో సినిమా కూడా పీరియాడిక్ బయోపిక్గా తీస్తే ప్రేక్షకులు రొటీన్గా భావిస్తారని, 'మొనాటనీ'ని నివారించడానికి ఆ ప్రాజెక్ట్ను పక్కనపెట్టారు.
{{/usCountry}}సూర్య కూడా సుదీర్ఘ విరామం తర్వాత మనసుకు హాయినిచ్చే ఒక క్లీన్ ఫ్యామిలీ, ఎమోషనల్ అండ్ హ్యూమరస్ డ్రామా చేయాలని భావించడంతో 'విశ్వనాథ్ అండ్ సన్స్' కథ పట్టాలెక్కింది.
ఎవరి కథ?
అయితే వెంకీ అట్లూరి, సూర్య కాంబోలో రావాల్సి ఉండి ఆగిపోయిన ఆ బయోపిక్ ఏ మహానాయకుడిది లేదా ఏ క్రీడాకారుడిది అనే దానిపై ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.